ముంబై ముందు భారీ టార్గెట్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేశారు. ఫ్రేజర్-మెక్ గుర్క్ (84) విధ్వంసం సృష్టించాడు. ఇతనికి తోడు స్టబ్స్ (48*) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. హోప్ (41), పోరెల్ (36), పంత్(29) రాణించారు.