shape

Lifestyle ChotaNews

దొర బలుపు తగ్గలేదు: కేసీఆర్

దొర బలుపు తగ్గలేదు: కేసీఆర్

అధికారం కోల్పోయినా కేసీఆర్‌కు ఇంకా దొర బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు బండకేసి కొట్టినా సిగ్గు రాలేదని విమర్శించారు. పార్టీలో కూడా ఆయన పిలిస్తే స్పందించే నాయకులు లేకుండా పోతున్నారని చెప్పారు. మోదీ, అమిత్ షా ప్రసన్నం కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

పిఠాపురంలో వరుణ్‌ తేజ్ ప్రచారం

పిఠాపురంలో వరుణ్‌ తేజ్ ప్రచారం

AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నటుడు వరుణ్‌ తేజ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. జన సైనికులు వరుణ్ తేజ్‌‌కు ఘన స్వాగతం పలికారు. అయితే మే 5వ తేదీన పవన్‌కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారం చేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

‘మోదీని వదిలి మాపై పోరాటమా?’

‘మోదీని వదిలి మాపై పోరాటమా?’

రిజర్వేషన్లు రద్దు చేసేందుకు సిద్ధమైన బీజేపీని వదిలిపెట్టి తమపై పోరాటం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా బీజేపీతో కేసీఆర్‌కు వైరం ఉంటే మోదీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

కేసీఆర్ ట్వీట్‌పై సీఎం సెటైర్

కేసీఆర్ ట్వీట్‌పై సీఎం సెటైర్

మహబూబ్‌నగర్‌లో భోజనం చేస్తుండగా కరెంట్ పోయిందని కేసీఆర్ చేసిన తొలి ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. ‘‘రోజంతా తినడానికి నువ్వేమైనా బకాసురుడివా. పదేళ్ల మోదీ పాలన, రిజర్వేషన్ల రద్దును వదిలేసి వంద రోజులైన మాపై పోరాడుతున్నావు. అధికారం లేకపోతే బతకలేవా. రాష్ట్రానికి మంచి జరగకూడదని ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. సూర్యాపేటలో కూడా అబద్దాలు చెప్పి దొరికిపోయాడు’’ అని అన్నారు.

కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

కవిత బెయిల్ కోసం బీజేపీకి ఐదు పార్లమెంట్ స్థానాలను కేసీఆర్ తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గెలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారని చెప్పారు. అమాయకంగానో, అత్యుత్సాహంగానో మల్లారెడ్డి రెండు పార్టీల చీకటి ఒప్పందం బయటపెట్టారని వెల్లడించారు. బీజేపీతో వైరం ఉంటే వెంటనే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.

కేసీఆర్, మోదీ విధానం ఒక్కటే: సీఎం

కేసీఆర్, మోదీ విధానం ఒక్కటే: సీఎం

రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్న విషయంపై ఇంత వరకూ కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రద్దు చేయాలని చెప్పారని గుర్తు చేశారు. మోదీ, కేసీఆర్ ఒక్కటే విధానం పాటిస్తున్నారు కాబట్టే ప్రధానిని ప్రశ్నించడం లేదని విమర్శించారు.

ముంబై ముందు భారీ టార్గెట్

ముంబై ముందు భారీ టార్గెట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేశారు. ఫ్రేజర్-మెక్ గుర్క్ (84) విధ్వంసం సృష్టించాడు. ఇతనికి తోడు స్టబ్స్ (48*) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. హోప్ (41), పోరెల్ (36), పంత్(29) రాణించారు.

బీసీల రిజర్వేషన్లు పెంచుతాం: సీఎం

బీసీల రిజర్వేషన్లు పెంచుతాం: సీఎం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుల గణన చేసిన తర్వాత జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హామీతో బీజేపీ కుట్ర చేసి 2025 నాటికి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

ఆ విషయంలో బాధపడ్డాను: సోనమ్‌ కపూర్

ఆ విషయంలో బాధపడ్డాను: సోనమ్‌ కపూర్

నటి సోనమ్‌ కపూర్ ప్రసవానంతరం తనకెదురైన అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బరువు పెరగడంతో బాధపడినట్లు తెలిపారు. ‘‘గర్భం దాల్చిన తరువాత 32 కిలోల బరువు పెరిగాను. దీంతో కొంచెం బాధపడ్డాను. డెలివరీ అయ్యాక బిడ్డను చూసుకోవడంలో మునిగిపోయి బరువు తగ్గడం గురించి ఆలోచించలేదు. ఏడాదిన్నర తర్వాత శరీరాకృతిపై దృష్టిపెట్టాను. ఇప్పటి వరకు 20 కిలోలు తగ్గాను’’ అని చెప్పారు.

ఆరెస్సెస్, బీజేపీ లక్ష్యం అదే: రేవంత్

ఆరెస్సెస్, బీజేపీ లక్ష్యం అదే: రేవంత్

ఆరెస్సెస్, బీజేపీ స్పష్టమైన అజెండాతో పని చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆరెస్సెస్‌ను 1925లో స్థాపించినప్పుడు వందేళ్లలో భారత్‌ను హిందూ దేశంగా మార్చుతామని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ రిజర్వేషన్లు లేని దేశాన్ని నిర్మిస్తామని చెబుతూ వచ్చారు. అందుకు ఈసారి ఎన్నికలను వాడుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇది దేశానికి మూలవాసులైన దళితులు, గిరిజనులపై సర్జికల్ స్ట్రైక్ లాంటిదని వ్యాఖ్యానించారు.

34 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

34 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేశారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి అసాంఘిక కార్యకలాపాలకు భారీగా లావాదేవీలు జరిగాయని బెదిరించారు. వరుసగా ఫోన్లు చేసి విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.34లక్షలు కాజేశారు. ఇటీవలTS RTCఛెైర్మన్ సజ్జనార్ ఇదే విషయంపై ప్రజలను హెచ్చరించారు.అనుమానితుల ఫోన్లు ఎత్తవద్దని,ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

దౌర్జన్యంగా గెలవాలని చూస్తున్నారు: రేవంత్

దౌర్జన్యంగా గెలవాలని చూస్తున్నారు: రేవంత్

ప్రధాని మోదీ, అమిత్ షా అన్ని వ్యవస్థలను వాడుకొని లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్రమంగా, దౌర్జన్యంగా 400 సీట్లు గెలవాలని చూస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని అన్నారు.

పర్యాటక అభివృద్ధికి మంత్రి రోజా ఏం చేశారు?: షర్మిల

పర్యాటక అభివృద్ధికి మంత్రి రోజా ఏం చేశారు?: షర్మిల

AP: అరకులో పర్యాటక అభివృద్ధికి మంత్రి రోజా ఏమైనా చేశారా అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. ఆదివాసీల సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అరకు అభివృద్ధికి రూ. 600 కోట్లు ఇస్తామన్న జగన్.. మాట తప్పారని షర్మిల విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఇదేం బ్యాటింగ్ సామీ!

ఇదేం బ్యాటింగ్ సామీ!

IPL: ముంబై, ఢిల్లీ మధ్య మ్యాచ్‌లో జేక్‌ ఫ్రేసర్‌ బ్యాట్‌తో విశ్వరూపం చూపించాడు. కేవలం 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అయితే ఇందులో 4 పరుగులు మాత్రమే సింగిల్స్‌ రూపంలో వచ్చాయి. మిగితా 80 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే సాధించాడు. దీంతో అతడి ఆటతీరు చూసిన ఫ్యాన్స్ అంతా ఇదేం బాదుడు సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మారుతి నుంచి త్వరలో హైబ్రిడ్‌ కారు

మారుతి నుంచి త్వరలో హైబ్రిడ్‌ కారు

దేశంలో అందుబాటు ధరకే హైబ్రిడ్‌ కార్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీ నుంచి ఈకారు రాబోతోంది. ఇందుకోసం జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ చిన్నపాటి హైబ్రిడ్‌ కార్ల తయారీపై పని చేస్తోంది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు.ప్రస్తుతం ఉన్న కార్ల కంటే ఎక్కువ మైలేజీతో ఇవి రానున్నాయని తెలిపారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

అమెరికాలోని సౌత్‌ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందగా..ఒకరు గాయపడ్డారు. వారంతా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల పేర్లు రేఖాబెన్ పటేల్‌, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు.

ఏపీపై నటి సంచలన కామెంట్

ఏపీపై నటి సంచలన కామెంట్

నటి పూనం కౌర్ ఏపీపై సంచలన కామెంట్ చేశారు. ‘‘ఏపీ ఈజ్ ద న్యూ యూపీ’’ అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తర ప్రదేశ్‌తో పోల్చుతూ పూనమ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఎవరిని టార్గెట్ చేసి ఈ పోస్టు పెట్టారో అని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం

టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం

శ్రీసత్యసాయి: ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి బి. పార్థసారథిని, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, వెంకీ, నరసింహమూర్తి, గోవింద్ పాల్గొన్నారు.

జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలు

జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలు

ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను రాయి వేయలేదని చెప్పినట్టు సమాచారం. రూ.300 ఇస్తామంటే రోడ్ షో‌కు తన స్నేహితుడితో కలిసి వచ్చానని చెప్పాడు. దాడికి ముందు కరెంట్ పోయిందనీ, అప్పుడు ఏం జరిగిందో తనకు తెలియదని వివరించాడు.

తెలంగాణలో ఎల్లో అలెర్ట్‌..

తెలంగాణలో ఎల్లో అలెర్ట్‌..

TS: రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. రాగల 5 రోజుల్లో వడగాల్పులు వీస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సోమవారం నుంచి బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

హామీలన్నీ నెరవేరిస్తే.. రాజీనామా చేస్తా: ఏలేటి

హామీలన్నీ నెరవేరిస్తే.. రాజీనామా చేస్తా: ఏలేటి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ కేవలం రైతు రుణమాఫీపైనే సవాల్ విసురుతున్నారని.. మిగతా హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కాగా, కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే.

జేక్‌ ఫ్రేజర్‌ జోరు.. ముంబైకి చుక్కలు

జేక్‌ ఫ్రేజర్‌ జోరు.. ముంబైకి చుక్కలు

IPL: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ, ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జేక్‌ ఫ్రేజర్‌ తన బ్యాట్‌తో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో పవర్‌ ప్లేలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ఫ్రేజర్ నిలిచాడు. చివరకు 84 వ్యక్తిగత పరుగుల వద్ద పీయూశ్‌ చావ్లా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు

ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు

దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అరుదు. అలాంటిది ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. 2023-24ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘గూగుల్ కంపెనీలో 2004 ఏప్రిల్ 26 నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

OTTలో ‘ఫ్యామిలీ స్టార్’..విజయ్‌పై దారుణమైన ట్రోల్స్

OTTలో ‘ఫ్యామిలీ స్టార్’..విజయ్‌పై దారుణమైన ట్రోల్స్

హీరో విజయ్ దేవరకొండను సినీ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన వారు నెగిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో దోశ వేసే సీన్ చూసి.. 'అవసరమైతే దోశలు తినడం మానేస్తాం గానీ ఇలాంటి దోశలు తినం బాబోయ్' అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

సీఎం జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ఏపీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ‘‘మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28పథకాలను నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీ వారే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి’’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.