ఆ ఘర్షణలు రాజకీయ ప్రేరేపితం: సంజయ్ రౌత్
కొల్హాపూర్లో శాంతిభద్రతలు పునరుద్ధణ అయినట్లు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. కొల్లాపూర్లో జరిగిన ఘర్షణలు రాజకీయ ప్రేరేపితమన్నారని ఆరోపించారు. కర్ణాటకలో కూడా అదే పని చేయాలని బీజేపీ ప్రయత్నించిందని చెప్పారు. ఇది మహారాష్ట్ర హోంమంత్రి వైఫల్యమని విమర్శించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును పొగుడుతూ కొందరు వ్యక్తులు సోషల్మీడియాలో స్టేటస్లు పెట్టడం కొల్హాపూర్లో ఘర్షణలకు దారి తీయడం తెలిసిందే.