ఫ్యాక్ట్ చెక్ 19 మార్చి 2024
ఫ్యాక్ట్ చెక్ 19 మార్చి 2024
ఫ్యాక్ట్ చెక్ 19 మార్చి 2024
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూసింది. ఫలితంగా రెండుసార్లు 44, 52 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో మొత్తంగా 149 ఎంపీ స్థానాలు ఉండే హిందీ రాష్ట్రాలు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లలో ఒక్కొక్క స్థానం మాత్రమే గెలిచింది. ఇక రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఖాతా కూడా తెరవలేదు. ఈసారైనా కాంగ్రెస్ కరువు తీరుతుందా? లేదా? అనేది చూడాలి.
TG : మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీసే అవకాశముందని వెల్లడించింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
జిల్లా ADD వీడియో
శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!
ఆయుష్మాన్ భావ 29 నవంబర్ 23
మీకు తెలుసా 19 మార్చి 2024
ఎలక్ట్రిక్ వెహికల్స్(EV)ను కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్–2పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్తపథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500కోట్లు కేటాయించింది. ఏప్రిల్ 1నుంచి కొత్తపథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీఆర్ఎస్ను వీడటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నివాసంలో ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతూ..‘‘నేను పార్ట్ టైం పొలిటీషియన్.. ఫుల్ టైం బిజినెస్మేన్ను. వ్యాపారపరంగా సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని మల్లారెడ్డి అన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం.
Happy Birthday Mohan Babu
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో BJP మూడో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని BJP ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మూడో జాబితాలో తెలంగాణలోని రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్లోని ఆరు సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనవరి నెలలో ఉష్ణోగ్రత కాస్త ఎక్కువ చల్లబడటం కానీ, కాస్త ఎక్కువ వెచ్చబడటం కానీ జరుగుతున్నా ఫిబ్రవరిలో మాత్రం సగటుకు మించి ఉష్ణోగ్రత పెరుగుతోందని తేల్చింది. మార్చిలో కనపడాల్సిన ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలోనే నమోదవుతున్నాయని తెలిపింది.
డివోషనల్ కోట్స్ 19 మార్చి 2024
దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో మొత్తంగా 129 లోక్సభ సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం బీజేపీ గెలిచినవి 29 స్థానాలే. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోనూ ఎంపీ స్థానాలు అధికంగా గెలుచుకోవాలని చూస్తోంది. ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా పర్యటిస్తున్నారు. మరి ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనేది వేచిచూడాలి.
AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం కంపార్టుమెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 65,051 మంది దర్శించుకోగా.. అందులో 23,107 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
లోక్సభ ఎన్నికలకు బీహార్లో NDA భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా BJP 17 స్థానాల్లో పోటీ చేయనుంది. CM నీతీశ్ కుమార్కు చెందిన JDU 16, చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ ఐదు స్థానాల్లో బరిలో దిగేందుకు అంగీకారం కుదిరింది.
TG : పెద్దపల్లి జిల్లాలోని మంథని పురపాలిక కాంగ్రెస్ వశమైంది. ఛైర్పర్సన్ శైలజ, వైస్ ఛైర్మన్ కుమార్లపై ఫిబ్రవరి16న అవిశ్వాసం పెట్టగా నెగ్గింది. ఆ రెండు పదవులు ఖాళీ కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు మంథని ఆర్డీవో హనుమనాయక్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రమాదేవిని ఛైర్పర్సన్గా, బానయ్యను వైస్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు నలుగురు BRSకౌన్సిలర్లు దూరంగా ఉన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ అడుగుపెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టీ-బీజేపీతో పొత్తుపెట్టుకుని ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారని సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలు కూడా సీరియస్గా తీసుకుని లెక్కలు వేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఖమ్మంలో టీడీపీకి టికెట్ ఇస్తే, గ్రేటర్ హైదరాబాద్లో ఆ ప్రభావం కనిపిస్తుందని, ఓటుబ్యాంకు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తోందట.
యువ మ్యాగజిన్ 19 మార్చి 2024
రఘువరన్ వర్థంతి
ఫ్లై91 సంస్థ తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా రూ.1991(అన్నింటితో కలిపి) ప్రత్యేకఛార్జీ సదుపాయాన్ని కంపెనీ అందిస్తోంది. ఫ్లై91 విమాన సర్వీసులన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. గోవా-హైదరాబాద్, సింధుదుర్గ్- హైదరాబాద్ మధ్య వారంలో రెండుసార్లు విమాన సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
మలయాళ అగ్రకథానాయకుడు మోహన్లాల్ కొత్తప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. తన తదుపరి చిత్రం ‘ఎల్360’ కోసం ‘ఆపరేషన్ జావా’ ఫేమ్ దర్శకుడు తరుణ్మూర్తితో చేతులు కలిపారు. ‘‘నా 360వ చిత్రం కోసం తరుణ్మూర్తి, ఎమ్.రెంజిత్లతో కలిసి పనిచేయనున్నాను. ఈ ప్రాజెక్టుకు కేఆర్ సునీల్ స్క్రిప్ట్ అందించారు. రెజపుత్ర విజువల్ మీడియా పతాకంపై ఎమ్.రెంజిత్ దీన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభించనున్నాము’’ అని ట్వీట్చేశారు.
AP: ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో అల్లూరి , కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, పలు కోస్తాజిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
మరో 3 రోజుల్లో ఐపీఎల్-17 సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి కొత్త కెప్టెన్ కమిన్స్, కొత్త హెడ్ కోచ్ డానియెల్ వెటోరి ఆధ్వర్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. 2022లో 10 జట్ల పోరులో 8వ స్థానాన్ని దక్కించుకున్న సన్రైజర్స్.. 2023లో మళ్లీ ఆఖరి స్థానానికి పడిపోయింది. వార్నర్ సారథ్యంలో 2016లో కప్పును ముద్దాడిన సన్రైజర్స్ మరోసారి ఆస్ట్రేలియా ఆటగాడి సారథ్యంలో విజేతగా నిలుస్తుందేమో చూడాలి.
రాశి ఫలాలు 19 మార్చి 2024
AP : ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే రోజున పోలింగ్ ఉండడంతో పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించారు. మే 15 నుంచి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
చరిత్ర చిత్రం 19 మార్చి 2024
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీకానుంది. ఈ భేటీలో జేపీ నడ్డా, ప్రధాని మోదీ, అమిత్ షా, బీఎల్ సంతోశ్తోపాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని 13రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు.
HYD: లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యే, MLCనియోజకవర్గ అభివృద్ధి పథకం కింద నిధుల మంజూరుపై ఆంక్షలు విధించినట్లు కేంద్ర ఎన్నికలసంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. గతంలో చేపట్టిన పనులు పూర్తయ్యి సంబంధిత అధికారులు సంతృప్తి చెందిన పక్షంలో ఆనిధులను విడుదల చేసేందుకు నిషేధం లేదని వెల్లడించింది.
HYD: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA)నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. మేడిగడ్డబ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్లల్లో సీపేజీ ఏర్పడటానికి గల కారణాలను తెలుసుకోవడానికి కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో NDSAనిపుణుల కమిటీ ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించింది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ట్విట్టర్, వాట్సప్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా యూట్యూట్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. పార్టీ ప్రధాన ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
TG : ఢిల్లీ మద్యం కేసులో తనకు EDజారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ BRSఎమ్మెల్సీ కవిత గతేడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఈనెల 15న తనను EDఅరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ నిన్న దాఖలు చేసిన మరో పిటిషన్నూ ఆమె తరఫు న్యాయవాదులు ఇదే కేసుతోపాటు ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.
TG : శాసనమండలి ఉపఎన్నిక ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిందన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు సాగుతోందని ఆయన వివరించారు.
HYD: ‘JV బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ(MD),వేలూరి జ్యోతి(CMD)దంపతులు ఓ సంస్థను నడిపిస్తున్నారు. రూ.10లక్షలు పెడితే ప్రతి 15రోజులకు రూ.20వేల వడ్డీతోపాటు అసలు రూ.లక్ష చొప్పున ఇస్తామని వినియోగదారులను నమ్మించారు. అయితే గత నెలరోజులుగా ఈ సంస్థ ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదు. ఫోన్లు చేసినా నిర్వాహకులు స్పందించడం లేదు. దీంతో బాధితులు రూ.2.50కోట్లు మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
AP: జీతాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. వారు తమ వినతులను అధికారులకు సమర్పించాలని తెలిపారు. పరిష్కారానికి ఇదే చివరి అవకాశమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల వినతులను క్రోడీకరించి నివేదించాలని జిల్లా అధికారులను నివాస్ ఆదేశించారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు కాంగ్రెస్లో పోటాపోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం టికెట్ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి ఆశిస్తున్నారు. భువనగిరి స్థానాన్ని చామల కిరణ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి కోరుతున్నారు. మరోవైపు మెదక్ టికెట్ను నీలం మధు ముదిరాజ్, మైనంపల్లి హన్మంతరావులు ఆశిస్తున్నారు.
TG: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. తదుపరి స్థానంలో 3.20 లక్షలతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పుర్ కేంద్రం ఉంది.
రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలంతా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు. ప్రార్థనల వల్ల అల్లాహ్ దయ తమపై ఉంటుందని నమ్ముతారు. అయితే నమాజ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు.
ఒకప్పుడు కామర్స్ అంటే సీఏ, సీఎస్ వంటి కోర్సులు మాత్రమే వినపడేవి. ఇప్పుడు బీకాం, బీబీఏ వంటి కోర్సులు కూడా ముందుంటున్నాయి. ఇంటర్లో కామర్స్ గ్రూప్ తీసుకున్నవాళ్లు డిగ్రీలో బీబీఏ, బీకామ్, బీకామ్ ఎల్ఎల్బీ, బీఏ ఎకనామిక్స్ ఆనర్స్, బీబీఏ ఎల్ఎల్బీ లాంటి కోర్సుల్లో చేరుతున్నారు. ఇలాంటి విభిన్న కోర్సుల్లో చేరినవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువే ఉంటున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. వార్ 2 సినిమాతో తారక్ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. అగ్రనటుడు హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ 60 నుంచి 80 రోజుల డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ నెలాఖరులో ఎన్టీఆర్ వార్-2 సినిమా షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది.
TG: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. ఈసారి 85 ఏళ్ల పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుందని, ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఫారం-డీ పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
గ్రెగ్ రాస్.. ఒక సినిమా కంపెనీకి సీఈవో. మంచి జీతం, స్టేటస్ ఉన్న లైఫ్ ని వదలిపెట్టి ట్రక్కు డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. ఎందుకో తెలియాలంటే పైవీడియో చూడాల్సిందే.
నేడు CWC, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నేడు జరిగే సమావేశంలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి తొలిజాబితాలో కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. అయితే నేటి సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అందులో 9మందితో కూడిన జాబితాను నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP: చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. ప్రస్తుతం ఆమె వయసు 53 ఏళ్లు. సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి సార్వత్రిక పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్ కేంద్రానికి వచ్చారు. అనివార్య కారణాలతో ఏడో తరగతిలో చదువు మానేశానని, ఆసక్తి ఉండటంతో మళ్లీ పరీక్షలకు వస్తున్నానని పెద్దమ్మి తెలిపారు.
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే కలిగే లాభాలు, నష్టాలు
కరివేపాకు నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో తుదిదశకు చేరుకుందని తెలుస్తోంది. వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఉంటాయని అంటున్నారు. రైతులకు రుణమాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. అలాగే పింఛన్ రూ.3 వేలను దశలవారీగా రూ.4 వేలు చేస్తామని చెబుతారని అంటున్నారు. రైతు భరోసా కింద సాయాన్ని రూ.20 వేలకు పెంచవచ్చని చెబుతున్నారు.
రంజాన్ 8వ రోజు
ఏడు వారాల నగలు ఎందుకు ధరించేవారో తెలుసా..?
తక్కువ ధరకే ఐఫోన్ 14