shape

Hyderabad ChotaNews

Blog Image

రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం: కేసీఆర్

TG: బీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్‌ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. రాజకీయ పార్టీల్లో చరిత్రలో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం అని చెప్పుకొచ్చారు. ఆటుపోట్లు అధిగమించేందుకు బలమైన పునాదులు వేసింది కార్యకర్తలేనని పేర్కొన్నారు.

Blog Image

కాపుల ఓట్లే కీలకం.. జోగయ్య మరో లేఖ

AP : కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఇప్పుడు మరో బహిరంగ లేఖ విడుదల చేశారు. బై బై YCP అనే నినాదం నిజం కావాలంటే.. కాపుల ఓట్లే కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కులాలే విజయావకాశాలను శాసిస్తున్నాయని ఆయన వివరించారు. కాపుల ఓట్లు జనసేనకు కలవడంతో కూటమి ఓటింగ్ 52 శాతానికి పెరిగిందన్నారు.

Blog Image

మూడు బంగారు పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తా చాటారు. షాంఘైలో నిర్వహించిన మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్లలో మూడు బంగారు పతకాలు సాధించారు. జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ బృందానికి స్వర్ణం లభించింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కూడా జ్యోతిసురేఖ మెరిసింది. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ప్రియాన్స్‌, ప్రీతమేష్ బృందానికి స్వర్ణ పతకం లభించింది.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

AP: టీడీపీ ఎన్నికల ప్రచార వాహనానికి నిప్పుపెట్టడంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ స్పందించారు. ‘‘దారుణ ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే భ‌యంతో త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్నావు జ‌గ‌న్‌..! అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పుపెట్ట‌డం వైసీపీ దుర్మార్గాల‌కు ప‌రాకాష్ట‌. డ్రైవ‌ర్ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన మీ రాక్ష‌స‌త్వం స‌భ్య‌స‌మాజానికే సిగ్గుచేటు’’ అని పేర్కొన్నారు.

Blog Image

శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి

TG : ఉద్యోగం కోసం జోర్డాన్‌ వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో పెళ్లి చేసుకున్నారు. మెట్‌పల్లి మండలం మేడిపల్లికి చెందిన అశోక్‌ ఉద్యోగం కోసం జోర్దాన్‌ వెళ్లాడు. అక్కడ శ్రీలంకకి చెందిన సమన్వితో పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

Blog Image

ఆప్ ఎమ్మెల్యేకు ఊరట

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఇటీవలే అమానతుల్లాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Blog Image

సీఎం రేవంత్‌తో సీపీఎం నేతల భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య సీఎంతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై రేవంత్‌తో చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Blog Image

బస్సు టికెట్‌ ధరలు పెంచేశారు!

HYD: సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు తమ ఊరికి వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, బస్సులు ఇప్పటికే ఫుల్‌ అయ్యాయి. ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నర్సాపురంకు సాధారణ రోజుల్లో బస్సు చార్జీ రూ.720లు ఉంటే, మే 12న రూ.3వేలుగా ఉంది. ఈ నేపథ్యంలో ఊరెళ్లే మార్గం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Blog Image

టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

AP: హిందూపురం లోక్‌సభ అభ్యర్థి బీకే పార్థసారథికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. సి.కె. పల్లి వద్ద ఈ ఘటన జరిగింది. పార్థసారథి సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blog Image

‘రచ్చబండ’కు హాజరైన లోకేష్

AP : హత్యా రాజకీయాలకు APలో స్థానం లేదని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరంపూడి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోరంపూడి వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని లోకేష్ హామీ ఇచ్చారు.

Blog Image

సోయాబీన్స్‌తో కలిగే ఆరోగ్య లాభాలు

సోయాబీన్స్ అనేది అనేక పోషకాల గని. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోయాబీన్స్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అసలు ఉండదు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపరచి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి సమ్మేళనాలు దీనిలో ఉంటాయి. ఇవి హృదయనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.

Blog Image

ఈరోజే Kalki 2898AD నుంచి క్రేజీ అప్‌డేట్

ఈరోజు సాయంత్రం 5 గంటలకు Kalki 2898AD మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ రానుంది. ఈమేరకు మూవీటీం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

Blog Image

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి మున్సిపల్ ఛైర్మన్!

TG: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

Blog Image

కృష్ణమ్మ సాక్షిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో సత్యదేవ్‌

సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మే10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీమేకర్స్‌, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల చేస్తున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ‘ రా అండ్‌ రస్టిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. స్నేహం కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడిగా సత్యదేవ్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారు.’ అన్నారు.

Blog Image

కొడుమూరులో బొలెరో వాహనం బీభత్సం

AP: కర్నూలు జిల్లా కొడుమూరులో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. కర్నూలు రహదారిలో టాటాఏస్ వాహనం, రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన మరో వ్యక్తి పోతుగల్ వీఆర్‌వో వెంకటేష్‌గా గుర్తించారు. బొలెరో అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Blog Image

రాజధాని కట్టలేని నేతలకు ఓట్లెందుకు..: షర్మిల

AP: టీడీపీ, వైసీపీ పార్టీలపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. పాయకరావుపేటలో మాట్లాడుతూ.. పదేళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా.. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని మండిపడ్డారు. పదేళ్లైనా రాజధాని కట్టలేని నేతలకు ఓట్లెందుకు వేయాలని దుయ్యబట్టారు.

Blog Image

ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం : KTR

HYD : సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో టీఆర్‌ఎస్‌ (BRS) వినిపించిందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR అన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం KTR మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు.

Blog Image

అక్కడ ఒక్క ఓటూ పడలేదు.. ఎందుకంటే..

దేశంలో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో జీరో ఓటింగ్‌ నమోదయ్యింది. బక్స్‌వాహా తహసీల్‌లోని మంకి గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. విద్యుత్‌, తాగునీరు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు తమకు అందడంలేదని ఆరోపిస్తూ ఓటు వేయలేదు. మూడు నెలలుగా గ్రామంలో విద్యుత్‌ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నిరసిస్తూ గ్రామస్తులెవరూ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.

Blog Image

ప్రచార వాహనానికి నిప్పు.. టీడీపీ నేతల ఆందోళన

AP: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం వద్ద రహదారిపై టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార వాహనానికి నిప్పుపెట్టడంపై కిషోర్‌ సతీమణి తనూజరెడ్డితో పాటు టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వాహనానికి నిప్పంటించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Blog Image

ప్లీనరీపై BRS కీలక నిర్ణయం

TG : BRS పార్టీ 2001 నుంచి ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. అప్పటి నుంచి ప్రతిఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లీనరీ నిర్వహిస్తుంది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఉండటం, పార్టీ నాయకులు, కేడర్ అంతా పార్టీ ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో ప్లీనరీ నిర్వహించడం లేదని సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లోనే జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం నేతలకు పిలుపు నిచ్చింది.

Blog Image

కరీంనగర్‌‌లో.. నువ్వా నేనా ..!

TG : కరీంనగర్‌ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP, BRS పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19సార్లు ఎన్నికలు జరుగగా.. 9సార్లు కాంగ్రెస్, ఉపఎన్నికలతో కలిపి 4సార్లు BRS, 3సార్లు BJP, ఒకసారి TDP, మరోసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి.‌ ఈ నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఉత్కంఠగా మారింది.

Blog Image

ఓటు వేయని బెంగళూరు ప్రజలు!

బెంగళూరులో దాదాపు సగం మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ లో​క్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్​లో 52.81 శాతం, బెంగళూరు నార్త్​లో 54.42 శాతం, బెంగళూరు సౌత్​లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు విషయంపై ఎంత అవగాహన కల్పించినా, ఎంత తీవ్రంగా ప్రచారాలు చేసినా.. ఓటర్ల ఉదాసీనత కొనసాగడంపై ఎన్నికల సంఘం అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Blog Image

నరైన్‌కు థ్యాంక్స్: బెయిర్‌స్టో

కోల్‌కతా నిర్దేశించిన 262 భారీ లక్ష్యాన్ని పంజాబ్ చేధించింది. అందులో పంజాబ్ ఆటగాళ్లు బెయిర్‌స్టో (108), శశాంక్ సింగ్(58), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) కీలకపాత్ర పోషించారు. దీనిపై బెయిర్‌స్టో స్పందిస్తూ.. ‘సునీల్‌ నరైన్‌కు ధన్యవాదాలు చెప్పాలి. అతడి ఆటను చూసిన తర్వాతే రిస్క్‌ తీసుకోవడానికి ప్రయత్నించా. శశాంక్‌ భారీ హిట్టింగ్‌ అద్భుతం. శశాంక్‌ భారీ షాట్లతో విరుచుకుపడటంతో లక్ష్యఛేదన సులువైంది’ అని తెలిపాడు.

Blog Image

సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు

AP: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘‘మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు. వాటిపై నీకు గౌరవం ఉంటే.. 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లడుగుతానన్న నువ్వు… ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?’’ అని ట్వీట్ చేశారు.

Blog Image

నాలుగు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

దేశంలోని నాలుగు ముఖ్య ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోల్‌కతా విమానాశ్రయంతో సహా దేశంలోని నాలుగు వేర్వేరు విమానాశ్రయాల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్ వచ్చింది. దీంతో CISF అధికారులు ఆయా ఎయిర్‌పోర్టులను పూర్తిగా తనిఖీ చేశారు. అనంతరం ఈ ఈమెయిల్‌ ఫేక్ అని, ఎటువంటి బాంబు లేదని సీనియర్ CISF అధికారి తెలిపారు.

Blog Image

అందరికీ ప్రతిష్ఠాత్మకమే

TG : లోక్‌సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా పరిణమించాయి. కేంద్రంలో తమ అధికారాన్ని నిలుపుకోవడం BJPకి కీలకం కాగా.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్‌‌ పార్టీకి తిరిగి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలంటే ఈ ఎన్నికలు కీలకం. ఇక తెలంగాణ రాజకీయాలను ఇంతకాలం శాసిస్తూ వచ్చిన BRS.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడంతో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

Blog Image

నేటితో ముగియనున్న సతీష్ కస్టడీ

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్.. పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సతీష్‌ను పోలీసులు విచారించారు. సతీష్ కుటుంబ సభ్యులు, లాయర్ సమక్షంలో జగన్‌పై దాడికి సంబంధించి సతీష్ నుంచి పలు కీలక విషయాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సమాచారాన్ని సీల్ కవర్‌లో ఇవాళ సాయంత్రం విజయవాడ కోర్టుకు అందించనున్నారు.

Blog Image

PBKS vs KKR: సిక్స్‌లతో రికార్డు

పంజాబ్, కోల్‌క‌తా మధ్య జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురిసింది. టీ20ల్లోనే అత్య‌ధిక సిక్సులు ఈ మ్యాచ్‌లో న‌మోదు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు క‌లిపి 42 సిక్స్‌లు బాదాయి. కొన్ని రోజుల క్రిత‌మే ముంబై ఇండియన్స్‌, హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లో 38 సిక్స్‌లు న‌మోదు అయ్యాయి. ఆ రికార్డును ఇప్పుడు తుడిపేశారు.

Blog Image

పెద్దపల్లిలో నారీమణులే నిర్ణేతలు

TG : పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండటంతో వారే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 15,92,996 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 8,05,755 మంది, పురుషులు 7,87,140 మంది, ఇతరులు 101మంది ఉన్నారు. పురుషుల కంటే 18,615 మంది మహిళలు అధికంగా ఉన్నారు.

Blog Image

సూసైడ్ చేసుకోవాలనుకున్నా: బైడెన్

ఆత్మహత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1972లో తన భార్య, 18 నెలల కమారుడు మరణించడంతో చనిపోవాలనే ఆలోచనరాగా.. మిగిలిన పిల్లల గురించి ఆలోచించి ఆగిపోయినట్లు చెప్పుకొచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు పిచ్చి ఆలోచనలు చేయాల్సిన పనిలేదన్నారు.

Blog Image

శ్రీశైలంకి వెళ్లే భక్తులకు RTC గుడ్ న్యూస్

HYD : ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని AC బస్సులను TSRTC నడిపేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు ప్రతి గంటకోసారి AC బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది. AC బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి శ్రీశైలంకి రూ.524గా ఛార్జీలను నిర్ణయించగా.. BHEL నుంచి రూ.564 టికెట్ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది.

Blog Image

పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

AP : ఇంటింటికి పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల కమిషన్.. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పింఛన్లను పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ చీఫ్.. ఎన్నికల కమిషనర్, చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని ఆ ఆదేశాల్లో పేర్కొంది.

Blog Image

గేటెడ్‌ కమ్యూనిటీల్లో పోలింగ్‌ కేంద్రాలు లేనట్టే

HYD : గ్రేటర్‌ హైదరాబాద్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. అధికారులు అక్కడికి వెళ్లి ప్రతినిధులకు ఎన్నికల నిబంధనలను వివరించగా కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రాల జాబితాను ECకి పంపాల్సిన గడువు ముగియడంతో అధికారులు ఈ ప్రయత్నం విరమించుకున్నారు.