ఈరోజే Kalki 2898AD నుంచి క్రేజీ అప్డేట్
ఈరోజు సాయంత్రం 5 గంటలకు Kalki 2898AD మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రానుంది. ఈమేరకు మూవీటీం ఓ పోస్టర్ను విడుదల చేసింది.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు Kalki 2898AD మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రానుంది. ఈమేరకు మూవీటీం ఓ పోస్టర్ను విడుదల చేసింది.
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మే10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీమేకర్స్, ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ‘ రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్లో సాగే కథ ఇది. స్నేహం కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడిగా సత్యదేవ్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు.’ అన్నారు.
AP: కర్నూలు జిల్లా కొడుమూరులో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. కర్నూలు రహదారిలో టాటాఏస్ వాహనం, రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన మరో వ్యక్తి పోతుగల్ వీఆర్వో వెంకటేష్గా గుర్తించారు. బొలెరో అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
జిల్లా ADD వీడియో
శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!
AP: టీడీపీ, వైసీపీ పార్టీలపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. పాయకరావుపేటలో మాట్లాడుతూ.. పదేళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా.. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని మండిపడ్డారు. పదేళ్లైనా రాజధాని కట్టలేని నేతలకు ఓట్లెందుకు వేయాలని దుయ్యబట్టారు.
HYD : సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో టీఆర్ఎస్ (BRS) వినిపించిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం KTR మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు.
దేశంలో లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లోని పోలింగ్ బూత్లో జీరో ఓటింగ్ నమోదయ్యింది. బక్స్వాహా తహసీల్లోని మంకి గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరించారు. విద్యుత్, తాగునీరు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు తమకు అందడంలేదని ఆరోపిస్తూ ఓటు వేయలేదు. మూడు నెలలుగా గ్రామంలో విద్యుత్ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నిరసిస్తూ గ్రామస్తులెవరూ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.
AP: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం వద్ద రహదారిపై టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార వాహనానికి నిప్పుపెట్టడంపై కిషోర్ సతీమణి తనూజరెడ్డితో పాటు టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వాహనానికి నిప్పంటించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TG : BRS పార్టీ 2001 నుంచి ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. అప్పటి నుంచి ప్రతిఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లీనరీ నిర్వహిస్తుంది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు ఉండటం, పార్టీ నాయకులు, కేడర్ అంతా పార్టీ ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో ప్లీనరీ నిర్వహించడం లేదని సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లోనే జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం నేతలకు పిలుపు నిచ్చింది.
TG : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP, BRS పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19సార్లు ఎన్నికలు జరుగగా.. 9సార్లు కాంగ్రెస్, ఉపఎన్నికలతో కలిపి 4సార్లు BRS, 3సార్లు BJP, ఒకసారి TDP, మరోసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఉత్కంఠగా మారింది.
బెంగళూరులో దాదాపు సగం మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్లో 52.81 శాతం, బెంగళూరు నార్త్లో 54.42 శాతం, బెంగళూరు సౌత్లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు విషయంపై ఎంత అవగాహన కల్పించినా, ఎంత తీవ్రంగా ప్రచారాలు చేసినా.. ఓటర్ల ఉదాసీనత కొనసాగడంపై ఎన్నికల సంఘం అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కోల్కతా నిర్దేశించిన 262 భారీ లక్ష్యాన్ని పంజాబ్ చేధించింది. అందులో పంజాబ్ ఆటగాళ్లు బెయిర్స్టో (108), శశాంక్ సింగ్(58), ప్రభ్సిమ్రన్ సింగ్ (54) కీలకపాత్ర పోషించారు. దీనిపై బెయిర్స్టో స్పందిస్తూ.. ‘సునీల్ నరైన్కు ధన్యవాదాలు చెప్పాలి. అతడి ఆటను చూసిన తర్వాతే రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించా. శశాంక్ భారీ హిట్టింగ్ అద్భుతం. శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో లక్ష్యఛేదన సులువైంది’ అని తెలిపాడు.
AP: సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘‘మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు. వాటిపై నీకు గౌరవం ఉంటే.. 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లడుగుతానన్న నువ్వు… ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?’’ అని ట్వీట్ చేశారు.
దేశంలోని నాలుగు ముఖ్య ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోల్కతా విమానాశ్రయంతో సహా దేశంలోని నాలుగు వేర్వేరు విమానాశ్రయాల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్ వచ్చింది. దీంతో CISF అధికారులు ఆయా ఎయిర్పోర్టులను పూర్తిగా తనిఖీ చేశారు. అనంతరం ఈ ఈమెయిల్ ఫేక్ అని, ఎటువంటి బాంబు లేదని సీనియర్ CISF అధికారి తెలిపారు.
TG : లోక్సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా పరిణమించాయి. కేంద్రంలో తమ అధికారాన్ని నిలుపుకోవడం BJPకి కీలకం కాగా.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలంటే ఈ ఎన్నికలు కీలకం. ఇక తెలంగాణ రాజకీయాలను ఇంతకాలం శాసిస్తూ వచ్చిన BRS.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడంతో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
AP: సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్.. పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో సతీష్ను పోలీసులు విచారించారు. సతీష్ కుటుంబ సభ్యులు, లాయర్ సమక్షంలో జగన్పై దాడికి సంబంధించి సతీష్ నుంచి పలు కీలక విషయాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సమాచారాన్ని సీల్ కవర్లో ఇవాళ సాయంత్రం విజయవాడ కోర్టుకు అందించనున్నారు.
పంజాబ్, కోల్కతా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిసింది. టీ20ల్లోనే అత్యధిక సిక్సులు ఈ మ్యాచ్లో నమోదు అయ్యాయి. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిపి 42 సిక్స్లు బాదాయి. కొన్ని రోజుల క్రితమే ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లో 38 సిక్స్లు నమోదు అయ్యాయి. ఆ రికార్డును ఇప్పుడు తుడిపేశారు.
TG : పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండటంతో వారే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 15,92,996 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 8,05,755 మంది, పురుషులు 7,87,140 మంది, ఇతరులు 101మంది ఉన్నారు. పురుషుల కంటే 18,615 మంది మహిళలు అధికంగా ఉన్నారు.
ఆత్మహత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1972లో తన భార్య, 18 నెలల కమారుడు మరణించడంతో చనిపోవాలనే ఆలోచనరాగా.. మిగిలిన పిల్లల గురించి ఆలోచించి ఆగిపోయినట్లు చెప్పుకొచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు పిచ్చి ఆలోచనలు చేయాల్సిన పనిలేదన్నారు.
HYD : ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని AC బస్సులను TSRTC నడిపేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు ప్రతి గంటకోసారి AC బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది. AC బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి శ్రీశైలంకి రూ.524గా ఛార్జీలను నిర్ణయించగా.. BHEL నుంచి రూ.564 టికెట్ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది.
AP : ఇంటింటికి పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల కమిషన్.. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పింఛన్లను పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ చీఫ్.. ఎన్నికల కమిషనర్, చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని ఆ ఆదేశాల్లో పేర్కొంది.
HYD : గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. అధికారులు అక్కడికి వెళ్లి ప్రతినిధులకు ఎన్నికల నిబంధనలను వివరించగా కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితాను ECకి పంపాల్సిన గడువు ముగియడంతో అధికారులు ఈ ప్రయత్నం విరమించుకున్నారు.
TG : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వచ్చే వారం మొదట్లో జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ బృందం పరిశీలించనున్నట్టు తెలిసింది. విచారణ బృందం ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం బ్యారేజీలను సందర్శించాల్సి ఉన్నా.. సమయాభావం వల్ల వాయిదా వేసుకున్నారు. అధికారుల నుంచి అన్ని రకాల సమాచారాన్ని తీసుకున్నాక వచ్చే వారం మొదట్లో బ్యారేజీలను సందర్శించనున్నారని తెలిసింది.
TG : సొంతజిల్లా కావడంతో మహబూబ్నగర్లో గెలుపును CM రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి చల్లా వంశీచంద్రెడ్డి ఈసారి పార్లమెంటులో అడుగుపెట్టి గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన DK అరుణ(BJP).. ఈసారి గెలిచి సత్తా చాటాలని సంకల్పించారు. జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని BRS అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
ఖమ్మం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఖమ్మం నగరంలోని టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న టీ కొట్టులో ఇది ఆర్ఆర్ఆర్ ఛాయ్ చాలా స్పెషల్ అంటూ తనదైన శైలిలో టీ అందించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువాళ్ల దుర్గా ప్రసాద్, మద్దినేని స్వర్ణకుమారి, విజయ్బాబు తదితరులు పాల్గొన్నారు.
AP: అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల నుంచి డ్రైవర్ తప్పించుకున్నాడు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైసీపీ శ్రేణులే ఈ దాష్టికానికి పాల్పడ్డాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గానికి(నల్గొండ-ఖమ్మం - వరంగల) జరగనున్న ఎన్నిక ఈసారి బీఆర్ఎస్కు కఠిన పరీక్ష పెడుతోంది. ఇక్కడ అత్యధికంగా ఎమ్మెల్యేలను కలిగి ఉన్న కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండడమే కాకుండా.. గత ఎన్నికల్లో స్వతంత్రంగానే రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడం బీఆర్ఎస్కు గట్టి దెబ్బతీస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
HYD : పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా 39 నుంచి 43 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిరోజులుగా వడగాలులు వీస్తున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఎన్నికల ప్రచారంపై పడుతోంది. దీంతో సాయంత్రంవేళ నేతలు కార్నర్ సమావేశాలకే పరిమితమవుతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా ఉదయం 10 గంటలకే ముగిస్తున్నారు. మళ్లీ సాయంత్రం 4 గంటల తర్వాత ముందుకొస్తున్నారు.
AP : రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం పాడేరులో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు అరకులో జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. జట్టులోకి విరాట్ కోహ్లి ఎంపికవుతాడా.. ఓపెనర్లుగా ఎవరికి అవకాశమిస్తారు.. అనే ఉత్కంఠ విషయాల నేపథ్యంలో సెలక్టర్ల నిర్ణయం కీలకం కానుంది.
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని తెలిపారు. అగ్రరాజ్యంలో ఓ సంస్థ సీఈవో అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ అభివృద్ధి కోసం సాంకేతిక విప్లవానికి కేంద్రంగా భారత్-యూఎస్ నిలుస్తున్నాయని అన్నారు.
AP: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులంతా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. తాజాగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. ఆటో నడిపారు.
AP: గుంటూరులో మొదటిసారి ఓటు హక్కు పొందినవారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యం 3కే రన్ నిర్వహించారు. సీఈవో ఎంకే మీనా మాట్లాడుతూ.. ‘ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. ఓటు దేశ భవిష్యత్తును మార్చగలదు. యువత ఓటు వేసేలా ఈసీ ప్రోత్సహిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.