shape

Social Media ChotaNews

‘అంబేడ్కర్‌ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోంది’

‘అంబేడ్కర్‌ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోంది’

TG: అంబేడ్కర్‌ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అంబేడ్కర్‌ చిత్రపటం పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని తెలిపారు. అంబేడ్కర్‌ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే పీవోకే.. పాకిస్థాన్ ఆధీనంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి అడుగడుగునా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని వ్యాఖ్యానించారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

36 మందితో వెళ్తున్న బ‌స్సుకు నిప్పు

36 మందితో వెళ్తున్న బ‌స్సుకు నిప్పు

మ‌హారాష్ట్ర‌లోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. 36 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ప్రైవేటు బ‌స్సుకు నిప్పు అంటుకున్న‌ది. అయితే ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ప్ర‌యాణికులు అంద‌రూ సుర‌క్షితంగా ఉన్నారు. ఎవ‌రికి కూడా గాయాలు కాలేదు. అగ్నిమాప‌క సిబ్బంది.. మంట‌ల్ని ఆర్పుతున్నారు.

మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్

మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్

AP: రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్.. కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టోను విడుదల చేశారు. 9 ప్రధాన హామీలతో మేనిఫెస్టో-2024ను ప్రకటించారు. అందులో నాలుగు పోర్టుల నిర్మాణం, వైఎస్ఆర్ చేయూతను రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

సోష‌ల్ మీడియాలోకి అడుగుపెట్టిన‌ KCR

సోష‌ల్ మీడియాలోకి అడుగుపెట్టిన‌ KCR

TG : BRS అధినేత కేసీఆర్.. తొలిసారిగా సామాజిక మాధ్య‌మాల్లో అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ త‌న ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇన్‌స్టాగ్రాంలో కూడా KCR త‌న ఖాతాను తెరిచారు. ఇక నుంచి ఎక్స్ వేదిక‌గా KCR విస్తృతంగా ప్ర‌చారం చేయ‌నున్నారు. KCR ఎలాంటి విష‌యాల‌ను ఎక్స్ ద్వారా పంచుకోబోతార‌నే దాని కోసం నెటిజ‌న్లు, రాజ‌కీయ వ‌ర్గాలు, ఇత‌రులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

రెవెన్యూ లోటులో సంపద సృష్టి ఎలా?: సీఎం జగన్

రెవెన్యూ లోటులో సంపద సృష్టి ఎలా?: సీఎం జగన్

AP: చంద్రబాబు పాలనపై సీఎం జగన్ విమర్శలు చేశారు. మాట్లాడితే.. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబుతున్నారని.. కానీ ఆయన పాలనలో రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఉందని ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు సంపద ఎలా సృష్టించారని ప్రశ్నించారు. కానీ తన హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని తెలిపారు. అందుకే చంద్రబాబులాగా.. జగన్ ఎప్పుడూ పేదలను మోసం చేయడని పేర్కొన్నారు.

అలెన్ హెర్బల్‌ పరిశ్రమలో మరోసారి పేలుళ్లు

అలెన్ హెర్బల్‌ పరిశ్రమలో మరోసారి పేలుళ్లు

TG: రంగారెడ్డి జిల్లాలోని అలెన్ హెర్బల్‌ పరిశ్రమలో మరోసారి పేలుళ్లు కలకలం రేపాయి. రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు చెలరేగాయి. ఉదయం కంపెనీలో మంటలార్పిన తర్వాత మల్లీ మంటలు వ్యాపించాయి. రెండు అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా నిన్న వెల్డింగ్‌ చేస్తుండగా ఇదే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

జ‌గ‌న్‌పై మ‌రోసారి ష‌ర్మిల తీవ్ర‌ విమ‌ర్శ‌లు

జ‌గ‌న్‌పై మ‌రోసారి ష‌ర్మిల తీవ్ర‌ విమ‌ర్శ‌లు

AP : రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉంటే యువ‌తకు ఉద్యోగాలు వ‌చ్చేవ‌ని, మోదీని నిల‌దీసే ధైర్యం రాష్ట్రనేత‌ల‌కు లేద‌ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల విమర్శించారు. పాయ‌క‌రావుపేట‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆమె మాట్లాడుతూ "అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం ఒక్క ఉద్య‌మ‌మైనా చేశారా? రాజ‌ధాని క‌ట్ట‌గ‌లిగారా? రాజధాని నిర్మించ‌లేని నేత‌ల‌కు ఎందుకు ఓట్లు వేయాలి? అని ష‌ర్మిల ప్రశ్నించారు.

బ్యాండేజ్ తీసేసిన జగన్.. లోకేశ్ సెటైరికల్ ట్వీట్

బ్యాండేజ్ తీసేసిన జగన్.. లోకేశ్ సెటైరికల్ ట్వీట్

AP: సీఎం జగన్ తన నుదుటిపై బ్యాండేజ్‌ను తీసేయడంపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘‘ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం … జూమ్‌ చేసి చూస్తే.. దెబ్బ మటుమాయం’’ అని పేర్కొన్నారు. కాగా విజయవాడలో రాయిదాడి ఘటనలో జగన్‌ నుదుటిపై గాయం అయ్యింది. వైద్యం అనంతరం బ్యాండేజ్ ధరించిన సీఎం.. నేడు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో దానిని తొలగించారు.

ఎక్సైజ్‌ శాఖకు షోకాజ్‌ నోటీసులు

ఎక్సైజ్‌ శాఖకు షోకాజ్‌ నోటీసులు

TG: ఎక్సైజ్‌ శాఖకు వాణిజ్య పన్నుల శాఖ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. డిస్టిలరీలు, డిపోలకు చేసిన హోలోగ్రామ్‌ల అమ్మకాలపై 18% చొప్పున జీఎస్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. 2017 నుంచి అమ్మిన హోలోగ్రామ్‌లపై రూ.54.53 కోట్ల జీఎస్టీ చెల్లించాలని తెలిపింది. ఒక్కో హోలోగ్రామ్‌ 30 పైసల చొప్పున అమ్మకాలు చేసినట్లు వెల్లడించింది. ఏడు రోజుల్లో జీఎస్టీ చెల్లించకుంటే చట్టప్రకారం వెళ్తామని హెచ్చరించింది.

సీపీఎం నేతలతో ముందుకెళ్తాం: సీఎం రేవంత్

సీపీఎం నేతలతో ముందుకెళ్తాం: సీఎం రేవంత్

TG: బీజేపీ శక్తులను ఓడించడానికి కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సీపీఎం నాయకులు అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీపీఎం నేతలతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఎం సహకారంతో భవిష్యత్‌లో ముందుకు వెళ్తామన్నారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టినట్లు పేర్కొన్నారు.

కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సెటైర్లు

కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సెటైర్లు

AP: గత ప్రభుత్వంలా కాకుండా.. ఇచ్చిన హమీలను అమలు చేసి హీరోలా ప్రజల వద్దకు వెళుతున్నామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. కోవిడ్ వంటి ఆటంకాలు ఎదురైనా.. తగ్గకుండా ముందుకు వెళ్లామని చెప్పారు. అలాగే, 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను చూపించి.. సెటైర్లు వేశారు. అప్పట్లో ఇచ్చిన ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు.

నుదుటిపై బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్

నుదుటిపై బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్

AP: తాడేపల్లిలో జరుగుతున్న మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ తన నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ను తీసేశారు. దీంతో ‘‘దెబ్బ మానిందనా? చెల్లి చెప్పిందనా?’’ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయవాడలో జరిగిన రాయిదాడి తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందిన జగన్.. గాయంపై బ్యాండేజ్‌ వేసుకున్నారు. ఇటీవల వైఎస్ సునీత.. తాను డాక్టర్‌గా చెబుతున్నానని, బ్యాండేజ్ తీయకుంటే గాయంమానదని జగన్‌కు సూచించారు.

శ్రేయాభిలాషులు చెప్పినా నేను వినలేదు: సీఎం జగన్

శ్రేయాభిలాషులు చెప్పినా నేను వినలేదు: సీఎం జగన్

AP: మేనిఫెస్టోను తాము భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. ఇతర పార్టీలు మాత్రం మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాయని విమర్శించారు. అయితే, తమ మేనిఫెస్టో మాత్రం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలుచేశామని చెప్పారు. చంద్రబాబు తరహాలో అమలు చేయలేని హామీలు ఇద్దామని తన శ్రేయాభిలాషులు చెప్పారని.. అయినా తాను వినలేదని తెలిపారు.

రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వరుణ్‌‌తేజ్

రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వరుణ్‌‌తేజ్

AP: పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నటుడు వరుణ్‌తేజ్.. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వరుణ్‌కు జనసేన నేతలు స్వాగతం పలికారు.

కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ సవాల్

కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ సవాల్

TG: కాంగ్రెస్ నేతలకు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘‘వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలు, విద్యార్థుల భరోసా కార్డులు ఇచ్చినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నిరూపించకపోతే మీరందరూ పోటీనుంచి తప్పుకుంటారా?’’ అని సవాల్ చేశారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా ఇలాంటి సవాలే చేశారు.

అందాల పోటీల్లో 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

అందాల పోటీల్లో 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. అయితే అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌(60) సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ ‘భామ’.. తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన అందాల పోటీలో ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌’ టైటిల్‌ గెలుచుకున్నారు.

రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం: కేసీఆర్

రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం: కేసీఆర్

TG: బీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్‌ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. రాజకీయ పార్టీల్లో చరిత్రలో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానం అని చెప్పుకొచ్చారు. ఆటుపోట్లు అధిగమించేందుకు బలమైన పునాదులు వేసింది కార్యకర్తలేనని పేర్కొన్నారు.

కాపుల ఓట్లే కీలకం.. జోగయ్య మరో లేఖ

కాపుల ఓట్లే కీలకం.. జోగయ్య మరో లేఖ

AP : కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఇప్పుడు మరో బహిరంగ లేఖ విడుదల చేశారు. బై బై YCP అనే నినాదం నిజం కావాలంటే.. కాపుల ఓట్లే కీలకం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కులాలే విజయావకాశాలను శాసిస్తున్నాయని ఆయన వివరించారు. కాపుల ఓట్లు జనసేనకు కలవడంతో కూటమి ఓటింగ్ 52 శాతానికి పెరిగిందన్నారు.

మూడు బంగారు పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు

మూడు బంగారు పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తా చాటారు. షాంఘైలో నిర్వహించిన మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్లలో మూడు బంగారు పతకాలు సాధించారు. జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ బృందానికి స్వర్ణం లభించింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కూడా జ్యోతిసురేఖ మెరిసింది. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ప్రియాన్స్‌, ప్రీతమేష్ బృందానికి స్వర్ణ పతకం లభించింది.

సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

AP: టీడీపీ ఎన్నికల ప్రచార వాహనానికి నిప్పుపెట్టడంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ స్పందించారు. ‘‘దారుణ ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే భ‌యంతో త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్నావు జ‌గ‌న్‌..! అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పుపెట్ట‌డం వైసీపీ దుర్మార్గాల‌కు ప‌రాకాష్ట‌. డ్రైవ‌ర్ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన మీ రాక్ష‌స‌త్వం స‌భ్య‌స‌మాజానికే సిగ్గుచేటు’’ అని పేర్కొన్నారు.

శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి

శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి

TG : ఉద్యోగం కోసం జోర్డాన్‌ వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో పెళ్లి చేసుకున్నారు. మెట్‌పల్లి మండలం మేడిపల్లికి చెందిన అశోక్‌ ఉద్యోగం కోసం జోర్దాన్‌ వెళ్లాడు. అక్కడ శ్రీలంకకి చెందిన సమన్వితో పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

ఆప్ ఎమ్మెల్యేకు ఊరట

ఆప్ ఎమ్మెల్యేకు ఊరట

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఇటీవలే అమానతుల్లాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్‌తో సీపీఎం నేతల భేటీ

సీఎం రేవంత్‌తో సీపీఎం నేతల భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య సీఎంతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై రేవంత్‌తో చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.