‘2026 నాటికి అందుబాటులోకి బుల్లెట్ రైలు’
బుల్లెట్ రైలు 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026నాటికి ప్రారంభిస్తామన్నారు. మొదటగా గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు నడుపుతామని, 2028నాటికి ముంబై – అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని వివరించారు.