shape

Education ChotaNews

లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు

లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు

AP: గతేడాది ఆగస్టులో తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు. టీటీడీ బంధించిన నాలుగో చిరుతే.. లక్షితపై దాడిచేసిందని అధికారుల విచారణలో తేలింది. కాగా.. మొత్తం ఆరు చిరుతలను టీటీడీ బంధించింది. దాడి చేసిన చిరుతతో పాటు అన్ని చిరుతలను జూ పార్కులోనే సంరక్షించాలని అధికారులు నిర్ణయించారు.

జనంలోకి చంద్రబాబు.. ప్రజాగళం యాత్రలకు రెడీ

జనంలోకి చంద్రబాబు.. ప్రజాగళం యాత్రలకు రెడీ

AP : TDP అధ్యక్షుడు చంద్రబాబు 22వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దాదాపు 20రోజులపాటు 60 నియోజకవర్గాలలో పర్యటించేలా రూట్‌ మ్యాప్ సిద్ధం చేశారు. కొంత విరామం ఇచ్చి రెండో విడత పర్యటనలు ప్రారంభిస్తారని TDP నేతలు తెలిపారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటనలు నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటనలపై ఉండవల్లి నివాసంలో ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు.

రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ మద్యంకేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసిందని, ఈ తరుణంలో రిట్‌ పిటిషన్‌పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని న్యాయస్థానానికి కవిత తరపు న్యాయవాది విక్రమ్‌‌చౌదరి తెలిపారు. కాగా.. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీని ప్రకారం..

ఆస్తిపన్ను వసూళ్లపై ‘ఎన్నికల’ పిడుగు

ఆస్తిపన్ను వసూళ్లపై ‘ఎన్నికల’ పిడుగు

HYD : ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ప్రభావం చూపనున్నది. ఈ నేపథ్యంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2100 కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ. 1488.47 కోట్లు మాత్రమే వసూలైంది. బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ అందిస్తూ వన్‌ టైం సెటిల్‌మెంట్‌(OTS) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 18 రోజుల్లో రూ.55 కోట్ల మేర మాత్రమే OTS కలెక్షన్లు వచ్చాయి.

తెరుచుకోనున్న తులిప్‌ గార్డెన్‌

తెరుచుకోనున్న తులిప్‌ గార్డెన్‌

జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్‌ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్‌ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది.

సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం

సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) భేటీ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం జరుగుతున్న ఈ భేటీలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చి.. ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే భేటీలో సోనియాగాంధీ, రాహుల్‌‌గాంధీలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కీలకనేతలు హాజరయ్యారు.

తెలంగాణ ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. తెలంగాణ ఇంఛార్జీ గవర్నర్‌‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. కాగా.. తెలంగాణ గవర్నర్ హోదాకు తమిళిసై సౌందరరాజన్ నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మహేశ్‌‌బాబును జపాన్‌కు తీసుకొస్తా: రాజమౌళి

మహేశ్‌‌బాబును జపాన్‌కు తీసుకొస్తా: రాజమౌళి

సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్న మూవీపై డైరెక్టర్ రాజమౌళి ఓ అప్డేట్ ఇచ్చారు. జపాన్‌లో పర్యటిస్తున్న రాజమౌళి.. ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మహేశ్‌‌బాబుతో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తిచేసి జపాన్‌లోనూ రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌‌ను ఇక్కడికి తీసుకొస్తాను’’ అని జక్కన్న వ్యాఖ్యానించారు.

ముందు టారిఫ్‌ సబ్సిడీ చెల్లించాల్సిందే

ముందు టారిఫ్‌ సబ్సిడీ చెల్లించాల్సిందే

HYD : విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌-62 ప్రకారం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఉచిత లేదా రాయితీ విద్యుత్తు అందించాలంటే సంబంధిత పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ముందుగానే టారిఫ్‌ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(TSERC)వెల్లడించింది. ప్రభుత్వం ముందస్తు చెల్లింపులు చేయకపోతే రాయితీ లేదా ఉచిత విద్యుత్తు అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారమే కమిషన్‌ విధులు నిర్వర్తిస్తుందని పేర్కొంది.

చట్నీస్ హోటల్స్‌పై ఐటీ దాడులు

చట్నీస్ హోటల్స్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు మంగళవారం కలకలం రేపాయి. నగరంలోని ప్రముఖ హోటల్ అయిన ‘చట్నీస్’ బ్రాంచుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్నీస్ ఓనర్, వారి బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఢిల్లీకి పురందేశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

ఢిల్లీకి పురందేశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

AP : రాష్ట్ర BJP చీఫ్ పురందేశ్వరి హస్తినకు బయలుదేరి వెళ్లారు. APలో BJP 6పార్లమెంటు, 10అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 16స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలతో పురందేశ్వరి చర్చించనున్నారు. BJPపోటీ చేసే స్థానాలపై కూడా స్పష్టత రావడంతో.. ఆశావహుల జాబితాను తీసుకుని ఆమె ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. దీనిపై నేడు, రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

YCP నేతలకు జగన్ మార్గదర్శకాలు ఇవే

YCP నేతలకు జగన్ మార్గదర్శకాలు ఇవే

AP: YCPనేతలకు CM జగన్ కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున నాయకులంతా తమ గెలుపు కోసం పక్కా ప్రణాళిక రచించుకోవాలని కోరారు. అభ్యర్థులంతా ప్రతి గ్రామసచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని దిశానిర్దేశం చేశారు. వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలిసి సంక్షేమ పథకాలను వివరించాలని అభ్యర్థులకు జగన్ సూచించారు. నాయకులు పార్టీ శ్రేణులను ఏకతాటి­పైకి తీసుకువచ్చి ముందుకు సాగాలని చెప్పారు.

కర్ణాటకలో బీజేపీ ఆధిపత్యమేనా?

కర్ణాటకలో బీజేపీ ఆధిపత్యమేనా?

కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. ఈ ఫలితాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలవనున్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. అయితే.. ప్రజలు తమ పక్షానే ఉన్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఓటర్లు ఎవరివైపు ఉన్నారో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ సూచీల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మంగళవారం ఉదయం సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నేటి ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 410 పాయింట్లు పతనమై 72,337 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు కుంగి 21,946 వద్ద కొనసాగుతున్నాయి.

తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ నియామకం జరిగేనా?

తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ నియామకం జరిగేనా?

TG : గవర్నర్ తమిళి సై రాజీనామాతో.. కొత్త గవర్నర్ నియామకం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త గవర్నర్ నియామకం ఆలస్యమవుతుంది. అందుకే ఇన్‌ఛార్జి గవర్నర్‌ను నియమించనున్నారని తెలిసింది. తెలంగాణకు.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఇన్‌ఛార్జి గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

జగన్ ఎన్నికల ప్రచారానికి RTC బుల్లెట్ ప్రూఫ్ బస్సులు

జగన్ ఎన్నికల ప్రచారానికి RTC బుల్లెట్ ప్రూఫ్ బస్సులు

AP: సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి RTC బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పంజాబ్‌ లోని అంబాల వద్ద గల JCBLకంపెనీలో వాహనాలను RTC అధికారులు తయారు చేయించారు. ఇప్పటికే విజయవాడకు ఒక బుల్లెట్ గ్రూప్ బస్సు.. మూడు మినీ బస్సులు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అద్దె ప్రాతిపాదికన బస్సులను తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

కడప జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం నెలకొంది. కొర్రపాడు గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతిచెందింది. నిన్న పరీక్ష ముగిశాక మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది.వెంటనే గమనించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

కలెక్టరేట్‌లోనే నామినేషన్ల స్వీకరణ

కలెక్టరేట్‌లోనే నామినేషన్ల స్వీకరణ

HYD : మల్కాజిగిరి లోక్‌సభ నామినేషన్లు జిల్లా కలెక్టరేట్‌లోనే స్వీకరిస్తామని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ..మల్కాజిగిరి లోక్‌సభ స్థానం జనరల్‌ కావటంలో ఎవరైనా నామినేషన్లు వేయొచ్చని ప్రకటించారు. దేశవ్యాప్తంగా అధిక ఓటర్లున్న నియోజకవర్గంగా మల్కాజిగిరి లోక్‌సభకు గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ లోక్‌సభ పరిధిలో 37,28,417 ఓటర్లు ఉన్నారన్నారు.

ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి

ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వీరిని చుట్టుముట్టారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందినవారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరిపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం.

బుద్వేల్‌, మోకిల లేఅవుట్లకు మోక్షం

బుద్వేల్‌, మోకిల లేఅవుట్లకు మోక్షం

HYD: ఎట్టకేలకు కీలమైన బుద్వేల్‌, మోకిల HMDA లేఅవుట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభించింది. ఈ రెండు లేఅవుట్లలో ప్లాట్లను వేలం ద్వారా గత ప్రభుత్వం విక్రయించింది. లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించినప్పటికీ వసతుల కల్పనలో HMDA తాత్సారం చేసింది. అయితే ఇటీవలే రూ.400కోట్ల విలువైన అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచారు. 4సంస్థలు టెండర్లు దాఖలు చేయగా…NNC ఈ పనులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరో ఏడాది పాటు యూరియా దిగుమతులు

మరో ఏడాది పాటు యూరియా దిగుమతులు

దేశంలో యూరియా కొరత లేకుండా చేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఏడాది పాటు యూరియాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ‘ఇండియా పొటాష్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో ప్రభుత్వ అకౌంట్‌ ద్వారా యూరియా దిగుమతులు జరగనున్నాయి. ఈ మేరకు డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

AP: రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్ధుల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఏప్రిల్ 4వరకు మూల్యాంకనం కొనసాగనుంది. ఏప్రిల్ రెండు, మూడో వారాల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు.

దిగొస్తున్న పసిడి ధర.. నేటి లెక్కలివే!

దిగొస్తున్న పసిడి ధర.. నేటి లెక్కలివే!

దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 తగ్గి.. రూ. 60,370కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,370గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.65,860గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇవే ధరలు అమలులో ఉన్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 79,900 పలుకుతోంది.

‘తెలంగాణ కా సలార్’.. రేవంత్ వీడియో వైరల్

‘తెలంగాణ కా సలార్’.. రేవంత్ వీడియో వైరల్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన ‘తెలంగాణ కా సలార్’ వీడియో నెట్టింట వైరలవుతోంది. ‘‘మూటలతో వచ్చినా.. ముఠాలుగా వచ్చినా.. లిక్కర్ తో వచ్చినా..లిక్కర్ స్కాం డ్రామాలతో వచ్చినా..పైన ఉన్న మోడీ ఐనా..కింద ఉన్న కేడీలైనా.. గుర్తు పెట్టుకోండి.. ఈడ ఉన్నది తెలంగాణ కా సలార్.. ఎవ్వరూ వాడిని ఏమి చేయలేరు!’’ అని ట్వీట్ చేసింది.

కవిత అరెస్ట్‌పై లేఖ విడుదల చేసిన సుఖేశ్

కవిత అరెస్ట్‌పై లేఖ విడుదల చేసిన సుఖేశ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ విడుదల చేశారు. ‘‘సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో నువ్వు నీ పార్టీ దోచుకుని దాచుకున్న వేలకోట్లు బయటకు వస్తాయి. కవితక్క మీ నెయ్యి టిన్ కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్లు, గోవా కథలపై దర్యాప్తు జరుగుతుంది’’ అని లేఖలో పేర్కొనడం గమనార్హం.

బెంగుళూరులో నీటి కష్టాలు.. ఇంకెన్నాళ్లు..?

బెంగుళూరులో నీటి కష్టాలు.. ఇంకెన్నాళ్లు..?

బెంగళూరులో తీవ్ర నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రెండు రోజులకు ఓసారి స్నానం.. ప్లాస్టిక్‌ ప్లేట్ల వాడకం.. ఇవీ.. నీటికష్టాల నుంచి బయటపడేందుకు బెంగళూరు వాసులు అనుసరిస్తోన్న మార్గాలు. ఈ నేపథ్యంలో నీటిని వృథా చేస్తే రూ.5000 జరిమానా విధించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దాల తరబడి పట్టిపీడిస్తున్న నీటి సమస్య ఎలా ఉండనుంది? దాని పరిష్కరమార్గాల గురించి పై వీడియోలో చూడండి.

మూసాపేట్‌లో కంటెయినర్ బీభత్సం

మూసాపేట్‌లో కంటెయినర్ బీభత్సం

హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో ఓ కంటెయినర్ బీభత్సం సృష్టించింది. రహదారిపై వేగంగా వచ్చి మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే.. కంటెయినర్ డ్రైవర్ మాత్రం వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపైనే వాహనం ఉండటంతో.. దాన్ని అక్కడి నుంచి తీసి పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఢిల్లీ పొల్యూషన్‌.. వరల్డ్‌లోనే టాప్‌ ర్యాంక్‌ !

ఢిల్లీ పొల్యూషన్‌.. వరల్డ్‌లోనే టాప్‌ ర్యాంక్‌ !

ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్‌కు చెందిన IQ ఎయిర్‌ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్‌లో ఉంటూ వస్తోంది. 2023లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్‌ క్యూబిక్‌ మీటర్‌కు 92.7గ్రాములకు చేరింది.

మహామహులను అందించిన నియోజకవర్గం దక్షిణ చెన్నై

మహామహులను అందించిన నియోజకవర్గం దక్షిణ చెన్నై

తమిళనాడులోని దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం మహామహులను అందించిన నియోజకవర్గంగా పేరుగాంచింది. భారత మాజీ రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి టీటీ కృష్ణమాచారి, మాజీ సీఎం అన్నాదురై, కేంద్ర మాజీమంత్రులు మురసొలి మారన్‌, టీఆర్‌ బాలు వంటి ఉద్ధండులను లోక్‌సభకు పంపిన నియోజకవర్గంగా దీనికి గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 9సార్లు డీఎంకే గెలిచింది. ఇక్కడ గెలవాలని డీఎంకే, ప్రత్యర్థిపార్టీలు యత్నిస్తున్నాయి.

టీజీ09 0001 నెంబర్@ రూ.9,61,111

టీజీ09 0001 నెంబర్@ రూ.9,61,111

తెలంగాణలో నూతన రిజిస్ట్రేషన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. శుక్ర, శని, సోమవారాల్లో 33 జిల్లాల పరిధిలో ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది.హైదరాబాద్‌ పరిధిలోని ఖైరతాబాద్‌ ఆర్టీఏలో టీజీ09 0001 ఏకంగా రూ.9,61,111 ధర పలికింది. రంగారెడ్డి పరిధిలో టీజీ07 0999ను రూ.4,75,999కు దక్కించుకున్నారు.

ఎన్నికల్లో అక్రమాలా.. సీ–విజిల్‌ యాప్‌‌లో పెట్టేసేయ్!

ఎన్నికల్లో అక్రమాలా.. సీ–విజిల్‌ యాప్‌‌లో పెట్టేసేయ్!

ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదుచేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారణ

నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారణ

AP : TDP అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ APప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించనుంది. దీంతో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లో ‘వందేభారత్‌’పై రాళ్ల దాడి!

ఉత్తరప్రదేశ్‌లో ‘వందేభారత్‌’పై రాళ్ల దాడి!

UPలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని C-3కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

‘CAA’పై వందల పిటిషన్‌లు.. నేడు సుప్రీంకోర్టు విచారణ

‘CAA’పై వందల పిటిషన్‌లు.. నేడు సుప్రీంకోర్టు విచారణ

కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (CAA)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. CAAపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్‌లు ఫైల్‌ అయ్యాయి. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లను విచారించనుంది.

అధికారులను అవస్థలు పెట్టిన వైఎస్సార్ విగ్రహం

అధికారులను అవస్థలు పెట్టిన వైఎస్సార్ విగ్రహం

చిత్తూరు జిల్లాలోని వైఎస్సార్ విగ్రహానికి ముసుగు వేసేందుకు అధికారులు తంటాలు పడ్డారు. పలమనేరు నియోజకవర్గం గంగవరంలో 60 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో విగ్రహానికి ముసుగు వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న క్రేన్లు 30 అడుగుల ఎత్తువరకే వెళ్లాయి. చివరికి తమిళనాడు నుంచి క్రేన్ తెప్పించి.. రాత్రిపూట ఆయన విగ్రహానికి ముసుగు వేశారు.

బెల్లం టీతో రక్తహీనతకు చెక్!

బెల్లం టీతో రక్తహీనతకు చెక్!

టీ అలవాటు మానుకోలేనివారు చక్కెరకు బదులు బెల్లం కలిపిన టీ తాగితే మేలు. దీనివల్ల శరీరానికి ఎలాంటి హానీ ఉండదు. బెల్లం‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్య నివారణకు దోహదం చేస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు బెల్లం టీ తాగితే మేలు. అందులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తహీనతను నివారిస్తుంది. బెల్లం టీ తాగడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్‌ సత్తా చాటేనా?

హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్‌ సత్తా చాటేనా?

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం చవిచూసింది. ఫలితంగా రెండుసార్లు 44, 52 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో మొత్తంగా 149 ఎంపీ స్థానాలు ఉండే హిందీ రాష్ట్రాలు యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌లలో ఒక్కొక్క స్థానం మాత్రమే గెలిచింది. ఇక రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఖాతా కూడా తెరవలేదు. ఈసారైనా కాంగ్రెస్‌ కరువు తీరుతుందా? లేదా? అనేది చూడాలి.

ఎల్లో అలెర్ట్.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు

ఎల్లో అలెర్ట్.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు

TG : మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీసే అవకాశముందని వెల్లడించింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

మరికొంతకాలం ‘EV’లకు ఊరట

మరికొంతకాలం ‘EV’లకు ఊరట

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(EV)ను కొనా­లను­కునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్‌–2పథకం ముగు­స్తున్న తరుణంలో మరో కొత్తపథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500కోట్లు కేటాయించింది. ఏప్రిల్‌ 1నుంచి కొత్తపథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది.

నేను పార్ట్‌ టైం పొలిటీషియన్‌‌ని: మల్లారెడ్డి

నేను పార్ట్‌ టైం పొలిటీషియన్‌‌ని: మల్లారెడ్డి

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీఆర్‌ఎస్‌ను వీడటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నివాసంలో ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతూ..‘‘నేను పార్ట్‌ టైం పొలిటీషియన్‌.. ఫుల్‌ టైం బిజినెస్‌మేన్‌ను. వ్యాపారపరంగా సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని మల్లారెడ్డి అన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం.