shape

Crime ChotaNews

కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సెటైర్లు

కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సెటైర్లు

AP: గత ప్రభుత్వంలా కాకుండా.. ఇచ్చిన హమీలను అమలు చేసి హీరోలా ప్రజల వద్దకు వెళుతున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. కోవిడ్ వంటి ఆటంకాలు ఎదురైనా.. తగ్గకుండా ముందుకు వెళ్లామని చెప్పారు. అలాగే, 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను చూపించి.. సెటైర్లు వేశారు. అప్పట్లో ఇచ్చిన ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు.

నుదుటిపై బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్

నుదుటిపై బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్

AP: తాడేపల్లిలో జరుగుతున్న మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ తన నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ను తీసేశారు. దీంతో ‘‘దెబ్బ మానిందనా? చెల్లి చెప్పిందనా?’’ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయవాడలో జరిగిన రాయిదాడి తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందిన జగన్.. గాయంపై బ్యాండేజ్‌ వేసుకున్నారు. ఇటీవల వైఎస్ సునీత.. తాను డాక్టర్‌గా చెబుతున్నానని, బ్యాండేజ్ తీయకుంటే గాయంమానదని జగన్‌కు సూచించారు.

శ్రేయాభిలాషులు చెప్పినా నేను వినలేదు: సీఎం జగన్

శ్రేయాభిలాషులు చెప్పినా నేను వినలేదు: సీఎం జగన్

AP: మేనిఫెస్టోను తాము భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. ఇతర పార్టీలు మాత్రం మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాయని విమర్శించారు. అయితే, తమ మేనిఫెస్టో మాత్రం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలుచేశామని చెప్పారు. చంద్రబాబు తరహాలో అమలు చేయలేని హామీలు ఇద్దామని తన శ్రేయాభిలాషులు చెప్పారని.. అయినా తాను వినలేదని తెలిపారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వరుణ్‌‌తేజ్

రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వరుణ్‌‌తేజ్

AP: జనసేనాని పవన్ కల్యాణ్‌కు మద్దతుగా సినీహీరో వరుణ్‌తేజ్.. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వరుణ్‌కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.

కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ సవాల్

కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ సవాల్

TG: కాంగ్రెస్ నేతలకు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘‘వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలు, విద్యార్థుల భరోసా కార్డులు ఇచ్చినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నిరూపించకపోతే మీరందరూ పోటీనుంచి తప్పుకుంటారా?’’ అని సవాల్ చేశారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా ఇలాంటి సవాలే చేశారు.

అందాల పోటీల్లో 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

అందాల పోటీల్లో 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. అయితే అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌(60) సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ ‘భామ’.. తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన అందాల పోటీలో ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌’ టైటిల్‌ గెలుచుకున్నారు.

రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం: కేసీఆర్

రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం: కేసీఆర్

TG: బీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్‌ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. రాజకీయ పార్టీల్లో చరిత్రలో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం అని చెప్పుకొచ్చారు. ఆటుపోట్లు అధిగమించేందుకు బలమైన పునాదులు వేసింది కార్యకర్తలేనని పేర్కొన్నారు.

కాపుల ఓట్లే కీలకం.. జోగయ్య మరో లేఖ

కాపుల ఓట్లే కీలకం.. జోగయ్య మరో లేఖ

AP : కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఇప్పుడు మరో బహిరంగ లేఖ విడుదల చేశారు. బై బై YCP అనే నినాదం నిజం కావాలంటే.. కాపుల ఓట్లే కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కులాలే విజయావకాశాలను శాసిస్తున్నాయని ఆయన వివరించారు. కాపుల ఓట్లు జనసేనకు కలవడంతో కూటమి ఓటింగ్ 52 శాతానికి పెరిగిందన్నారు.

మూడు బంగారు పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు

మూడు బంగారు పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తా చాటారు. షాంఘైలో నిర్వహించిన మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్లలో మూడు బంగారు పతకాలు సాధించారు. జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ బృందానికి స్వర్ణం లభించింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కూడా జ్యోతిసురేఖ మెరిసింది. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ప్రియాన్స్‌, ప్రీతమేష్ బృందానికి స్వర్ణ పతకం లభించింది.

సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

AP: టీడీపీ ఎన్నికల ప్రచార వాహనానికి నిప్పుపెట్టడంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ స్పందించారు. ‘‘దారుణ ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే భ‌యంతో త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్నావు జ‌గ‌న్‌..! అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పుపెట్ట‌డం వైసీపీ దుర్మార్గాల‌కు ప‌రాకాష్ట‌. డ్రైవ‌ర్ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన మీ రాక్ష‌స‌త్వం స‌భ్య‌స‌మాజానికే సిగ్గుచేటు’’ అని పేర్కొన్నారు.

శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి

శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి

TG : ఉద్యోగం కోసం జోర్డాన్‌ వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో పెళ్లి చేసుకున్నారు. మెట్‌పల్లి మండలం మేడిపల్లికి చెందిన అశోక్‌ ఉద్యోగం కోసం జోర్దాన్‌ వెళ్లాడు. అక్కడ శ్రీలంకకి చెందిన సమన్వితో పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

ఆప్ ఎమ్మెల్యేకు ఊరట

ఆప్ ఎమ్మెల్యేకు ఊరట

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఇటీవలే అమానతుల్లాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్‌తో సీపీఎం నేతల భేటీ

సీఎం రేవంత్‌తో సీపీఎం నేతల భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య సీఎంతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై రేవంత్‌తో చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

బస్సు టికెట్‌ ధరలు పెంచేశారు!

బస్సు టికెట్‌ ధరలు పెంచేశారు!

HYD: సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు తమ ఊరికి వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, బస్సులు ఇప్పటికే ఫుల్‌ అయ్యాయి. ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నర్సాపురంకు సాధారణ రోజుల్లో బస్సు చార్జీ రూ.720లు ఉంటే, మే 12న రూ.3వేలుగా ఉంది. ఈ నేపథ్యంలో ఊరెళ్లే మార్గం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

AP: హిందూపురం లోక్‌సభ అభ్యర్థి బీకే పార్థసారథికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. సి.కె. పల్లి వద్ద ఈ ఘటన జరిగింది. పార్థసారథి సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘రచ్చబండ’కు హాజరైన లోకేష్

‘రచ్చబండ’కు హాజరైన లోకేష్

AP : హత్యా రాజకీయాలకు APలో స్థానం లేదని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరంపూడి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోరంపూడి వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని లోకేష్ హామీ ఇచ్చారు.

సోయాబీన్స్‌తో కలిగే ఆరోగ్య లాభాలు

సోయాబీన్స్‌తో కలిగే ఆరోగ్య లాభాలు

సోయాబీన్స్ అనేది అనేక పోషకాల గని. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోయాబీన్స్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అసలు ఉండదు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపరచి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి సమ్మేళనాలు దీనిలో ఉంటాయి. ఇవి హృదయనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఈరోజే Kalki 2898AD నుంచి క్రేజీ అప్‌డేట్

ఈరోజే Kalki 2898AD నుంచి క్రేజీ అప్‌డేట్

ఈరోజు సాయంత్రం 5 గంటలకు Kalki 2898AD మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ రానుంది. ఈమేరకు మూవీటీం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి మున్సిపల్ ఛైర్మన్!

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి మున్సిపల్ ఛైర్మన్!

TG: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

కృష్ణమ్మ సాక్షిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో సత్యదేవ్‌

కృష్ణమ్మ సాక్షిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో సత్యదేవ్‌

సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మే10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీమేకర్స్‌, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల చేస్తున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ‘ రా అండ్‌ రస్టిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. స్నేహం కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడిగా సత్యదేవ్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారు.’ అన్నారు.

కొడుమూరులో బొలెరో వాహనం బీభత్సం

కొడుమూరులో బొలెరో వాహనం బీభత్సం

AP: కర్నూలు జిల్లా కొడుమూరులో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. కర్నూలు రహదారిలో టాటాఏస్ వాహనం, రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన మరో వ్యక్తి పోతుగల్ వీఆర్‌వో వెంకటేష్‌గా గుర్తించారు. బొలెరో అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

రాజధాని కట్టలేని నేతలకు ఓట్లెందుకు..: షర్మిల

రాజధాని కట్టలేని నేతలకు ఓట్లెందుకు..: షర్మిల

AP: టీడీపీ, వైసీపీ పార్టీలపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. పాయకరావుపేటలో మాట్లాడుతూ.. పదేళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా.. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని మండిపడ్డారు. పదేళ్లైనా రాజధాని కట్టలేని నేతలకు ఓట్లెందుకు వేయాలని దుయ్యబట్టారు.

ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం : KTR

ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం : KTR

HYD : సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో టీఆర్‌ఎస్‌ (BRS) వినిపించిందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR అన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం KTR మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు.

అక్కడ ఒక్క ఓటూ పడలేదు.. ఎందుకంటే..

అక్కడ ఒక్క ఓటూ పడలేదు.. ఎందుకంటే..

దేశంలో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో జీరో ఓటింగ్‌ నమోదయ్యింది. బక్స్‌వాహా తహసీల్‌లోని మంకి గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. విద్యుత్‌, తాగునీరు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు తమకు అందడంలేదని ఆరోపిస్తూ ఓటు వేయలేదు. మూడు నెలలుగా గ్రామంలో విద్యుత్‌ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నిరసిస్తూ గ్రామస్తులెవరూ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.

ప్రచార వాహనానికి నిప్పు.. టీడీపీ నేతల ఆందోళన

ప్రచార వాహనానికి నిప్పు.. టీడీపీ నేతల ఆందోళన

AP: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం వద్ద రహదారిపై టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార వాహనానికి నిప్పుపెట్టడంపై కిషోర్‌ సతీమణి తనూజరెడ్డితో పాటు టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వాహనానికి నిప్పంటించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్లీనరీపై BRS కీలక నిర్ణయం

ప్లీనరీపై BRS కీలక నిర్ణయం

TG : BRS పార్టీ 2001 నుంచి ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. అప్పటి నుంచి ప్రతిఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లీనరీ నిర్వహిస్తుంది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఉండటం, పార్టీ నాయకులు, కేడర్ అంతా పార్టీ ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో ప్లీనరీ నిర్వహించడం లేదని సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లోనే జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం నేతలకు పిలుపు నిచ్చింది.

కరీంనగర్‌‌లో.. నువ్వా నేనా ..!

కరీంనగర్‌‌లో.. నువ్వా నేనా ..!

TG : కరీంనగర్‌ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP, BRS పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19సార్లు ఎన్నికలు జరుగగా.. 9సార్లు కాంగ్రెస్, ఉపఎన్నికలతో కలిపి 4సార్లు BRS, 3సార్లు BJP, ఒకసారి TDP, మరోసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి.‌ ఈ నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఉత్కంఠగా మారింది.

ఓటు వేయని బెంగళూరు ప్రజలు!

ఓటు వేయని బెంగళూరు ప్రజలు!

బెంగళూరులో దాదాపు సగం మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ లో​క్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్​లో 52.81 శాతం, బెంగళూరు నార్త్​లో 54.42 శాతం, బెంగళూరు సౌత్​లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు విషయంపై ఎంత అవగాహన కల్పించినా, ఎంత తీవ్రంగా ప్రచారాలు చేసినా.. ఓటర్ల ఉదాసీనత కొనసాగడంపై ఎన్నికల సంఘం అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నరైన్‌కు థ్యాంక్స్: బెయిర్‌స్టో

నరైన్‌కు థ్యాంక్స్: బెయిర్‌స్టో

కోల్‌కతా నిర్దేశించిన 262 భారీ లక్ష్యాన్ని పంజాబ్ చేధించింది. అందులో పంజాబ్ ఆటగాళ్లు బెయిర్‌స్టో (108), శశాంక్ సింగ్(58), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) కీలకపాత్ర పోషించారు. దీనిపై బెయిర్‌స్టో స్పందిస్తూ.. ‘సునీల్‌ నరైన్‌కు ధన్యవాదాలు చెప్పాలి. అతడి ఆటను చూసిన తర్వాతే రిస్క్‌ తీసుకోవడానికి ప్రయత్నించా. శశాంక్‌ భారీ హిట్టింగ్‌ అద్భుతం. శశాంక్‌ భారీ షాట్లతో విరుచుకుపడటంతో లక్ష్యఛేదన సులువైంది’ అని తెలిపాడు.

సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు

సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు

AP: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘‘మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు. వాటిపై నీకు గౌరవం ఉంటే.. 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లడుగుతానన్న నువ్వు… ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?’’ అని ట్వీట్ చేశారు.

నాలుగు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

నాలుగు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

దేశంలోని నాలుగు ముఖ్య ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోల్‌కతా విమానాశ్రయంతో సహా దేశంలోని నాలుగు వేర్వేరు విమానాశ్రయాల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్ వచ్చింది. దీంతో CISF అధికారులు ఆయా ఎయిర్‌పోర్టులను పూర్తిగా తనిఖీ చేశారు. అనంతరం ఈ ఈమెయిల్‌ ఫేక్ అని, ఎటువంటి బాంబు లేదని సీనియర్ CISF అధికారి తెలిపారు.

అందరికీ ప్రతిష్ఠాత్మకమే

అందరికీ ప్రతిష్ఠాత్మకమే

TG : లోక్‌సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా పరిణమించాయి. కేంద్రంలో తమ అధికారాన్ని నిలుపుకోవడం BJPకి కీలకం కాగా.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్‌‌ పార్టీకి తిరిగి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలంటే ఈ ఎన్నికలు కీలకం. ఇక తెలంగాణ రాజకీయాలను ఇంతకాలం శాసిస్తూ వచ్చిన BRS.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడంతో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

నేటితో ముగియనున్న సతీష్ కస్టడీ

నేటితో ముగియనున్న సతీష్ కస్టడీ

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్.. పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సతీష్‌ను పోలీసులు విచారించారు. సతీష్ కుటుంబ సభ్యులు, లాయర్ సమక్షంలో జగన్‌పై దాడికి సంబంధించి సతీష్ నుంచి పలు కీలక విషయాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సమాచారాన్ని సీల్ కవర్‌లో ఇవాళ సాయంత్రం విజయవాడ కోర్టుకు అందించనున్నారు.