క్యూట్ లుక్లో జానకి
బాలీవుడ్ భామ కృతి సనన్ తాజాగా స్టైలిష్ లుక్లో అభిమానుల మనసు దోచుకుంది. క్యూట్ అండ్ హాట్ ఫోజులతో కుర్రకారు చూపును గాలమేసి లాగేసింది.
బాలీవుడ్ భామ కృతి సనన్ తాజాగా స్టైలిష్ లుక్లో అభిమానుల మనసు దోచుకుంది. క్యూట్ అండ్ హాట్ ఫోజులతో కుర్రకారు చూపును గాలమేసి లాగేసింది.
ఒపినియన్ - youth 9.6
స్వలింగ వివాహాలను నేరంగా భావించే దేశం మనది. ఇలాంటి దేశంలో ఇద్దరు గే జీవనం కొనసాగించడమే కాదు.. ఇద్దరు పిల్లలను సైతం పెంచగలుగుతున్నారు. ఈ గే జంట గురించి తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.
వికలాంగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ను మరో వెయి రూపాయలకు పెంచారు. దీంతో వచ్చే నెల వారికి పెన్షన్ పెన్షన్ రూ. 4,116కి పెరిగింది.
TS: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వచ్చే దసరాకు కార్మికులకు బోనస్గా రూ. 700 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. సింగరేణి తెలంగాణ ఆస్తి అని, దానిని ప్రైవేటు పరం కానివ్వమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే సింగరేణి టర్న్ఓవర్ను పెరిగిందని తెలిపారు.
quotes 9.6
అమర్నాథ్ యాత్రికులకు అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ యాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన హైలెవెల్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా శ్రీనగర్, జమ్ము నుంచి విమాన సర్వీసులను నడపాలని సూచించారు. ఎటువంటి ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పఠాన్’ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీని రష్యా సహా పలు కామన్వెల్త్ దేశాల్లో రికార్డు స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జూలై 13న రష్యాలో ఏకంగా 3000 స్క్రీన్లకి పైగా ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం.
TS: మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాంగ్రెస్ పాలకులు అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.
మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.దేశంలోనే వరిని అత్యధికంగా పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పుడు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పంట సాగును లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న ‘జబర్దస్త్’ కమెడియన్ ప్రసాద్ పరిస్థితి సీరియస్గా ఉంది. అతడి చికిత్స కోసం తోటి కమెడియన్స్ విరాళాలు సేకరిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఏపీ సర్కారు సైతం ఆయనకు అండగా నిలిచింది. ఆయన చికిత్సకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ సెక్రెటరీ హరికృష్ణ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
రాజకీయ నేతలకు వచ్చే బెదిరింపులను సహించేది లేదని మహారాష్ట్ర డీప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్సీపీ నేత శరద్ పవార్కు వచ్చిన బెదిరింపులపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రాజకీయ నేతలను బెదిరించడం, సామాజిక మాధ్యమాల్లో హద్దులు దాటడాన్ని సహించబోమని హెచ్చరించారు. ఇటీవల పవార్ను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్మీడియాలో బెదిరింపులకు దిగారు.
20వ ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నీలో 6 స్వర్ణాలతో సహా 19 పతకాలను భారత్ సాధించింది. దీంతో 45 దేశాలలో మూడో స్థానంలో నిలిచింది. వారి విజయంతో దేశంలో సంబరాలు జరుగుతున్నాయని, ఆ టోర్నీలో ఆడిన అథ్లెట్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ చిత్రం రిలీజ్ వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు జోరుగా సాగాయి. తాజాగా ఈ వార్తలకు చెక్ పడింది. ఈమూవీ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ నేడు ట్వీట్ చేశారు. ఆగస్టు 11నే ఈ చిత్రం విడుదలవుతుందని స్పష్టం చేశారు. రూమర్లను నమ్మొద్దని సినీ అభిమానులను కోరారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణలు మణిపూర్లో అల్లర్లకు దారి తీశాయి. ఈ ఘర్షణల కారణంగా ఆ రాష్ట్రంలో ఘోరమైన హింస జరిగింది. దీనికి సంబంధించిన కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీని కోసం పది మందితో కూడిన ప్రత్యేక సిట్ను సీబీఐ ఏర్పాటు చేసింది. అలాగే, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆరు కేసులను నమోదు చేసినట్లు తెలుస్తోంది.
TS: కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని, ఆ పార్టీకి అధికారమిస్తే సంక్షేమ పథకాలకు ముగింపు పలుకడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, ఆ పార్టీకి నాయకత్వమే లేదని ఎద్దేవా చేశారు.
AP: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్పై విజయవాడ 7వ ఏడీజే కోర్టు విచారించింది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. కాగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో ఐదుగురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఏ5గా సూర్యనారాయణ పేరును చేర్చారు.
ఓ స్మార్ట్ఫోన్ మనుషుల జీవితాలను ఎలా మార్చేసింది అనే కాన్సెప్ట్తో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘మాయా పేటిక’. రమేష్ రాపర్థి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. జూన్ 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వారు తెలిపారు. ఇందులో పాయల్ రాజ్పుత్, రజిత్ రాఘవన్, సునీల్, యాంకర్ శ్యామల, సిమ్రత్ కౌర్ తదితరులు నటిస్తున్నారు.
కొన్ని రోజులుగా OpenAI CEO సామ్ ఆల్ట్మాన్ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ChatGPT వంటి ఏఐని సృష్టించడం భారతీయ స్టార్టప్లకు చాలా కష్టమని తెలిపారు. ఎంత కష్టమైనప్పటికీ.. పోటీ పడడం అందరి పని కాబట్టి ఎలాగైనా ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. కాగా, త్వరలో ఏఐకి సంబంధించి పలు నిబంధనలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఈనెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నట్టు తెలిపారు. దీంతో, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఉబర్.. ర్యాపిడోవంటి బైక్ ట్యాక్సీల నిషేధం వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు ఇరువర్గాల పిటిషన్లను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అందజేయాలని కోర్టు సిబ్బందికి సూచించింది. వాటిని పరిశీలించి కేంద్రం తమ అభిప్రాయం తెలియజేస్తే.. దానిని పరిగణనలోకి తీసుకొని విచారిస్తామని వెల్లడించింది.
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఎన్నికల జరిగే రాష్ట్రాల్లోనే ఈడీ దాడులు చేపడుతోందని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. సికార్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్మెంట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన తరుణంలో ఆయన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి.
విరాటపర్వం మూవీ డైరెక్టర్ వేణు ఉడుగుల తన నెక్స్ట్ మూవీని ఒక టాప్ బ్యానర్లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 1990 సంవత్సరం బ్యాక్డ్రాప్లో తెలంగాణ గ్రామీణ కథాంశంతో పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో లీడ్ రోల్లో నటించనున్నట్లు ఫిల్మ్నగర్ టాక్.
ప్రస్తుత హర్యానా ప్రభుత్వం పీపీ ప్రభుత్వం అంటే పోర్టల్, పోలీసుమని హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా విమర్శించారు. షహాబాద్లో నిరసన తెలుపుతున్న రైతులపై అభియోగాలు పోలీసుల లాఠీ ఛార్జ్పై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొదట ‘మేరీ ఫసల్ మేరా బ్యోరా’ పోర్టల్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు రైతులు పేమేంట్ అడిగితే పోలీసులను పంపారని ఆరోపించారు.
AP: జనసేనాని పవన్ కల్యాణ్ వీకెండ్ పర్యాటకుడని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాము పవన్ కల్యాణ్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం అవుతానని చంద్రబాబు ఇంకా పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఎవరెన్ని కూటములు కట్టినా తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ విజయావకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. ఈ కీలక పోరులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో రహానే (89), శార్దూల్ ఠాకూర్ (51) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3, బోలాండ్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ తలో 2… నాథన్ లైయాన్ ఒక వికెట్ తీశారు.
2017 నుంచి 2021 వరకు పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వాహనంతో సంబంధం లేకుండా డిసెంబర్ 31, 2016 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య జారీ అయిన చలాన్లకు ఈ రద్దు వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాగా డబ్బున్న ఓ బిజినెస్మాన్ను ఈ భామ పెళ్లి చేసుకోనున్నట్లు ఫుల్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వీళ్ళ నిశ్చితార్థానికి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. నిశ్చితార్థం తర్వాత పెళ్లి గురించి మీడియా ద్వారా అభిమానులకు చెప్పడానికి నిత్యామీనన్ రెడీ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
TS: మంచిర్యాల నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం కేసీఆర్ చెప్పారు. మంచిర్యాలలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చాలా అంశాల్లో నంబర్ వన్గా ఉందన్నారు. నోట్ల రద్దు, కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా అభివృద్ధిలో ముందుకు సాగామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఔరంగజేబు సమస్యపై జరుగుతున్న రగడతో మహారాష్ట్రలో ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదని అమరావతి ఎంపీ నవనీత్ రాణా అన్నారు. మహారాష్ట్రను విభజించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని పొగుడుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కొల్హాపూర్లో ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఇటీవలికాలంలో స్టార్టప్ల జోరుగా బాగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం డేటాను విడుదల చేసింది. దాని ప్రకారం, నవంబర్ 2022 నాటికి మహారాష్ట్రలో అత్యధికంగా 13,519 స్టార్టప్లు ఉన్నాయి. కర్ణాటక (8,881), ఢిల్లీ (8,636), ఉత్తరప్రదేశ్ (6,654), గుజరాత్ (4,920), హర్యానా (3,985), తమిళనాడు (3,953) ఉండగా.. తెలంగాణలో 3,875 స్టార్టప్లు ఉన్నాయి.
బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ఆయన నటించిన ‘భైరవ ద్వీపం’ మూవీని రీ-రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీని ఇప్పుడు 4Kలో రీ-రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో.
AP: రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని, అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందనుందని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ పైనల్స్లో తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ 14 పరుగులకే ఔట్ కావడంపై విమర్శలకు తావిచ్చింది. ఈ విమర్శలకు కోహ్లీ తన ఇన్స్టా స్టోరీ రూపంలో జవాబు ఇచ్చాడు. ‘ఇతరుల అయిష్టాన్ని అంగీకరించగల సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడే జైలును తలపించే వారి అభిప్రాయాల నుంచి బయట పడగలుగుతాం’ అనే అర్థం వచ్చేలా సందేశాన్ని పోస్ట్ చేశాడు.
హోమ్ ఓనర్షిప్ ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించారని , అందుకే గడిచిన తొమ్మిదేళ్లలో ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించారని కేంద్రమంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల మందికి పైగా ప్రజలకు ఇళ్లను నిర్మించామని తెలిపారు. అది ప్రపంచాన్నే షాకింగ్ గురి చేసిందని పేర్కొన్నారు. ఆ ఇళ్లలో జపాన్ దేశంలోని ప్రజలందరూ ఉండొచ్చని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని లక్నో సివిల్ కోర్టులో జరిగిన గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జీవాను హత్య చేసేందుకు నిందితుడు విజయ్ యాదవ్ రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. హత్యకు గురయ్యే వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే రూ. 20 లక్షల డీల్ కుదరడంతో విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడే రూ.1,748 కోట్లతో చెన్నూర్, పర్ధాన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్ పాం ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశారు. గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కొబ్బరికాయ కొట్టారు.
యాంకర్ సుమ కాలికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆమె ఇటీవల తన పిల్లలతో కలిసి వెకేషన్కు వెళ్లారట. అక్కడ అటు ఇటు తిరగడంతో కాలికి గాయాలు అయ్యాయని.. అందుకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇక కాలివేళ్లకు ప్లాస్టర్ ఉన్న కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేయడంతో అవి కాస్త వైరల్గా మారాయి. ఈ కారణంగానే ఆమె ‘ఆదిపురుష్’ ఈవెంట్కు దూరమైనట్లు తెలుస్తోంది.
అమెరికాలోని పనిచేసే మహిళలు 1967 నుంచి ఇప్పటివరకు ఏకంగా $61 ట్రిలియన్ల వేతనాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ నివేదిక తెలిపింది. మహిళలకు 2056 తర్వాతగాని పురుషులతో సమానమైన వేతనం లభించదని నివేదిక పేర్కొంది. యూఎస్ ప్రభుత్వ డేటా ప్రకారం, గతేడాది పురుషుడు సంపాదించిన ప్రతి డాలర్కు మహిళలు 82 సెంట్లు మాత్రమే సంపాదించారు.
AP: CM జగన్కు కోర్టులో మేలు జరగాలని, వివేకా హత్య కేసులో తప్పించాలని దేవాదాయ శాఖ మంత్రి పూజలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రతి మతానికి కొన్ని సంప్రదాయాలుంటాయని, వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిదికాదన్నారు. రైతుబజారును కూడా తాకట్టు పెట్టాలని ఆర్థికమంత్రి యత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో ఉన్న నాయకులంతా జోకర్లేనని ఈ సందర్భంగా చంద్రబాబు ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులకు హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) గుడ్న్యూస్ చెప్పింది. పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 47 ఖాళీలను భర్తీ చేస్తోంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
AP: సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 12న నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సమావేశం కానున్నారు. జూన్ 23న జరిగే ఈ సమావేశానికి పట్నా వేదిక కానుంది. ఈ సమావేశానికి తాను కూడా హాజరవుతున్నట్లు తమిళ నాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలు అన్నీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ అజింక్య రహానే టెస్టు పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. దాదాపు 512 రోజుల తర్వాత నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ ద్వారా టెస్టు ఆడుతున్న రహానే అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలోనే రహానే టీమిండియా తరపున డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్థసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
పలు సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో అభిమానులను ఫిదా చేసింది.
WTC ఫైనల్ను ఐసీసీ ఇంగ్లండ్లోనే నిర్వహిస్తుంది. ఎందుకంటే.. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లాంటి ఆసియా దేశాల్లో జూన్ నెలలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ లాంటి యూరోప్ దేశంలోనే పరిస్థితులు మ్యాచ్కు కాస్త అనుకూలంగా ఉంటాయి. అందుకే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ను ఇంగ్లండ్లో నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది.
హెడ్లైన్స్
ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మంగళగిరిలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఐ-టీడీపీ కృషివల్లనే 21 లక్షలమంది సభ్యత్వం నమోదైందని ప్రశంసించారు. టీడీపీ గెలిచాక ఏడాదికి మూడు సిలెండర్లు, ఉచిత బస్సుప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలతో మహిళలకు లబ్ధి చేకూరుస్తామన్నారు. బీసీల భద్రతకు చట్టం తెస్తామని చెప్పారు.