వైసీపీ మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలు
TG: అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అంబేడ్కర్ చిత్రపటం పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని తెలిపారు. అంబేడ్కర్ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే పీవోకే.. పాకిస్థాన్ ఆధీనంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి అడుగడుగునా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని వ్యాఖ్యానించారు.
జిల్లా ADD వీడియో
శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!
మోటివేషనల్ కోట్స్ 27.04.24
మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై అగ్ని ప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుకు నిప్పు అంటుకున్నది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది.. మంటల్ని ఆర్పుతున్నారు.
AP: రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్.. కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టోను విడుదల చేశారు. 9 ప్రధాన హామీలతో మేనిఫెస్టో-2024ను ప్రకటించారు. అందులో నాలుగు పోర్టుల నిర్మాణం, వైఎస్ఆర్ చేయూతను రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
TG : BRS అధినేత కేసీఆర్.. తొలిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇన్స్టాగ్రాంలో కూడా KCR తన ఖాతాను తెరిచారు. ఇక నుంచి ఎక్స్ వేదికగా KCR విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. KCR ఎలాంటి విషయాలను ఎక్స్ ద్వారా పంచుకోబోతారనే దాని కోసం నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AP: చంద్రబాబు పాలనపై సీఎం జగన్ విమర్శలు చేశారు. మాట్లాడితే.. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబుతున్నారని.. కానీ ఆయన పాలనలో రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఉందని ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు సంపద ఎలా సృష్టించారని ప్రశ్నించారు. కానీ తన హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని తెలిపారు. అందుకే చంద్రబాబులాగా.. జగన్ ఎప్పుడూ పేదలను మోసం చేయడని పేర్కొన్నారు.
TG: రంగారెడ్డి జిల్లాలోని అలెన్ హెర్బల్ పరిశ్రమలో మరోసారి పేలుళ్లు కలకలం రేపాయి. రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు చెలరేగాయి. ఉదయం కంపెనీలో మంటలార్పిన తర్వాత మల్లీ మంటలు వ్యాపించాయి. రెండు అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా నిన్న వెల్డింగ్ చేస్తుండగా ఇదే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
AP : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని, మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రనేతలకు లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ "అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని నిర్మించలేని నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? అని షర్మిల ప్రశ్నించారు.
AP: సీఎం జగన్ తన నుదుటిపై బ్యాండేజ్ను తీసేయడంపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘‘ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం … జూమ్ చేసి చూస్తే.. దెబ్బ మటుమాయం’’ అని పేర్కొన్నారు. కాగా విజయవాడలో రాయిదాడి ఘటనలో జగన్ నుదుటిపై గాయం అయ్యింది. వైద్యం అనంతరం బ్యాండేజ్ ధరించిన సీఎం.. నేడు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో దానిని తొలగించారు.
TG: ఎక్సైజ్ శాఖకు వాణిజ్య పన్నుల శాఖ షోకాజ్ నోటీసులు జారీచేసింది. డిస్టిలరీలు, డిపోలకు చేసిన హోలోగ్రామ్ల అమ్మకాలపై 18% చొప్పున జీఎస్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. 2017 నుంచి అమ్మిన హోలోగ్రామ్లపై రూ.54.53 కోట్ల జీఎస్టీ చెల్లించాలని తెలిపింది. ఒక్కో హోలోగ్రామ్ 30 పైసల చొప్పున అమ్మకాలు చేసినట్లు వెల్లడించింది. ఏడు రోజుల్లో జీఎస్టీ చెల్లించకుంటే చట్టప్రకారం వెళ్తామని హెచ్చరించింది.
TG: బీజేపీ శక్తులను ఓడించడానికి కాంగ్రెస్కు మద్దతిచ్చేందుకు సీపీఎం నాయకులు అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీపీఎం నేతలతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఎం సహకారంతో భవిష్యత్లో ముందుకు వెళ్తామన్నారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టినట్లు పేర్కొన్నారు.
AP: గత ప్రభుత్వంలా కాకుండా.. ఇచ్చిన హమీలను అమలు చేసి హీరోలా ప్రజల వద్దకు వెళుతున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. కోవిడ్ వంటి ఆటంకాలు ఎదురైనా.. తగ్గకుండా ముందుకు వెళ్లామని చెప్పారు. అలాగే, 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను చూపించి.. సెటైర్లు వేశారు. అప్పట్లో ఇచ్చిన ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు.
AP: తాడేపల్లిలో జరుగుతున్న మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ తన నుదుటిపై ఉన్న బ్యాండేజ్ను తీసేశారు. దీంతో ‘‘దెబ్బ మానిందనా? చెల్లి చెప్పిందనా?’’ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయవాడలో జరిగిన రాయిదాడి తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందిన జగన్.. గాయంపై బ్యాండేజ్ వేసుకున్నారు. ఇటీవల వైఎస్ సునీత.. తాను డాక్టర్గా చెబుతున్నానని, బ్యాండేజ్ తీయకుంటే గాయంమానదని జగన్కు సూచించారు.
AP: మేనిఫెస్టోను తాము భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. ఇతర పార్టీలు మాత్రం మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాయని విమర్శించారు. అయితే, తమ మేనిఫెస్టో మాత్రం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలుచేశామని చెప్పారు. చంద్రబాబు తరహాలో అమలు చేయలేని హామీలు ఇద్దామని తన శ్రేయాభిలాషులు చెప్పారని.. అయినా తాను వినలేదని తెలిపారు.
AP: పవన్ కల్యాణ్కు మద్దతుగా నటుడు వరుణ్తేజ్.. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న వరుణ్కు జనసేన నేతలు స్వాగతం పలికారు.
TG: కాంగ్రెస్ నేతలకు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘‘వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలు, విద్యార్థుల భరోసా కార్డులు ఇచ్చినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నిరూపించకపోతే మీరందరూ పోటీనుంచి తప్పుకుంటారా?’’ అని సవాల్ చేశారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కూడా ఇలాంటి సవాలే చేశారు.
అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. అయితే అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్(60) సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ ‘భామ’.. తాజాగా మిస్ యూనివర్స్ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన అందాల పోటీలో ‘మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్’ టైటిల్ గెలుచుకున్నారు.
TG: బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. రాజకీయ పార్టీల్లో చరిత్రలో బీఆర్ఎస్ది ప్రత్యేక స్థానం అని చెప్పుకొచ్చారు. ఆటుపోట్లు అధిగమించేందుకు బలమైన పునాదులు వేసింది కార్యకర్తలేనని పేర్కొన్నారు.
AP : కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఇప్పుడు మరో బహిరంగ లేఖ విడుదల చేశారు. బై బై YCP అనే నినాదం నిజం కావాలంటే.. కాపుల ఓట్లే కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కులాలే విజయావకాశాలను శాసిస్తున్నాయని ఆయన వివరించారు. కాపుల ఓట్లు జనసేనకు కలవడంతో కూటమి ఓటింగ్ 52 శాతానికి పెరిగిందన్నారు.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తా చాటారు. షాంఘైలో నిర్వహించిన మిక్స్డ్ డబుల్ ఈవెంట్లలో మూడు బంగారు పతకాలు సాధించారు. జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ బృందానికి స్వర్ణం లభించింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా జ్యోతిసురేఖ మెరిసింది. పురుషుల టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ప్రియాన్స్, ప్రీతమేష్ బృందానికి స్వర్ణ పతకం లభించింది.