మూసాపేట్లో కంటెయినర్ బీభత్సం
హైదరాబాద్లోని మూసాపేట్లో ఓ కంటెయినర్ బీభత్సం సృష్టించింది. రహదారిపై వేగంగా వచ్చి మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద డివైడర్పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే.. కంటెయినర్ డ్రైవర్ మాత్రం వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపైనే వాహనం ఉండటంతో.. దాన్ని అక్కడి నుంచి తీసి పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.