shape

International ChotaNews

Blog Image

తొగుటలో దొంగలు బీభత్సం

సిద్దిపేట: తొగుట మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఐదు ఇంళ్లను టార్గెట్ చేసిన దొంగలు తాళాలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న తొగుట పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు.

Blog Image

బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు స‌మన్లు

యోగా గురువు బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌తంజ‌లి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజ‌రుకావాల‌ని నోటీసులు జారీచేసింది. రాందేవ్ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు పేర్కొంది. జ‌స్టిస్ హిమా కోమ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును ఇవాళ విచారించింది. ఈ కేసులో ప‌తంజ‌లి మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆచార్య బాల‌కృష్ణ‌కు స‌మ‌న్లు కూడా జారీ చేసింది.

Blog Image

లాంగెస్ట్‌ దోసె.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోసె.. లాంగెస్ట్ దోసెగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ MTR ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసెను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసెను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

TDPలో విషాదం.. కీలక నేత కన్నుమూత

AP : తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన ముఖ్యనేత గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లాకు చెందిన BC నేత గుంటుపల్లి నాగేశ్వరరావు TDPలో చాలా కీలకంగా ఉన్నారు. టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులుగా ఉన్నారు. గతంలో రెండుసార్లు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ పని చేశారు.

Blog Image

అసెంబ్లీ ఎలక్షన్: కోవూరులో ఆసక్తికర పోరు

ఏపీ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా కోవూరులో ఆసక్తికర పోరు నెలకొంది. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైసీపీ తరపున ఆయన మరోసారి టిక్కెట్ దక్కించుకున్నారు. టీడీపీ తరఫున మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి టిక్కెట్ లభించింది. ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న వేమిరెడ్డి ధాటికి ప్రసన్నకుమార్‌రెడ్డి ఏమాత్రం నెగ్గుకొస్తాడో వేచిచూడాలి.

Blog Image

అనకాపల్లి MP టికెట్‌పై YV క్లారిటీ

AP : అనకాపల్లి MP టికెట్‌ అభ్యర్థి పెండింగ్‌లో ఉండడంపై YCP ప్రాంతీయ సమన్వయకర్త YV సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని పేర్కొన్నారాయన. అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నామన్నారు.

Blog Image

APPSC పరీక్షపై నేడు హైకోర్టులో విచారణ

AP : APPSC పరీక్షలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ AP ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. గ్రూప్1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు ధర్మాసనం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనోనన్న ఉత్కంఠ ఇటు పరీక్ష రాసిన అభ్యర్థుల్లోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ నెలకొని ఉంది.

Blog Image

ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌ కుమార్తె

యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ భార్య, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలేష్‌, డింపుల్‌ల కుమార్తె అదితి యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ టికెట్ కేటాయించింది. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కనిపించారు.

Blog Image

ఐస్‌క్రీములు తింటున్నారా.. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో చూడండి?

రోడ్లపై ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీమ్ తింటున్నారా? అయితే జాగ్రత్త. కొందరు దుర్మార్గులు మీరు తినే ఆహార పదార్థాల్లో వీర్యం, మూత్రం కలుపుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నెక్కొండలో ఇలాంటి హేయమైన ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై ఫలూదా, ఐస్‌క్రీమ్ అమ్ముకునే ఓ వ్యక్తి.. వాటిలో వీర్యం కలిపే వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Blog Image

ఎన్డీఏకు RLJP గుడ్ బై?

లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA)భాగస్వామ్య పక్షం రాష్ట్రీయ్ లోక్ జనశక్తి పార్టీ (RLJP)కూటమి నుంచి వైదొలగనుంది. ఇటీవల బీహర్ లోక్‌సభసీట్లలో జరిగిన కేటాయింపులపై RLJP అధినేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో బీజేపీ తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. BJP అధినాయకత్వం స్పందించకపోవడంతో కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.

Blog Image

TDP ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

AP : తెలుగుదేశం పార్టీ MP అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. BJP, జనసేనలతో కూటమి కట్టి సీట్ల సర్ధుబాటు చేసుకున్న ఆయన.. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. అధికార YCPపార్లమెంట్ అభ్యర్థుల జాబితాను వెల్లడించిన నేపథ్యంలో వారికి దీటైన గెలుపు గుర్రాల కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. నేడు, రేపట్లో కొంతమంది MPఅభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.

Blog Image

గద్వాల జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్?

గద్వాల జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో గద్వాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌,16మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు సరిత రంగం సిద్ధం చేశారు. త్వరలో వీరంతా హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

Blog Image

లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు

AP: గతేడాది ఆగస్టులో తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు. టీటీడీ బంధించిన నాలుగో చిరుతే.. లక్షితపై దాడిచేసిందని అధికారుల విచారణలో తేలింది. కాగా.. మొత్తం ఆరు చిరుతలను టీటీడీ బంధించింది. దాడి చేసిన చిరుతతో పాటు అన్ని చిరుతలను జూ పార్కులోనే సంరక్షించాలని అధికారులు నిర్ణయించారు.

Blog Image

జనంలోకి చంద్రబాబు.. ప్రజాగళం యాత్రలకు రెడీ

AP : TDP అధ్యక్షుడు చంద్రబాబు 22వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దాదాపు 20రోజులపాటు 60 నియోజకవర్గాలలో పర్యటించేలా రూట్‌ మ్యాప్ సిద్ధం చేశారు. కొంత విరామం ఇచ్చి రెండో విడత పర్యటనలు ప్రారంభిస్తారని TDP నేతలు తెలిపారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటనలు నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటనలపై ఉండవల్లి నివాసంలో ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు.

Blog Image

రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ మద్యంకేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసిందని, ఈ తరుణంలో రిట్‌ పిటిషన్‌పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని న్యాయస్థానానికి కవిత తరపు న్యాయవాది విక్రమ్‌‌చౌదరి తెలిపారు. కాగా.. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.

Blog Image

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీని ప్రకారం..

Blog Image

ఆస్తిపన్ను వసూళ్లపై ‘ఎన్నికల’ పిడుగు

HYD : ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ప్రభావం చూపనున్నది. ఈ నేపథ్యంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2100 కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ. 1488.47 కోట్లు మాత్రమే వసూలైంది. బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ అందిస్తూ వన్‌ టైం సెటిల్‌మెంట్‌(OTS) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 18 రోజుల్లో రూ.55 కోట్ల మేర మాత్రమే OTS కలెక్షన్లు వచ్చాయి.

Blog Image

తెరుచుకోనున్న తులిప్‌ గార్డెన్‌

జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్‌ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్‌ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది.

Blog Image

సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) భేటీ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం జరుగుతున్న ఈ భేటీలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చి.. ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే భేటీలో సోనియాగాంధీ, రాహుల్‌‌గాంధీలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కీలకనేతలు హాజరయ్యారు.

Blog Image

తెలంగాణ ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. తెలంగాణ ఇంఛార్జీ గవర్నర్‌‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. కాగా.. తెలంగాణ గవర్నర్ హోదాకు తమిళిసై సౌందరరాజన్ నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Blog Image

మహేశ్‌‌బాబును జపాన్‌కు తీసుకొస్తా: రాజమౌళి

సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్న మూవీపై డైరెక్టర్ రాజమౌళి ఓ అప్డేట్ ఇచ్చారు. జపాన్‌లో పర్యటిస్తున్న రాజమౌళి.. ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మహేశ్‌‌బాబుతో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తిచేసి జపాన్‌లోనూ రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌‌ను ఇక్కడికి తీసుకొస్తాను’’ అని జక్కన్న వ్యాఖ్యానించారు.

Blog Image

ముందు టారిఫ్‌ సబ్సిడీ చెల్లించాల్సిందే

HYD : విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌-62 ప్రకారం రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఉచిత లేదా రాయితీ విద్యుత్తు అందించాలంటే సంబంధిత పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ముందుగానే టారిఫ్‌ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(TSERC)వెల్లడించింది. ప్రభుత్వం ముందస్తు చెల్లింపులు చేయకపోతే రాయితీ లేదా ఉచిత విద్యుత్తు అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారమే కమిషన్‌ విధులు నిర్వర్తిస్తుందని పేర్కొంది.

Blog Image

చట్నీస్ హోటల్స్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు మంగళవారం కలకలం రేపాయి. నగరంలోని ప్రముఖ హోటల్ అయిన ‘చట్నీస్’ బ్రాంచుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్నీస్ ఓనర్, వారి బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Blog Image

ఢిల్లీకి పురందేశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

AP : రాష్ట్ర BJP చీఫ్ పురందేశ్వరి హస్తినకు బయలుదేరి వెళ్లారు. APలో BJP 6పార్లమెంటు, 10అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 16స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలతో పురందేశ్వరి చర్చించనున్నారు. BJPపోటీ చేసే స్థానాలపై కూడా స్పష్టత రావడంతో.. ఆశావహుల జాబితాను తీసుకుని ఆమె ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. దీనిపై నేడు, రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Blog Image

YCP నేతలకు జగన్ మార్గదర్శకాలు ఇవే

AP: YCPనేతలకు CM జగన్ కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున నాయకులంతా తమ గెలుపు కోసం పక్కా ప్రణాళిక రచించుకోవాలని కోరారు. అభ్యర్థులంతా ప్రతి గ్రామసచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని దిశానిర్దేశం చేశారు. వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలిసి సంక్షేమ పథకాలను వివరించాలని అభ్యర్థులకు జగన్ సూచించారు. నాయకులు పార్టీ శ్రేణులను ఏకతాటి­పైకి తీసుకువచ్చి ముందుకు సాగాలని చెప్పారు.

Blog Image

కర్ణాటకలో బీజేపీ ఆధిపత్యమేనా?

కర్ణాటకలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. ఈ ఫలితాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలవనున్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. అయితే.. ప్రజలు తమ పక్షానే ఉన్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఓటర్లు ఎవరివైపు ఉన్నారో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

Blog Image

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ సూచీల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మంగళవారం ఉదయం సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నేటి ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 410 పాయింట్లు పతనమై 72,337 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు కుంగి 21,946 వద్ద కొనసాగుతున్నాయి.

Blog Image

తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ నియామకం జరిగేనా?

TG : గవర్నర్ తమిళి సై రాజీనామాతో.. కొత్త గవర్నర్ నియామకం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త గవర్నర్ నియామకం ఆలస్యమవుతుంది. అందుకే ఇన్‌ఛార్జి గవర్నర్‌ను నియమించనున్నారని తెలిసింది. తెలంగాణకు.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఇన్‌ఛార్జి గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Blog Image

జగన్ ఎన్నికల ప్రచారానికి RTC బుల్లెట్ ప్రూఫ్ బస్సులు

AP: సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి RTC బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పంజాబ్‌ లోని అంబాల వద్ద గల JCBLకంపెనీలో వాహనాలను RTC అధికారులు తయారు చేయించారు. ఇప్పటికే విజయవాడకు ఒక బుల్లెట్ గ్రూప్ బస్సు.. మూడు మినీ బస్సులు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అద్దె ప్రాతిపాదికన బస్సులను తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Blog Image

విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

కడప జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం నెలకొంది. కొర్రపాడు గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతిచెందింది. నిన్న పరీక్ష ముగిశాక మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది.వెంటనే గమనించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Blog Image

కలెక్టరేట్‌లోనే నామినేషన్ల స్వీకరణ

HYD : మల్కాజిగిరి లోక్‌సభ నామినేషన్లు జిల్లా కలెక్టరేట్‌లోనే స్వీకరిస్తామని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ..మల్కాజిగిరి లోక్‌సభ స్థానం జనరల్‌ కావటంలో ఎవరైనా నామినేషన్లు వేయొచ్చని ప్రకటించారు. దేశవ్యాప్తంగా అధిక ఓటర్లున్న నియోజకవర్గంగా మల్కాజిగిరి లోక్‌సభకు గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ లోక్‌సభ పరిధిలో 37,28,417 ఓటర్లు ఉన్నారన్నారు.

Blog Image

ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వీరిని చుట్టుముట్టారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందినవారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరిపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం.

Blog Image

బుద్వేల్‌, మోకిల లేఅవుట్లకు మోక్షం

HYD: ఎట్టకేలకు కీలమైన బుద్వేల్‌, మోకిల HMDA లేఅవుట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభించింది. ఈ రెండు లేఅవుట్లలో ప్లాట్లను వేలం ద్వారా గత ప్రభుత్వం విక్రయించింది. లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించినప్పటికీ వసతుల కల్పనలో HMDA తాత్సారం చేసింది. అయితే ఇటీవలే రూ.400కోట్ల విలువైన అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచారు. 4సంస్థలు టెండర్లు దాఖలు చేయగా…NNC ఈ పనులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.