కర్ణాటకలో బీజేపీ ఆధిపత్యమేనా?
కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల విషయానికొస్తే.. ఈ ఫలితాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలవనున్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. అయితే.. ప్రజలు తమ పక్షానే ఉన్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఓటర్లు ఎవరివైపు ఉన్నారో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.