శుభోదయం 11.06.23
శుభోదయం 11.06.23
శుభోదయం 11.06.23
ఒపినియన్ - tollywood 10.6
దేశీయ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. గడచిన అనేక నెలలుగా కంపెనీ పలు దఫాలుగా ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఈ వరుస తొలగింపులకు తోడు చట్టపరమైన చిక్కులు కంపెనీని కుదిపేస్తున్నాయి. బైజూస్కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటో పైనున్న వీడియోలో చూడండి.
శుభ ఆదివారం 11.06.23
TS: 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ను నిర్వహించడంతోపాటు అర్హత సాధించిన విద్యార్థుల మొదటి జాబితాను ఇటీవలే విడుదల చేశారు.ఈనెల 10లోగా కేటాయించిన గురుకులాల్లో అడ్మిషన్ రిపోర్ట్ చేయాలని సూచించగా..తాజాగా ఆ గడువును 15వరకు పొడిగించారు.
తెలంగాణలోని 8 యూనివర్సిటీలతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్-2023 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సీపీగెట్ దరఖాస్తులకు ఆదివారంతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు సీపీగెట్కు 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసినా రూ.500 ఫైన్తో ఈనెల 18, రూ.2 వేల ఫైన్తో ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశముంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా కదులుతోందని, గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు అలెర్ట్ ప్రకటించింది.తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఉక్రెయిన్ భారీ స్థాయిలో రష్యాపై ఎదురుదాడి ప్రారంభించింది. డొనెట్స్క్, బఖ్ముత్ సహా చాలా ప్రాంతాల్లో తమ దళాలు ముందుకు దూసుకుపోతున్నాయని కీవ్ తెలిపింది. ముఖ్యంగా బఖ్ముత్లో మాస్కో దళాలను వెనక్కి నెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నగరాన్ని తాము పూర్తిగా కైవసం చేసుకున్నామని గతవారం రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు శత్రువు భారీస్థాయి ఎదురుదాడి విఫలమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే ఆశాభావం వ్యక్తం చేశారు. లాడ్లీ బెహనా యోజన కింద రాష్ట్రంలోని 1.25కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆమె ప్రశంసించారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, పిల్లలు,వృద్ధులు, మహిళలు, కార్మికులు, విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించాయన్నారు.
ఆఫ్రికా దేశం సోమాలియాలో శనివారం భారీ బాంబు పేలుడు సంభవించింది. సోమాలియాలోని లోయర్ షాబెల్లె రీజియన్లోని ఫుట్బాల్ స్టేడియంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 27 మంది మరణించినట్లు, 53 మందికి తీవ్రగాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు సమాచారం.
ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్ల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ 657 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా..తాజాగా కోహ్లీ సచిన్ను 660 పరుగులతో అధిగమించారు. డబ్ల్యూటీసీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డులకెక్కాడు.ఇక ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు.
వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థాన్ని ఉద్దేశిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఓ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో‘‘ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తుంది.ఇక్కడే ఓ కుర్రాడిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా’’అంటూ లావణ్యపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల వీడియోను బన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, బుద్వేల్, హైదర్గూడ, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలో భారీ వర్షం కురిసింది. అలాగే మెహదీపట్నం, మాసాబ్ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం ప్రభావంతో వాహనదాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్తో పాటు జనగాం, సంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసింది.
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ వన్.. పోలాండ్ క్రీడాకారిణి స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన అన్సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్.. 2023లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ను కైవసం చేసుకుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులతో నిలిచింది. రోహిత్ శర్మ(43), గిల్ (18), పుజారా (27) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(44), రహానె(20) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్కాట్, నాథన్ తలో వికెట్ తీశారు.అయితే, భారత్ విజయానికి 280 పరుగుల దూరంలో ఉంది.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి తనకు మధ్య జరిగిన ట్విట్టర్ వార్పై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ స్పందించింది. విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి బాధపడ్డానని ఆమె పేర్కొంది. ఇకపై విజయ్ ఫ్యాన్స్తో గొడవపడొద్దని డిసైడ్ అయినట్లు, మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. విజయ్తో కాల్ మాట్లాడడానికి ట్రై చేశానని, అతను స్పందించలేదని తెలిపింది.
TS: బీజేపీ తెలంగాణ అధ్యక్షుని మార్పు అనేది ప్రచారం మాత్రమేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తమకు పోటీ బీఆర్ఎస్తోనే అని, కాంగ్రెస్తో కాదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వెళ్తారనే ప్రచారం జరుగుతోందని, వెళ్లే వారు వెళ్లొచ్చని చెప్పారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పిన దానికి తాము కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని కోర్టులో గ్యాంగ్స్టర్ సంజీవ్ మహేశ్వరీ జీవా హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై యూపీ డిప్యూటీ సీఎం కేసీ మౌర్య స్పందించారు. ఆ ఘటనపై సిట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు బయటపెడతారని అన్నారు. పోలీసు కస్టడీలో ఒకరిని చంపడం సరైనది కాదని, అయితే యూపీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది ‘దిల్వాలే దుల్హానియా లేజాయెంగే’ మూవీలోని ఐకానిక్ పోజ్. ఈ పోజ్ను షారుఖ్ రీక్రియేట్ చేశారు. షారుఖ్ నటించిన రీసెంట్ బ్లాక్బస్టర్ ‘పఠాన్’ ఆదివారం ఓ ఛానల్లో ప్రసారంకానున్న నేపథ్యంలో ‘పఠాన్’ను ప్రసారం చేయనున్న సదరు ఛానల్ సుమారు 300 మంది షారుఖ్ అభిమానుల మధ్య ఆయన ఐకానిక్ పోజ్లను రీక్రియేట్ చేయించింది.
AP: ప్రకాశం జిల్లా ఈతముక్కల సముద్ర తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. గల్లంతైన మరో యువకుడిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TS: ప్రజాశాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే ఏడాదిలోగా ప్రజల కష్టాలన్నీ తీరుస్తానని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని చెప్పారు. ‘కేసీఆర్.. నాతో కలిసి వస్తావా.. సీఎం కుర్చి దిగుతావా’ అని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న బీసీ బానిసలంతా ఇప్పటికైనా బయటకు రావాలని పిలుపునిచ్చారు.
పంచాయతీ ఎన్నికల గురించి ప్రకటించడంతోనే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మరింత దిగజారిందని ఆ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ విమర్శించారు. టీఎంసీ చెందిన ఓ నేత నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారని, అది చూస్తుంటే రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోందని తెలిపారు. కేంద్ర బలగాలను ఉపయోగించకుండా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కష్టమేనని చెప్పారు.
AP: నేడు శ్రీకాళహస్తి బహిరంగసభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న స్కాములు, రాజధాని అమరావతిపై నడ్డా చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. సాక్షాత్తు తిరుపతి వెంకన్న పాదాల చెంత నడ్డా కేంద్రం చేసిన పనులపై అన్నీ అబద్ధాలే చెప్పారని ఆరోపించారు. కానీ వైసీపీ గురించి మాత్రం అన్నీ నిజాలే చెప్పారన్నారు.
కుమారుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్పై నటుడు నాగబాబు స్పందించారు. ‘నా కొడుకు నిశ్చితార్థంతో అతని అందమైన వధువును మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనలైయ్యాను. ఇది గతానికి, వర్తమానానికి వారధిగా ఉండే ఆనందకరమైన క్షణం. ఈ జంట ప్రయాణం అద్భుతంగా, ఆనందకరంగా సాగాలని ఆశ్సీసులు అందజేస్తున్నాన’ని ట్వీట్ చేశారు. దీనితోపాటు వారి ఫ్యామిలీ ఫొటోను కూడా పంచుకున్నారు.
TS: బీజేపీ ఖమ్మం బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ఈనెల 15న జరిగే ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో వారితో సమావేశమై సభకు సంబంధించిన ఏర్పాట్లపై వారితో చర్చించారు.
AP: పశ్చిమగోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీ సమీపంలోని అడవిలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నేటి ఉదయమే అక్కడ మంటలు అంటుకోగా.. ఫైర్ సిబ్బంది కష్టపడి మంటలను అదుపు చేశారు. అయితే, సాయంత్రం 6 గంటల తర్వాత వీస్తున్న గాలుల వల్ల అగ్గి మళ్లీ రాజుకుంది.
TS: నిమ్స్ ఆస్పత్రికి నూతనంగా నియామకమైన డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మంత్రి హరీశ్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు, హరీశ్రావుకు కృతజ్ఞతలు చెప్పారు. వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఆస్పత్రిలోని అన్ని విభాగాల సిబ్బందితో కలిసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు బీరప్పకు శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటకలో ఓడిపోవడంతో పార్లమెంట్ ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గుతోందని చెప్పారు. తమిళనాడుకు గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో జాబితా విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్టాలిన్ డిమాండ్ చేశారు.
సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని RV ఇంజనీరింగ్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగి భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో కంపెనీలో పనిచేసే కార్మికులు రమణారెడ్డి (47), సతీష్ (45)తో పాటు మరో ఇద్దరు తీవ్రగాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని 4 ఫైరింజన్లతో మంటలార్పారు.
సూపర్స్టార్ మహేశ్ బాబు AMB Cinemas పేరుతో ఓ మల్టీప్లెక్స్ని రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే బాటలో అల్లు అర్జున్ కూడా నడుస్తున్నాడు. త్వరలోనే ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్ పేరుతో అమీర్పేట్లో మల్టీప్లెక్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’తో జూన్ థియేటర్ని ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందులో మొత్తం ఐదు స్క్రీన్స్ ఉండనున్నాయి.
AP: విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవానీపురంలోని భాస్కర్ నగర్లో ఉంటున్న దంపతులు తుపాకుల దుర్గా దేవి, తారక్ అనధికారికంగా చిట్టీలు, గోల్డ్ స్కీమ్ పేరుతో ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి చివరికి అప్పులపాలు కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TVS మోటార్ కంపెనీ ఫైనాన్స్ విభాగమైన TVS క్రెడిట్ సర్వీసెస్లో అజీమ్ ప్రేమ్జీ భారీగా పెట్టుబడి పెట్టారు. రూ.737 కోట్లను ఇన్వెస్ట్ చేసి 9.7 శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రైమరీ, సెకండరీ ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో ప్రేమ్ జీ పెట్టుబడి పెట్టారని సమాచారం. TVS క్రెడిట్కు మొదటి సారి బయటి నుంచి వచ్చిన మూలధనం ఇది.
ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని బీజేపీ భావిస్తున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని తెలిపారు. ఈ రిజర్వేషన్లపై ఉద్ధవ్ ఠాక్రే తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో స్కాములు జరిగాయని విమర్శలు చేశారు.
AP: ఏలూరు రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే టెక్నికల్ వ్యాగన్లో మంటలు చెలరేగాయి. వ్యాగన్లో ఆయిల్ టిన్ను అంటుకోవడంతో బోగీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలకు ఆర్పివేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న 14 వేల మంది టీచర్లను క్రమబద్దీకరణ చేయడానికి పంజాబ్ కేబినేట్ శనివారం ఆమోదం తెలిపింది. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకోనప్పటికీ కూడా 6 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని రాష్ట్ర CM భగవంత్ మాన్ పేర్కొన్నారు. రెగ్యులరైన ఉద్యోగులకు జీతాలు, భత్యాలు, సెలవులు ప్రభుత్వ ఫాలసీ ప్రకారం వర్తిస్తాయని చెప్పారు.
WFI ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యవహారంలో రాజీకి రావాలంటూ.. తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని రెజ్లర్ సాక్షి మాలిక్ ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ తన మనుషుల ద్వారా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు కాల్స్ చేయించి.. కంప్లైంట్స్ వెనక్కి తీసుకోవాలని వార్నింగ్స్ ఇస్తున్నారని తెలిపారు. అందుకే మైనర్ బాధితురాలు ఒత్తిడికి గురై స్టేట్ మెంట్ మార్చిందని చెప్పారు.
TS: రేపు జరగబోయే ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పలు సూచనలు జారీ చేసింది. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని చెప్పింది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు అనుమతించమని తెలిపింది. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలని పేర్కొంది. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలని వెల్లడించింది.
భారత్ 2022లో భారీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలను నమోదు చేయడంతో ఇండియన్స్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో ఇండియన్స్ను తిరుగులేని ఛాంపియన్స్గా అభివర్ణించారు. భవిష్యత్తులోను అదే స్ఫూర్తిని కొనసాగించాలని తెలిపారు. ఇండియా 2022లో 89.5 మిలియన్ డిజిటల్ లావాదేవీలను చేసింది. భారత ఎకానమీ వృద్ధికి డిజిటలైజేషనే తోడ్పడనుందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.
యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆకస్మికంగా పర్యటించారు. యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులు అర్పించారు. కెనడాలో శిక్షణ తీసుకున్న సైనికులతో ఈ సందర్భంగా ట్రూడో ముచ్చటించారు. సైనికులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. ధ్వంసమైన సైనిక వాహనాలతో కూడిన బహిరంగ ప్రదర్శనను కూడా సందర్శించారు.
AP: అధికారం, పదవులు కోసం పార్టీ మారే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు మారారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు టీడీపీలో చేరారని తెలిపారు. ఈ నెల 12న పల్నాడు జిల్లాలోని క్రోసూరులో జరగబోయే సీఎం సభ ప్రాంగణాన్ని పరీశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
TS: రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. అధికారం కోసం జీవన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయో.. లేదో జీవన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులు సాగునీరు, కరెంట్ అందక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
NCP నేత అజిత్ పవార్కు పదవి ఇవ్వకపోవడంపై పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ వివరణ ఇచ్చారు. పవార్ ఇప్పటికే పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కుమార్తె సుప్రియా సూలే, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేయడం అజిత్ పవార్ను దిగజార్చడం కాదని చెప్పారు. పార్టీలో నిర్ణయం తీసుకునే వ్యక్తుల్లో అజిత్ పవార్ కూడా ఒకరని వ్యాఖ్యానించారు.
భార్య, మరదలు సహా ముగ్గురు పిల్లలను అత్యంత దారుణంగా చంపిన హంతకుడు తిప్పయ్యకు ట్రయల్ కోర్టు విధించిన మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే తాను ఈ హత్యలకు పాల్పడినట్లు తిప్పయ్య పోలీసుల ముందు అంగీకరించారు. అనంతరం నిందితుడిని ట్రయల్ కోర్టులో హాజరుపర్చగా 2019 డిసెంబర్లో దోషిగా తేల్చి మరణశిక్షను ఖరారు చేసింది.
WTC 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ను 270/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత్కు 444 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అలెక్స్ కారీ(66*) అత్యధిక స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్, మార్నస్ లాబుస్చాగ్నే 41 పరుగులతో ఉన్నారు. భారత్ తరఫున రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
AP: రాష్ట్రాభివృద్ధికి బీజేపీ, జనసేనలకు ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ నేత సత్యకుమార్ ప్రజలను కోరారు. కాళహస్తి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రధాని మోదీ ప్రజారంజక పాలన అందిచారని తెలిపారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందుకు నడుపుతామని హామీ ఇచ్చారు. తమకు ఏపీలో ప్రాతినిధ్యం లేకున్నా, నిధులు మాత్రం వివక్ష లేకుండా ఇస్తున్నామని పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ మాట్లాడారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా కొనసాగితే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ధరలను తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ విషయంపై స్పష్టత వస్తుందని అన్నారు. గత త్రైమాసికంలో ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలు లాభాలను అర్జించాయని పేర్కొన్నారు.
AP EAPCET 2023 ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నారు. మే 15 నుంచి 19వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ప్రపంచంలోనే టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అవతరించనుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇండియా 2027లోగా టాప్-3 ఎకానమీగా అవతరించనుందని మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవాలని రాజ్నాథ్ ఆకాంక్షించారు. ఫలితంగా ప్రపంచమంతటా భారతీయులకు గౌరవం పెరుగుతుందని చెప్పారు.
TS: రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించినట్లు కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. త్వరలో జరబోయే ఎన్నికలలో కోసం అందరం ఒకే మాటపైకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయమై నాగం జనార్ధన్ రెడ్డితో తాను, దామోదర రెడ్డి మాట్లాడనున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రెస్మీట్ పెడతామని పేర్కొన్నారు.