శ్రీకృష్ణ జన్మభూమి కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మథుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు కమిటీ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. 18 కేసుల్లో 15 కేసులను కలిపి విచారించాలని అభ్యర్థించినందున ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి సూచించింది. వివాదానికి సంబంధించిన 15 కేసులను కలిపి విచారించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ వ్యతిరేకించింది.