‘ఎస్.కోట నుంచి MLAగా, విశాఖ నుంచి MPగా పోటీ చేస్తా’
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాను పోటీ చేయబోయే స్థానాలపై క్లారిటీ ఇచ్చారు. ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడేందుకు గత ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నానని, ఇప్పుడు ఎంపీగా గెలిస్తే కాపాడతానన్నారు. రూ.10లక్షల కోట్ల అప్పు చేసిన జగన్, చంద్రబాబు కావాలా? రూ.5లక్షల కోట్లు సంపాదించే కేఏ పాల్ కావాలో తేల్చుకోవాలన్నారు.