లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు
AP: గతేడాది ఆగస్టులో తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు. టీటీడీ బంధించిన నాలుగో చిరుతే.. లక్షితపై దాడిచేసిందని అధికారుల విచారణలో తేలింది. కాగా.. మొత్తం ఆరు చిరుతలను టీటీడీ బంధించింది. దాడి చేసిన చిరుతతో పాటు అన్ని చిరుతలను జూ పార్కులోనే సంరక్షించాలని అధికారులు నిర్ణయించారు.