shape

International ChotaNews

Blog Image

ముంబై ముందు భారీ టార్గెట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేశారు. ఫ్రేజర్-మెక్ గుర్క్ (84) విధ్వంసం సృష్టించాడు. ఇతనికి తోడు స్టబ్స్ (48*) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. హోప్ (41), పోరెల్ (36), పంత్(29) రాణించారు.

Blog Image

బీసీల రిజర్వేషన్లు పెంచుతాం: సీఎం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుల గణన చేసిన తర్వాత జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హామీతో బీజేపీ కుట్ర చేసి 2025 నాటికి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

Blog Image

ఆ విషయంలో బాధపడ్డాను: సోనమ్‌ కపూర్

నటి సోనమ్‌ కపూర్ ప్రసవానంతరం తనకెదురైన అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బరువు పెరగడంతో బాధపడినట్లు తెలిపారు. ‘‘గర్భం దాల్చిన తరువాత 32 కిలోల బరువు పెరిగాను. దీంతో కొంచెం బాధపడ్డాను. డెలివరీ అయ్యాక బిడ్డను చూసుకోవడంలో మునిగిపోయి బరువు తగ్గడం గురించి ఆలోచించలేదు. ఏడాదిన్నర తర్వాత శరీరాకృతిపై దృష్టిపెట్టాను. ఇప్పటి వరకు 20 కిలోలు తగ్గాను’’ అని చెప్పారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

ఆరెస్సెస్, బీజేపీ లక్ష్యం అదే: రేవంత్

ఆరెస్సెస్, బీజేపీ స్పష్టమైన అజెండాతో పని చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆరెస్సెస్‌ను 1925లో స్థాపించినప్పుడు వందేళ్లలో భారత్‌ను హిందూ దేశంగా మార్చుతామని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ రిజర్వేషన్లు లేని దేశాన్ని నిర్మిస్తామని చెబుతూ వచ్చారు. అందుకు ఈసారి ఎన్నికలను వాడుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇది దేశానికి మూలవాసులైన దళితులు, గిరిజనులపై సర్జికల్ స్ట్రైక్ లాంటిదని వ్యాఖ్యానించారు.

Blog Image

34 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేశారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి అసాంఘిక కార్యకలాపాలకు భారీగా లావాదేవీలు జరిగాయని బెదిరించారు. వరుసగా ఫోన్లు చేసి విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.34లక్షలు కాజేశారు. ఇటీవలTS RTCఛెైర్మన్ సజ్జనార్ ఇదే విషయంపై ప్రజలను హెచ్చరించారు.అనుమానితుల ఫోన్లు ఎత్తవద్దని,ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Blog Image

దౌర్జన్యంగా గెలవాలని చూస్తున్నారు: రేవంత్

ప్రధాని మోదీ, అమిత్ షా అన్ని వ్యవస్థలను వాడుకొని లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్రమంగా, దౌర్జన్యంగా 400 సీట్లు గెలవాలని చూస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని అన్నారు.

Blog Image

పర్యాటక అభివృద్ధికి మంత్రి రోజా ఏం చేశారు?: షర్మిల

AP: అరకులో పర్యాటక అభివృద్ధికి మంత్రి రోజా ఏమైనా చేశారా అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. ఆదివాసీల సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అరకు అభివృద్ధికి రూ. 600 కోట్లు ఇస్తామన్న జగన్.. మాట తప్పారని షర్మిల విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు.

Blog Image

ఇదేం బ్యాటింగ్ సామీ!

IPL: ముంబై, ఢిల్లీ మధ్య మ్యాచ్‌లో జేక్‌ ఫ్రేసర్‌ బ్యాట్‌తో విశ్వరూపం చూపించాడు. కేవలం 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అయితే ఇందులో 4 పరుగులు మాత్రమే సింగిల్స్‌ రూపంలో వచ్చాయి. మిగితా 80 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే సాధించాడు. దీంతో అతడి ఆటతీరు చూసిన ఫ్యాన్స్ అంతా ఇదేం బాదుడు సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Blog Image

మారుతి నుంచి త్వరలో హైబ్రిడ్‌ కారు

దేశంలో అందుబాటు ధరకే హైబ్రిడ్‌ కార్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీ నుంచి ఈకారు రాబోతోంది. ఇందుకోసం జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ చిన్నపాటి హైబ్రిడ్‌ కార్ల తయారీపై పని చేస్తోంది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు.ప్రస్తుతం ఉన్న కార్ల కంటే ఎక్కువ మైలేజీతో ఇవి రానున్నాయని తెలిపారు.

Blog Image

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

అమెరికాలోని సౌత్‌ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందగా..ఒకరు గాయపడ్డారు. వారంతా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల పేర్లు రేఖాబెన్ పటేల్‌, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు.

Blog Image

ఏపీపై నటి సంచలన కామెంట్

నటి పూనం కౌర్ ఏపీపై సంచలన కామెంట్ చేశారు. ‘‘ఏపీ ఈజ్ ద న్యూ యూపీ’’ అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తర ప్రదేశ్‌తో పోల్చుతూ పూనమ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఎవరిని టార్గెట్ చేసి ఈ పోస్టు పెట్టారో అని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

Blog Image

టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం

శ్రీసత్యసాయి: ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి బి. పార్థసారథిని, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, వెంకీ, నరసింహమూర్తి, గోవింద్ పాల్గొన్నారు.

Blog Image

జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలు

ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను రాయి వేయలేదని చెప్పినట్టు సమాచారం. రూ.300 ఇస్తామంటే రోడ్ షో‌కు తన స్నేహితుడితో కలిసి వచ్చానని చెప్పాడు. దాడికి ముందు కరెంట్ పోయిందనీ, అప్పుడు ఏం జరిగిందో తనకు తెలియదని వివరించాడు.

Blog Image

తెలంగాణలో ఎల్లో అలెర్ట్‌..

TS: రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. రాగల 5 రోజుల్లో వడగాల్పులు వీస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సోమవారం నుంచి బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

Blog Image

హామీలన్నీ నెరవేరిస్తే.. రాజీనామా చేస్తా: ఏలేటి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ కేవలం రైతు రుణమాఫీపైనే సవాల్ విసురుతున్నారని.. మిగతా హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కాగా, కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే.

Blog Image

జేక్‌ ఫ్రేజర్‌ జోరు.. ముంబైకి చుక్కలు

IPL: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ, ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జేక్‌ ఫ్రేజర్‌ తన బ్యాట్‌తో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో పవర్‌ ప్లేలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ఫ్రేజర్ నిలిచాడు. చివరకు 84 వ్యక్తిగత పరుగుల వద్ద పీయూశ్‌ చావ్లా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

Blog Image

ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు

దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అరుదు. అలాంటిది ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. 2023-24ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Blog Image

సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘గూగుల్ కంపెనీలో 2004 ఏప్రిల్ 26 నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Blog Image

OTTలో ‘ఫ్యామిలీ స్టార్’..విజయ్‌పై దారుణమైన ట్రోల్స్

హీరో విజయ్ దేవరకొండను సినీ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన వారు నెగిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో దోశ వేసే సీన్ చూసి.. 'అవసరమైతే దోశలు తినడం మానేస్తాం గానీ ఇలాంటి దోశలు తినం బాబోయ్' అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

Blog Image

సీఎం జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ఏపీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ‘‘మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28పథకాలను నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీ వారే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి’’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

Blog Image

తొలిసారి ఎన్నికల బరిలో మాజీ సీఎం భార్య

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామాతో మే 20న ఉప ఎన్నిక జరగనుంది. అవినీతి ఆరోపణలతో హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లడంతో పార్టీ బాధ్యతలు చూస్తున్న ఆమె తొలిసారి ఎన్నికల బరిలో కూడా నిలుస్తున్నారు.

Blog Image

ఇంకా అదుపులోకి రాని మంటలు

TG: అలెన్‌ హెర్బల్‌ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో అలెన్‌ పరిశ్రమ పరిసరాల్లో ఉంటున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ప్రజలు ఖాళీ చేయడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఎల్లమ్మ కాలనీ వాసులు సమీపంలోని చెట్ల కింద కూర్చున్నారు. నిన్నటి నుంచి మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Blog Image

TDPకి బిగ్ పాక్..వైసీపీలో చేరిన యనమల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీఎం ‌ జగన్‌ సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైసీపీలో చేరారు.

Blog Image

కాళేశ్వరంపై ఫిర్యాదుల బాక్సులు ఇవే

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వివరాలను వెలికి తీసే పనిలో జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ నిమగ్నమైంది. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని ఎనిమిదో అంతస్తులో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేశారు. మే 31 వరకు ప్రజలు నేరుగా వెళ్లి ఫిర్యాదులు, సలహాలు, అభిప్రాయాలు తెలపవచ్చు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు వేర్వేరుగా బాక్సులను సిద్ధం చేశారు.

Blog Image

అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాలపై వీడని ఉత్కంఠ

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం పోటీదారుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్‌ జరగనుంది.

Blog Image

అక్కడ ఎప్పటికైనా అవకాశం వస్తుంది: కత్రినా

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఇటీవలే ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వస్తే కొన్ని కారణాల వల్ల తిరస్కరించాను. తిరిగి తప్పక ఆ అవకాశం వస్తుందని నమ్ముతున్నా. దాంతో నా సినీ జీవితం అనే పుస్తకంలో ఓ కొత్త పేజీ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నా’ అని కత్రినా తెలిపారు.

Blog Image

చేనేత కుటుంబాలకు దీపాదాస్‌ మున్షీ పరామర్శ

TG: ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్ మున్షీ పరామర్శించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన చేనేత కార్మికుడు మల్లేశం ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మల్లేశం కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

Blog Image

హాలీవుడ్‌లో ఎన్నో కష్టాలు పడ్డా: ప్రియాంక చోప్రా

హాలీవుడ్‌కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు నటి ప్రియాంక చోప్రా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్‌ ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్‌పై నా ఫొటో ఆరు సార్లు వచ్చింది. విదేశాలకు వచ్చాక ఎవ్వరూ కనీసం నాతో ఒక మీటింగ్‌ కూడా నిర్వహించలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు, తిరస్కరణలు అనుభవించాను’ అని చెప్పారు.

Blog Image

పదో తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో పరీక్షల ఫలితాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.

Blog Image

మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల గెలుస్తారని ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై కేటీఆర్ స్పందించారు. ‘‘మ‌ల్లారెడ్డి రాజ‌కీయం అనుభవంతోనే ఆ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరినైనా పొగడ్తలతో మునగచెట్టు ఎక్కించగలరు. మల్లారెడ్డి మాటలతో గెలుపుపై ధీమాతో ఈటల ఇంట్లో ఉంటారు. మేం ప్రచారం చేసి గెలుస్తాం. అందుకే అలా అన్నారు’’ అని చెప్పారు.

Blog Image

లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

AP: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.