యువకుడిపై గొడ్డలితో దాడి
ఏలూరు: టి.నర్సాపురం మండలం మక్కినవారి గూడెంలో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి జరిగింది. స్థానిక ఎస్సై మహేశ్వరరావు వివరాల ప్రకారం..మాక్కినవారి గూడెంలో పొలిమేర నాగరాజుపై అదే గ్రామానికి చెందిన అబ్బదాసరి కాంతారావు పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో నాగరాజుకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.