‘అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోంది’
TG: అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అంబేడ్కర్ చిత్రపటం పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని తెలిపారు. అంబేడ్కర్ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే పీవోకే.. పాకిస్థాన్ ఆధీనంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి అడుగడుగునా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని వ్యాఖ్యానించారు.