‘ధరణి వద్దన్న వారిని బంగాళఖాతంలో విసిరేయాలి’
TS: ధరణి పోర్టల్ వద్దన్న కాంగ్రెస్ నేతలను గిరాగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి పోర్టల్ లేకుంటే ఎన్నో హత్యలు జరిగేవని పేర్కొన్నారు. ధరణితోనే భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, భూ రిజిస్ట్రేషన్లు సులువుగా జరుగుతున్నాయని చెప్పారు. ధరణిపోతే దళారులదే రాజ్యం అవుతుందని తెలిపారు. ధరణితో గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని తెలిపారు.