shape

Business ChotaNews

‘2026 నాటికి అందుబాటులోకి బుల్లెట్‌ రైలు’

‘2026 నాటికి అందుబాటులోకి బుల్లెట్‌ రైలు’

బుల్లెట్‌ రైలు 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026నాటికి ప్రారంభిస్తామన్నారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు నడుపుతామని, 2028నాటికి ముంబై – అహ్మదాబాద్‌ పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని వివరించారు.

‘2026లో బుల్లెట్ రైలు పరుగులు’

‘2026లో బుల్లెట్ రైలు పరుగులు’

కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బుల్లెట్ రైలు 2026 నాటికి రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన పలు ప్రాజెక్టులపై మాట్లాడారు.‘‘బుల్లెట్‌ రైలు కోసం 500కి.మీల ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్‌ 8-10 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తిచేయనుంది’’ అని వెల్లడించారు.

బెంగళూరులో వెల్లువెత్తిన నిరసనలు

బెంగళూరులో వెల్లువెత్తిన నిరసనలు

కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్‌లో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు ముకేశ్‌ అనే షాప్‌కీపర్‌ను తీవ్రంగా కొట్టిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. సిద్ధన్న లేఅవుట్‌లో ముకేశ్‌ మొబైల్‌ దుకాణం నిర్వహిస్తున్న ప్రాంతానికి ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు. ముకేశ్‌పై దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.జై శ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తించారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

కారు అదుపు తప్పి వరంగల్ నిట్ విద్యార్థి మృతి

కారు అదుపు తప్పి వరంగల్ నిట్ విద్యార్థి మృతి

కారు అదుపు తప్పి వరంగల్ నిట్ విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పీఎస్‌ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో యూపీకి చెందిన క్షతిరాజ్ (24) మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. అద్దె కారులో స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్‌కు రైతు ప్రయోజనాలు పట్టవు: హరీశ్

కాంగ్రెస్‌కు రైతు ప్రయోజనాలు పట్టవు: హరీశ్

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు, పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాంగ్రెస్‌కు రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టవని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.

చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా

ఏపీ స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో నేడు విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఆధ్యాత్మిక టూర్‌లో మేటి బాక్స‌ర్ ఫ్ల‌యిడ్ మేవెద‌ర్‌

ఆధ్యాత్మిక టూర్‌లో మేటి బాక్స‌ర్ ఫ్ల‌యిడ్ మేవెద‌ర్‌

మాజీ బాక్సింగ్ చాంపియ‌న్ ఫ్ల‌యిడ్ మేవెద‌ర్‌ ముంబైలోని సిద్ధివినాయ‌క ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న ఆయన ప్ర‌స్తుతం భారత్‌లో ఆధ్యాత్మిక టూర్ చేస్తున్నాడు. మేవెద‌ర్ కెరీర్‌లో అద్భుత‌మైన రికార్డు ఉంది. ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్‌లో ఆయన ఖాతాలో 50విక్ట‌రీలు ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. వేర్వేరు వెయిట్ కేట‌గిరీల్లో జ‌రిగే బౌట్‌ల్లోనూ.. మేవెద‌ర్ ఖాతాలో 15మేజ‌ర్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ట్రోఫీలు ఉన్నాయి.

పేలుడు పదార్థాలు కలకలం

పేలుడు పదార్థాలు కలకలం

బెంగళూరులో నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌లో పోలీసులు పేలుడు పదార్ధాలు గుర్తించారు. అందులో జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లతోపాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. ట్రాక్టర్‌ యజమానిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మేఘన ఫుడ్స్ మీద ఐటీ దాడులు

మేఘన ఫుడ్స్ మీద ఐటీ దాడులు

బెంగళూరుకు చెందిన మేఘన ఫుడ్స్ గ్రూప్‌(Meghana Foods Group) మీద కర్ణాటక(Karnataka), గోవా(Goa) ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కోరమంగళ, ఇందిరానగర్‌లోని కార్యాలయాలు సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మేఘన ఫుడ్స్ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్న కారణంగానే ఐటీ అధికారులు(IT Officers) సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే

సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలన్ని అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించగా.. ఓ పార్టీలో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తులు మరో పార్టీలోకి వెళ్తున్నారు. తాజాగా అధికార వైసీపీ నుంచి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన సీతా సోరెన్

పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన సీతా సోరెన్

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వ‌దిన‌, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీలోని అన్ని ప‌ద‌వుల‌కూ రాజీనామా చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్న దివంగత దుర్గా సోరెన్ స‌తీమ‌ణి. కాగా త‌న భ‌ర్త మ‌ర‌ణానంత‌రం తనను, త‌న కుటుంబాన్ని అగౌర‌వ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీతా సోరెన్ రాజీనామా లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై ఇదే..!

బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై ఇదే..!

సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం రక్షించడంతో బల్గేరియా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ఏడుగురు బల్గేరియా జాతీయులు సురక్షితంగా ఉన్నారు. త్వరలో తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు, హైజాకింగ్ వంటి చర్యల కట్టడికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ సమాధానం ఇచ్చారు.

జగన్ తొలిసభ అక్కడే.. బస్సుయాత్ర షెడ్యూల్ రెడీ

జగన్ తొలిసభ అక్కడే.. బస్సుయాత్ర షెడ్యూల్ రెడీ

AP : ఈ నెల 27వ తేదీ నుంచి YCP చీఫ్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3గంటలకు YCP నేతలు బస్సు యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఉదయం పూట ప్రజలు, కార్యకర్తలతో జగన్ మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రొద్దుటూరులో ఈ నెల 27న తొలి బహిరంగ సభ జరగనుంది.

ఈడీ ప్రకటనపై ఆప్ అభ్యంతరం

ఈడీ ప్రకటనపై ఆప్ అభ్యంతరం

ఢిల్లీ మద్యం విధానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. ఈ దర్యాప్తు సంస్థ బీ జేపీ పొలిటికల్‌ వింగ్‌లా పనిచేస్తోందని మండిపడింది.

ఆ నినాదం రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది: చంద్రబాబు

ఆ నినాదం రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది: చంద్రబాబు

AP : NDA కూటమికి లోక్‌సభలో 400+ స్థానాలు, APలో 160కి పైగా MLA సీట్లు అనే నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని చెప్పారు. ఏపీలో TDP, జనసేన, BJP కూటమి విజయం సాధించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు.

బీజేపీలోకి మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. ఇదే క్లారిటీ!

బీజేపీలోకి మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. ఇదే క్లారిటీ!

తాను బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. తాను రాముని గుడికి వెళ్లింది వాస్తమేనని.. అయితే, అయోధ్యను సందర్శిస్తే బీజేపీలో చేరినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. కోడిగుడ్ల మీద ఈకలు పీకే ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. తాను పార్టీ మారబోనని.. బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చిన్న నాయకులను ప్రలోభపెట్టి.. అధికార పార్టీలోకి లాక్కుంటున్నారని ఆయన ఆగ్రహించారు.

డ్రగ్స్‌ వినియోగంపై మస్క్‌ ఏమన్నారంటే..?

డ్రగ్స్‌ వినియోగంపై మస్క్‌ ఏమన్నారంటే..?

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మాదకద్రవ్యాలను వినియోగించినట్లు అంగీకరించారు. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకు కెటమిన్‌ అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం మస్క్‌ డ్రగ్స్‌ వినియోగంపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.

నమో యాప్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా గీతామూర్తి

నమో యాప్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా గీతామూర్తి

HYD: నమో యాప్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కాచిగూడకు చెందిన కె.గీతామూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కె.గీతామూర్తి మాట్లాడుతూ.. ప్రజల నుంచి మైక్రోడొనేషన్స్‌ సేకరించడానికి నమో యాప్‌ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. భేటీ బచావో, స్వచ్ఛభారత్‌, కిసాన్‌ సేవా కార్యక్రమాలకు ప్రజలు తమవంతు విరాళాలు అందించాలని కోరారు.

పోటీపై క్లారిటీ ఇచ్చిన మైనంపల్లి

పోటీపై క్లారిటీ ఇచ్చిన మైనంపల్లి

TG : మాజీ MLA మైనంపల్లి హన్మంతరావు లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి అన్నారు.

‘లోక్‌సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలి’

‘లోక్‌సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలి’

రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ బీజేపీ ధ్వంసం చేస్తున్నందున లోక్‌సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని టీఎంసీ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ తన పార్టీ ఆఫీసుగా మార్చుకుంటోందని ఆరోపించారు. ప్రజలను నేరుగా ఎదుర్కునే ధైర్యం లేక వక్రమార్గంలో వెళ్తుందని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ అధికారులను ఎందుకు బదిలీ చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు.

నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

హైదరాబాద్‌: శంషాబాద్‌ పరిధిలో నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీబాలాజీ ఇండస్ట్రీపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. హానికర రసాయనాలు, సింథటిక్‌ రంగులతో సాస్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 772 లీటర్ల కల్తీ సాస్‌, 30 లీటర్ల ఎసిటిక్‌ ఆసిడ్‌, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ సాస్‌ విలువ రూ.3.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు స‌మన్లు

బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు స‌మన్లు

యోగా గురువు బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌తంజ‌లి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజ‌రుకావాల‌ని నోటీసులు జారీచేసింది. రాందేవ్ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు పేర్కొంది. జ‌స్టిస్ హిమా కోహ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును ఇవాళ విచారించింది. ఈ కేసులో ప‌తంజ‌లి మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆచార్య బాల‌కృష్ణ‌కు స‌మ‌న్లు కూడా జారీ చేసింది.

లాంగెస్ట్‌  దోసె.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

లాంగెస్ట్‌ దోసె.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోసె.. లాంగెస్ట్ దోసెగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ MTR ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసెను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసెను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది.

TDPలో విషాదం.. కీలక నేత కన్నుమూత

TDPలో విషాదం.. కీలక నేత కన్నుమూత

AP : తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన ముఖ్యనేత గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లాకు చెందిన BC నేత గుంటుపల్లి నాగేశ్వరరావు TDPలో చాలా కీలకంగా ఉన్నారు. టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులుగా ఉన్నారు. గతంలో రెండుసార్లు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ పని చేశారు.

అసెంబ్లీ ఎలక్షన్: కోవూరులో ఆసక్తికర పోరు

అసెంబ్లీ ఎలక్షన్: కోవూరులో ఆసక్తికర పోరు

ఏపీ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా కోవూరులో ఆసక్తికర పోరు నెలకొంది. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైసీపీ తరపున ఆయన మరోసారి టిక్కెట్ దక్కించుకున్నారు. టీడీపీ తరఫున మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి టిక్కెట్ లభించింది. ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న వేమిరెడ్డి ధాటికి ప్రసన్నకుమార్‌రెడ్డి ఏమాత్రం నెగ్గుకొస్తాడో వేచిచూడాలి.

అనకాపల్లి MP టికెట్‌పై YV క్లారిటీ

అనకాపల్లి MP టికెట్‌పై YV క్లారిటీ

AP : అనకాపల్లి MP టికెట్‌ అభ్యర్థి పెండింగ్‌లో ఉండడంపై YCP ప్రాంతీయ సమన్వయకర్త YV సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని పేర్కొన్నారాయన. అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నామన్నారు.

APPSC పరీక్షపై నేడు హైకోర్టులో విచారణ

APPSC పరీక్షపై నేడు హైకోర్టులో విచారణ

AP : APPSC పరీక్షలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ AP ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. గ్రూప్1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు ధర్మాసనం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్న ఉత్కంఠ ఇటు పరీక్ష రాసిన అభ్యర్థుల్లోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ నెలకొని ఉంది.

ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌ కుమార్తె

ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌ కుమార్తె

యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ భార్య, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలేష్‌, డింపుల్‌ల కుమార్తె అదితి యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ టికెట్ కేటాయించింది. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కనిపించారు.

ఐస్‌క్రీములు తింటున్నారా.. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో చూడండి?

ఐస్‌క్రీములు తింటున్నారా.. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో చూడండి?

రోడ్లపై ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీమ్ తింటున్నారా? అయితే జాగ్రత్త. కొందరు దుర్మార్గులు మీరు తినే ఆహార పదార్థాల్లో వీర్యం, మూత్రం కలుపుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నెక్కొండలో ఇలాంటి హేయమైన ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై ఫలూదా, ఐస్‌క్రీమ్ అమ్ముకునే ఓ వ్యక్తి.. వాటిలో వీర్యం కలిపే వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

బీజేపీకి షాక్.. కేంద్రమంత్రి రాజీనామా

బీజేపీకి షాక్.. కేంద్రమంత్రి రాజీనామా

లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA)భాగస్వామ్య పక్షం రాష్ట్రీయ్ లోక్ జనశక్తి పార్టీ (RLJP)కూటమి నుంచి వైదొలిగింది. అంతేకాకుండా RLJP అధ్యక్షుడు పశుపతి కుమార్‌ పరాస్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల బీహర్ లోక్‌సభసీట్లలో జరిగిన కేటాయింపులపై పశుపతి గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో బీజేపీ తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు.

TDP ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

TDP ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

AP : తెలుగుదేశం పార్టీ MP అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. BJP, జనసేనలతో కూటమి కట్టి సీట్ల సర్ధుబాటు చేసుకున్న ఆయన.. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. అధికార YCPపార్లమెంట్ అభ్యర్థుల జాబితాను వెల్లడించిన నేపథ్యంలో వారికి దీటైన గెలుపు గుర్రాల కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. నేడు, రేపట్లో కొంతమంది MPఅభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.

గద్వాల జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్?

గద్వాల జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్?

గద్వాల జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో గద్వాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌,16మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు సరిత రంగం సిద్ధం చేశారు. త్వరలో వీరంతా హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు

లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు

AP: గతేడాది ఆగస్టులో తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు. టీటీడీ బంధించిన నాలుగో చిరుతే.. లక్షితపై దాడిచేసిందని అధికారుల విచారణలో తేలింది. కాగా.. మొత్తం ఆరు చిరుతలను టీటీడీ బంధించింది. దాడి చేసిన చిరుతతో పాటు అన్ని చిరుతలను జూ పార్కులోనే సంరక్షించాలని అధికారులు నిర్ణయించారు.

జనంలోకి చంద్రబాబు.. ప్రజాగళం యాత్రలకు రెడీ

జనంలోకి చంద్రబాబు.. ప్రజాగళం యాత్రలకు రెడీ

AP : TDP అధ్యక్షుడు చంద్రబాబు 22వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దాదాపు 20రోజులపాటు 60 నియోజకవర్గాలలో పర్యటించేలా రూట్‌ మ్యాప్ సిద్ధం చేశారు. కొంత విరామం ఇచ్చి రెండో విడత పర్యటనలు ప్రారంభిస్తారని TDP నేతలు తెలిపారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటనలు నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటనలపై ఉండవల్లి నివాసంలో ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు.