తొగుటలో దొంగలు బీభత్సం
సిద్దిపేట: తొగుట మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఐదు ఇంళ్లను టార్గెట్ చేసిన దొంగలు తాళాలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న తొగుట పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు.