shape

Lifestyle ChotaNews

సూర్యనారాయణ ముందస్తు బెయిల్ విచారణ వాయిదా

సూర్యనారాయణ ముందస్తు బెయిల్ విచారణ వాయిదా

AP: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ 7వ ఏడీజే కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. కాగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో ఐదుగురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఏ5గా సూర్యనారాయణ పేరును చేర్చారు.

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

CHOTA SPECIAL: గే జంట.. కవలల పంట

స్వలింగ వివాహాలను నేరంగా భావించే దేశం మనది. ఇలాంటి దేశంలో ఇద్దరు గే జీవనం కొనసాగించడమే కాదు.. ఇద్దరు పిల్లలను సైతం పెంచగలుగుతున్నారు. ఈ గే జంట గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.

‘AIని సృష్టించడం భారతీయ స్టార్లప్‌ల వల్ల కాదు’

‘AIని సృష్టించడం భారతీయ స్టార్లప్‌ల వల్ల కాదు’

కొన్ని రోజులుగా OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ChatGPT వంటి ఏఐని సృష్టించడం భారతీయ స్టార్టప్‌లకు చాలా కష్టమని తెలిపారు. ఎంత కష్టమైనప్పటికీ.. పోటీ పడడం అందరి పని కాబట్టి ఎలాగైనా ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. కాగా, త్వరలో ఏఐకి సంబంధించి పలు నిబంధనలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్

తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్‌ రీఓపెన్‌పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఈనెల 12 నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు తెలిపారు. దీంతో, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

మీ అభిప్రాయం కూడా చెప్పండి: సుప్రీంకోర్టు

మీ అభిప్రాయం కూడా చెప్పండి: సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో ఉబర్‌.. ర్యాపిడోవంటి బైక్ ట్యాక్సీల నిషేధం వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు ఇరువర్గాల పిటిషన్లను సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు అందజేయాలని కోర్టు సిబ్బందికి సూచించింది. వాటిని పరిశీలించి కేంద్రం తమ అభిప్రాయం తెలియజేస్తే.. దానిని పరిగణనలోకి తీసుకొని విచారిస్తామని వెల్లడించింది.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ద‌ర్యాప్తు సంస్థల‌ను దుర్వినియోగం చేస్తోంది: గెహ్లాట్

ద‌ర్యాప్తు సంస్థల‌ను దుర్వినియోగం చేస్తోంది: గెహ్లాట్

ఎన్నిక‌ల జరిగే రాష్ట్రాల్లోనే ఈడీ దాడులు చేప‌డుతోంద‌ని రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు సంస్థల‌ను దుర్వినియోగం చేస్తోంద‌ని విమర్శించారు. సికార్ జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన తరుణంలో ఆయన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి.

‘విరాటపర్వం’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ జోనర్ ఇదేనట

‘విరాటపర్వం’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ జోనర్ ఇదేనట

విరాటపర్వం మూవీ డైరెక్టర్‌ వేణు ఉడుగుల తన నెక్స్ట్ మూవీని ఒక టాప్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 1990 సంవత్సరం బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణ గ్రామీణ కథాంశంతో పవర్ ఫుల్ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో లీడ్ రోల్‌లో నటించనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.

రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు: మాజీ సీఎం

రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు: మాజీ సీఎం

ప్రస్తుత హర్యానా ప్రభుత్వం పీపీ ప్రభుత్వం అంటే పోర్టల్, పోలీసుమని హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా విమర్శించారు. షహాబాద్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై అభియోగాలు పోలీసుల లాఠీ ఛార్జ్‌పై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొదట ‘మేరీ ఫసల్ మేరా బ్యోరా’ పోర్టల్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు రైతులు పేమేంట్ అడిగితే పోలీసులను పంపారని ఆరోపించారు.

పవన్ వీకెండ్ పర్యాటకుడు: మల్లాది విష్ణు

పవన్ వీకెండ్ పర్యాటకుడు: మల్లాది విష్ణు

AP: జనసేనాని పవన్ కల్యాణ్ వీకెండ్ పర్యాటకుడని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాము పవన్ కల్యాణ్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం అవుతానని చంద్రబాబు ఇంకా పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఎవరెన్ని కూటములు కట్టినా తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

WTC FINAL: భారత్ ఆలౌట్

WTC FINAL: భారత్ ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ విజయావకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. ఈ కీలక పోరులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.  భారత బ్యాటర్లలో రహానే (89), శార్దూల్ ఠాకూర్ (51) పరుగులతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌ 3, బోలాండ్‌, కామెరూన్‌ గ్రీన్‌, మిచెల్‌ స్టార్క్‌ తలో 2… నాథన్‌ లైయాన్‌ ఒక వికెట్‌ తీశారు.

ఆ సంవత్సరాల మధ్య పడిన చలాన్ల రద్దు!

ఆ సంవత్సరాల మధ్య పడిన చలాన్ల రద్దు!

2017 నుంచి 2021 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వాహనంతో సంబంధం లేకుండా డిసెంబర్ 31, 2016 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య జారీ అయిన చలాన్లకు ఈ రద్దు వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి.

పెళ్లికి సిద్ధమైన మరో హీరోయిన్..?

పెళ్లికి సిద్ధమైన మరో హీరోయిన్..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాగా డబ్బున్న ఓ బిజినెస్‌మాన్‌ను ఈ భామ పెళ్లి చేసుకోనున్నట్లు ఫుల్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వీళ్ళ నిశ్చితార్థానికి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. నిశ్చితార్థం తర్వాత పెళ్లి గురించి మీడియా ద్వారా అభిమానులకు చెప్పడానికి నిత్యామీనన్ రెడీ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంచిర్యాల నుంచే గొర్రెల పంపిణీ: కేసీఆర్

మంచిర్యాల నుంచే గొర్రెల పంపిణీ: కేసీఆర్

TS: మంచిర్యాల నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం కేసీఆర్ చెప్పారు. మంచిర్యాలలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చాలా అంశాల్లో నంబర్ వన్‌గా ఉందన్నారు. నోట్ల రద్దు, కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా అభివృద్ధిలో ముందుకు సాగామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

కొల్హాపూర్ ఘర్షణలపై స్పందించిన నవనీత్ రాణా

కొల్హాపూర్ ఘర్షణలపై స్పందించిన నవనీత్ రాణా

ఈ ఔరంగజేబు సమస్యపై జరుగుతున్న రగడతో మహారాష్ట్రలో ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదని అమరావతి ఎంపీ నవనీత్ రాణా అన్నారు. మహారాష్ట్రను విభజించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని పొగుడుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కొల్హాపూర్‌లో ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఎక్కువ స్టార్టప్‌లు ఉన్న రాష్ట్రాలు ఇవే..

ఎక్కువ స్టార్టప్‌లు ఉన్న రాష్ట్రాలు ఇవే..

ఇటీవలికాలంలో స్టార్టప్‌ల జోరుగా బాగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం డేటాను విడుదల చేసింది. దాని ప్రకారం, నవంబర్ 2022 నాటికి మహారాష్ట్రలో అత్యధికంగా 13,519 స్టార్టప్‌లు ఉన్నాయి. కర్ణాటక (8,881), ఢిల్లీ (8,636), ఉత్తరప్రదేశ్ (6,654), గుజరాత్ (4,920), హర్యానా (3,985), తమిళనాడు (3,953) ఉండగా.. తెలంగాణలో 3,875 స్టార్టప్‌లు ఉన్నాయి.

రేపే బాలయ్య మూవీ రీ-రిలీజ్

రేపే బాలయ్య మూవీ రీ-రిలీజ్

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఆయన నటించిన ‘భైరవ ద్వీపం’ మూవీని రీ-రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీని ఇప్పుడు 4Kలో రీ-రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో.

12 నుంచి స్కూళ్లు: మంత్రి  బొత్స సత్యనారాయణ

12 నుంచి స్కూళ్లు: మంత్రి బొత్స సత్యనారాయణ

AP: రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని, అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందనుందని పేర్కొన్నారు.

ట్రోలర్స్‌‌కు కోహ్లీ పంచ్

ట్రోలర్స్‌‌కు కోహ్లీ పంచ్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ పైనల్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 14 పరుగులకే ఔట్ కావడంపై విమర్శలకు తావిచ్చింది. ఈ విమర్శలకు కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీ రూపంలో జవాబు ఇచ్చాడు. ‘ఇతరుల అయిష్టాన్ని అంగీకరించగల సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడే జైలును తలపించే వారి అభిప్రాయాల నుంచి బయట పడగలుగుతాం’ అనే అర్థం వచ్చేలా సందేశాన్ని పోస్ట్ చేశాడు.

3.5 కోట్లమందికి ఇళ్లు ఇచ్చాం: జైశంకర్

3.5 కోట్లమందికి ఇళ్లు ఇచ్చాం: జైశంకర్

హోమ్ ఓనర్‌షిప్ ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించారని , అందుకే గడిచిన తొమ్మిదేళ్లలో ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించారని కేంద్రమంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల మందికి పైగా ప్రజలకు ఇళ్లను నిర్మించామని తెలిపారు. అది ప్రపంచాన్నే షాకింగ్ గురి చేసిందని పేర్కొన్నారు. ఆ ఇళ్లలో జపాన్ దేశంలోని ప్రజలందరూ ఉండొచ్చని చెప్పారు.

ఎవరో కూడా తెలియకుండా చంపేశాడు

ఎవరో కూడా తెలియకుండా చంపేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టులో జరిగిన గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జీవాను హత్య చేసేందుకు నిందితుడు విజయ్ యాదవ్ రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. హత్యకు గురయ్యే వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే రూ. 20 లక్షల డీల్‌ కుదరడంతో విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు.

కలెక్టరేట్ ప్రారంభించిన కేసీఆర్

కలెక్టరేట్ ప్రారంభించిన కేసీఆర్

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడే రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్‌ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశారు. గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కొబ్బరికాయ కొట్టారు.

వెకేషన్‌లో యాంకర్ సుమకు గాయాలు

వెకేషన్‌లో యాంకర్ సుమకు గాయాలు

యాంకర్ సుమ కాలికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆమె ఇటీవల తన పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్లారట. అక్కడ అటు ఇటు తిరగడంతో కాలికి గాయాలు అయ్యాయని.. అందుకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇక కాలివేళ్లకు ప్లాస్టర్ ఉన్న కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. ఈ కారణంగానే ఆమె ‘ఆదిపురుష్’ ఈవెంట్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.

‘మహిళలు $61 ట్రిలియన్లు నష్టపోయారు’

‘మహిళలు $61 ట్రిలియన్లు నష్టపోయారు’

అమెరికాలోని పనిచేసే మహిళలు 1967 నుంచి ఇప్పటివరకు ఏకంగా $61 ట్రిలియన్ల వేతనాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ నివేదిక తెలిపింది. మహిళలకు 2056 తర్వాతగాని పురుషులతో సమానమైన వేతనం లభించదని నివేదిక పేర్కొంది. యూఎస్ ప్రభుత్వ డేటా ప్రకారం, గతేడాది పురుషుడు సంపాదించిన ప్రతి డాలర్‌కు మహిళలు 82 సెంట్లు మాత్రమే సంపాదించారు.

ఆ పార్టీలోని నాయకులంతా జోకర్లే: చంద్రబాబు

ఆ పార్టీలోని నాయకులంతా జోకర్లే: చంద్రబాబు

AP: CM జగన్‌కు కోర్టులో మేలు జరగాలని, వివేకా హత్య కేసులో తప్పించాలని దేవాదాయ శాఖ మంత్రి పూజలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రతి మతానికి కొన్ని సంప్రదాయాలుంటాయని, వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిదికాదన్నారు. రైతుబజారును కూడా తాకట్టు పెట్టాలని ఆర్థికమంత్రి యత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో ఉన్న నాయకులంతా జోకర్లేనని ఈ సందర్భంగా చంద్రబాబు ఎద్దేవా చేశారు.

MANUU: హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

MANUU: హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

నిరుద్యోగులకు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) గుడ్‌న్యూస్ చెప్పింది. పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 47 ఖాళీలను భర్తీ చేస్తోంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

12న పల్నాడుకు సీఎం జగన్

12న పల్నాడుకు సీఎం జగన్

AP: సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 12న నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారు.

ఆ సమావేశానికి నేను హాజరవుతున్నా: ఎంకే స్టాలిన్

ఆ సమావేశానికి నేను హాజరవుతున్నా: ఎంకే స్టాలిన్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సమావేశం కానున్నారు. జూన్ 23న జరిగే ఈ సమావేశానికి పట్నా వేదిక కానుంది. ఈ సమావేశానికి తాను కూడా హాజరవుతున్నట్లు తమిళ నాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలు అన్నీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

WTC FINAL: ఆ రికార్డు రహానేదే!

WTC FINAL: ఆ రికార్డు రహానేదే!

టీమిండియా స్టార్‌ అజింక్య రహానే టెస్టు పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. దాదాపు 512 రోజుల తర్వాత నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ద్వారా టెస్టు ఆడుతున్న రహానే అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలోనే రహానే టీమిండియా తరపున డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్థసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

చీరకట్టులో సామ్ అదిరింది..

చీరకట్టులో సామ్ అదిరింది..

పలు సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో అభిమానులను ఫిదా చేసింది.

WTC ఫైనల్స్‌ ఇంగ్లండ్‌లోనే ఎందుకు?

WTC ఫైనల్స్‌ ఇంగ్లండ్‌లోనే ఎందుకు?

WTC ఫైనల్‌ను ఐసీసీ ఇంగ్లండ్‌లోనే నిర్వహిస్తుంది. ఎందుకంటే.. భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్ లాంటి ఆసియా దేశాల్లో జూన్‌ నెలలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ లాంటి యూరోప్‌ దేశంలోనే పరిస్థితులు మ్యాచ్‌కు కాస్త అనుకూలంగా ఉంటాయి. అందుకే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది.

20 లక్షల ఉద్యోగాల కల్పిస్తాం: చంద్రబాబు

20 లక్షల ఉద్యోగాల కల్పిస్తాం: చంద్రబాబు

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మంగళగిరిలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఐ-టీడీపీ కృషివల్లనే 21 లక్షలమంది సభ్యత్వం నమోదైందని ప్రశంసించారు. టీడీపీ గెలిచాక ఏడాదికి మూడు సిలెండర్లు, ఉచిత బస్సుప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలతో మహిళలకు లబ్ధి చేకూరుస్తామన్నారు. బీసీల భద్రతకు చట్టం తెస్తామని చెప్పారు.

అది BCCIకి కనిపించలేదా?: పాక్ మాజీ క్రికెటర్

అది BCCIకి కనిపించలేదా?: పాక్ మాజీ క్రికెటర్

WTC ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ట్యాంపరింగ్‌కు పాల్పడిందని పాక్ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ ఆరోపించారు. విరాట్ కోహ్లి ఔటవ్వడం గురించి మాట్లాడుతూ.. ‘స్టార్క్ చేతిలో బాల్ ఉండగా.. బయటకు మెరుస్తూ కనిపించింది. కానీ విసిరినప్పుడు మాత్రం మరోవైపుకి వెళుతోంది. పూజారాకు కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనూ ఇలాగే జరిగింది. BCCIకి ఇదంతా కనిపించలేదా’ అని ప్రశ్నించాడు.

OTTలోకి బ్లాక్ బస్టర్ మూవీ..!

OTTలోకి బ్లాక్ బస్టర్ మూవీ..!

విజయ్ ఆంటోని హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బిచ్చగాడు-2’. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. దీని ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు దక్కించుకోగా.. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్

సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్

TS: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని సీఎం కేసీఆర్ నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు తీశారని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేమంటూ మంత్రి కేటీఆర్ చేతులెత్తేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు బిశ్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 1.91లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేని చేతకాని దద్దమ్మలని ఎద్దేవా చేశారు.

రహానే అరుదైన రికార్డు

రహానే అరుదైన రికార్డు

టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే టెస్టుల్లో 5వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఆస్ల్రేలియాతో జరుగుతోన్న WTC ఫైనల్ మ్యాచ్‌లో రహానే ఈ రికార్డు సాధించాడు.

తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణయుగం

తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణయుగం

తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు లేవని, వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తలమానికం తెలంగాణ అని తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది.

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు

వైఎస్ భాస్కర్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది.

₹50,000 కోట్లు సమీకరించనున్న SBI

₹50,000 కోట్లు సమీకరించనున్న SBI

వచ్చే (2024) ఆర్థిక సంవత్సరంలో డెట్ సాధనాల ద్వారా ₹50,000 కోట్ల వరకు సమీకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సిద్ధమైంది. భారతీయ, విదేశీ మార్కెట్ల ఈ మొత్తాన్ని సమీకరించనున్నట్లు బ్యాంకు తెలిపింది. నిధుల సమీకరణను బ్యాంక్ సెంట్రల్ బోర్డు ఆమోదించినట్లు పేర్కొంది. కాగా, FY23 సంబంధించి దాదాపు ₹50,232 కోట్ల వార్షిక నికర లాభాన్ని SBI ఆర్జించింది.

ICF: 782 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ICF: 782 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ.. 2023-24 సంవత్సరానికి గానూ యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలభర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనుంది. ట్రేడును అనుసరించి కనీసం 50శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 30తో ముగియనున్నది.

మహేశ్ బాబు కొత్త లుక్.. అదిరిందిగా..

మహేశ్ బాబు కొత్త లుక్.. అదిరిందిగా..

హీరో మహేశ్‌ బాబు తన తాజా ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫొటోలను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

కాంగ్రెస్‌పై కల్వకుంట్ల కవిత ధ్వజం

కాంగ్రెస్‌పై కల్వకుంట్ల కవిత ధ్వజం

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. సీఎం కేసీఆర్ పరిపాలనను విమర్శించే నైతికత ఏ పార్టీకి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కల్పిస్తున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ప్రతి పౌరుడు, ‘‘టూరిస్టులు’’ ప్రశంసించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకుంటే మంచిదని హితవు పలికారు.

VIDEO: మంత్రముగ్దులను చేస్తున్న మడ అడవులు

VIDEO: మంత్రముగ్దులను చేస్తున్న మడ అడవులు

కర్ణాటక రాష్ట్రంలోని ఒక సుందరమైన తీర పట్టణం ‘గోకర్ణ’. అక్కడి బీచ్‌లు, ఆలయాలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటాయి. తాజాగా కర్ణాటక టూరిజం డిపార్టమెంట్‌ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో గోకర్ణకు సమీపంలోని మడ ఆడవులకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తే.. తీరప్రాంతాన్ని విపత్తుల సమయంలో అమ్మలా కాపాడే మడ అడవులు ప్రకృతి రమణీయతతో చూపరులను కట్టిపడేస్తున్నాయి.

అమర్‌నాథ్ యాత్రపై ఉన్నత స్థాయి సమావేశం

అమర్‌నాథ్ యాత్రపై ఉన్నత స్థాయి సమావేశం

జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్‌నాథ్ యాత్ర జరగనుంది. దీంతో 62 రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో యాత్ర సజావుగా సాగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

DEVARA: స్టన్నింగ్ షూట్ షురూ..!

DEVARA: స్టన్నింగ్ షూట్ షురూ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా సినిమా ‘దేవర’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్‌పై ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీకి సంబంధించి భారీ షెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌పై స్టన్నింగ్ సీక్వెన్స్‌ని మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

కమలం వికసించడం ఖాయం: బండి

కమలం వికసించడం ఖాయం: బండి

తెలంగాణ అభివృద్ధే తమ లక్ష్యమని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారన్నారు. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఈనెల 15న సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ సభకు భారీగా తరలివచ్చి బీజేపీ బలమేంటో కార్యకర్తలు చూపాలన్నారు. రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని సంజయ్‌ వెల్లడించారు.