shape

All News ChotaNews

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎర్రబెల్లి

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎర్రబెల్లి

మాజీ మంత్రి, BRS సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలను ఎర్రబెల్లి తాజాగా ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. BRSను మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముందుండి పని చేస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను ఎన్ని బెదిరింపులకు గురి చేసినా వాటికి తాను భయపడనని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్, డీఎంకేలు బొమ్మాబొరుసులు: మోదీ

కాంగ్రెస్, డీఎంకేలు బొమ్మాబొరుసులు: మోదీ

తమిళనాడులోని అధికార డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు ఒకే నాణేనికి ఉండే బొమ్మాబొరుసులు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. డీఎంకే-కాంగ్రెస్ అంటే..పెద్ద అవినీతి, కుటుంబ పాలనకు నిర్వచనాలు అని విమర్శించారు. కాంగ్రెస్‌ను వదిలించుకున్నాక దేశం 5జీ టెక్నాలజీకి చేరుకుందని, కానీ తమిళనాడులో డీఎంకే.. ఒకే కుటుంబానికి చెందిన ఐదవ తరాన్ని(5జీ) నడుపుతోందని మోదీ దుయ్యబట్టారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

తల్లిని కలిసేందుకు కవితకు అనుమతి

తల్లిని కలిసేందుకు కవితకు అనుమతి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవితకు న్యాయస్థానం ఊరటనిచ్చింది. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య బంధువులను కలిసేందుకు కోర్టు అంగీకరించింది. అయితే ఎక్కువ మంది కలవడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని వ్యాఖ్యానించింది. దీంతో ముందుగా అనుమతించిన వారిలో కవిత తల్లి, కుమారులు, సోదరీమణులను కలిసేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది.

బీజేపీలో చేరిన త‌ర‌న్‌జిత్ సింగ్ సంధూ

బీజేపీలో చేరిన త‌ర‌న్‌జిత్ సింగ్ సంధూ

గ‌తంలో అమెరికాకు భార‌తీయ అంబాసిడ‌ర్‌గా చేసిన త‌రన్‌జిత్ సింగ్ సంధూ ఇవాళ బీజేపీలో చేరారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆ పార్టీ త‌ర‌పున పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ నుంచి పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌న రాజ‌కీయ ఇన్నింగ్స్‌కు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌కు ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.

అమితాబ్‌ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ

అమితాబ్‌ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ

అమితాబ్‌ బచ్చన్ ఎప్పటికీ తన ఫేవరెట్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రైజింగ్ భారత్‌ సమ్మిట్-2024లో వ్యాఖ్యాత కొందరు బాలీవుడ్ నటీనటుల ఫొటోలను చూపించి, ఎవరంటే ఇష్టమని గడ్కరీని ప్రశ్నించారు. ‘‘వీరి అందరి యాక్టింగ్ నచ్చుతుంది. కానీ అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో. జంజీర్ చిత్రాన్ని మూడుసార్లు చూశా. ‘ఆనంద్’‌ను మూడునాలుగు సార్లు చూశా’’ అని ఆయన తెలిపారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: ఖర్గే

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: ఖర్గే

దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘2004లో ఎన్నికలలో వచ్చిన ఫలితాలే ఇప్పుడు కూడా వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అప్పటి గతే పడుతుంది. పార్టీ మేనిఫెస్టోకు విస్తృత ప్రచారం కల్పించడం మన బాధ్యత. దేశంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్‌ మేనిఫెస్టో చేరువకావాలి. ప్రతి హామీని కాంగ్రెస్‌ పూర్తి చేస్తుంది’’ అని ఆయన తెలిపారు.

‘ఖమ్మం బీజేపీ టికెట్ నాదే’

‘ఖమ్మం బీజేపీ టికెట్ నాదే’

ఖమ్మం లోక్‌సభ బీజేపీ టికెట్ తనకే వస్తుందని ఆ పార్టీ నేత జలగం వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం టికెట్‌పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న అంశం తన పరిధిలోనిది కాదన్నారు. పొత్తులు, సర్దుబుటులు పార్టీ పెద్దలు చూసుకుంటారని అన్నారు.

అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్‌లో ఉంచుతా: గంభీర్‌

అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్‌లో ఉంచుతా: గంభీర్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో తిరిగి చేరిన గౌతమ్‌ గంభీర్‌ IPL-2024 ప్రమోషన్‌ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను కేకేఆర్‌ని విడిచి వెళ్లే సమయానికి మేం మరింత మెరుగైన స్థితిలో ఉంటామని మీకు హామీ ఇస్తున్నాను’’ అని చెప్పాడు. కాగా మార్చి 23న ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఆ బాధ్యత ఎవరిది?: దేవినేని ఉమా

ఆ బాధ్యత ఎవరిది?: దేవినేని ఉమా

దేశ ప్రధాని మోదీ ప్రజాగళం సభలో భద్రత వైఫల్యానికి కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులను టీడీపీ నేత దేవినేని ఉమా కోరారు. ప్రధానమంత్రి సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది? అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చేసిన మోసాలు,అవినీతిని ప్రధాని ప్రజలకు ఆ సభలో వివరించారని, ఎవరెన్ని కుట్రలు చేసిన ఆ సభ బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందన్నారు.

హైదరాబాద్‌కు రానున్న కొత్త గవర్నర్

హైదరాబాద్‌కు రానున్న కొత్త గవర్నర్

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో ఝార్ఖండ్‌ గవర్నర్‌ సి.పి రాధాకృష్ణన్‌‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన ఈరోజు రాత్రికి హైదరాబాద్‌కు రానున్నారు. రేపే ఆయన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

‘ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం’

‘ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం’

AP: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.ఈ‌ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామన్నారు. ఒంగోలులోని అంబేడ్కర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల సంక్షేమం‌పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదని, ఇటీవల ప్రకటించిన పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు.

మ్యాచ్ మధ్యలో సిగరెట్ తాగిన క్రికెటర్

మ్యాచ్ మధ్యలో సిగరెట్ తాగిన క్రికెటర్

పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. సోమవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వసీమ్‌పై పాక్ క్రికెట్ బోర్డు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలి: హరీష్

ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలి: హరీష్

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని BRS సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. గతంలో అకాల వర్షాలకు రైతులు నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇచ్చారని అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ సర్కారుకు రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.

ముగిసిన సీడబ్ల్యూసీ మీటింగ్

ముగిసిన సీడబ్ల్యూసీ మీటింగ్

ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జి జైరాం రమేశ్ మాట్లాడుతూ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించామని చెప్పారు. ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ ఇప్పటికే 5న్యాయాల కింద 25గ్యారంటీలను ప్రకటించారని చెప్పారు. కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర’తో దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో BRSకు వరుస షాక్‌లు

మహారాష్ట్రలో BRSకు వరుస షాక్‌లు

మహారాష్ట్రలో BRS పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ రాష్ట్ర BRS ప్రధాన కార్యదర్శి, రైతు సంఘం నేత మాణిక్‌రావు కదం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం NCPలో చేరగా.. ఆయనను మహారాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా NCP పార్టీ నియమించింది. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో మహారాష్ట్ర BRS నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

బెంగాల్‌ డీజీపీని మార్చిన ఎన్నికల సంఘం

బెంగాల్‌ డీజీపీని మార్చిన ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ డీజీపీని మార్చింది. నిన్న ఆ రాష్ట్ర డీజీపీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం వివేక్ సహాయ్‌ను డీజీపీగా మార్చింది. తాజాగా వివేక్‌ సహాయ్‌ను తొలగించి, ఆయనకు బదులుగా సంజయ్‌ ముఖర్జీని నియమించింది. కాగా 24 గంటల్లోనే డీజీపీ మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జేఎంఎంకు షాక్.. బీజేపీలోకి సీతా సోరెన్

జేఎంఎంకు షాక్.. బీజేపీలోకి సీతా సోరెన్

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌సోరెన్ వ‌దిన‌, జేఎంఎం ఎమ్మెల్యే సీతాసోరెన్ పార్టీలోని అన్ని ప‌ద‌వుల‌కూ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోని బీజేపీలో చేరారు. హేమంత్ అన్న దుర్గాసోరెన్ స‌తీమ‌ణి అయిన సీత మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. త‌న భ‌ర్త మ‌ర‌ణానంత‌రం తనను, త‌న కుటుంబాన్ని అగౌర‌వ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పార్టీని వీడిన ఆమె.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

‘ఎస్.కోట నుంచి MLAగా, విశాఖ నుంచి MPగా పోటీ చేస్తా’

‘ఎస్.కోట నుంచి MLAగా, విశాఖ నుంచి MPగా పోటీ చేస్తా’

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాను పోటీ చేయబోయే స్థానాలపై క్లారిటీ ఇచ్చారు. ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడేందుకు గత ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నానని, ఇప్పుడు ఎంపీగా గెలిస్తే కాపాడతానన్నారు. రూ.10లక్షల కోట్ల అప్పు చేసిన జగన్, చంద్రబాబు కావాలా? రూ.5లక్షల కోట్లు సంపాదించే కేఏ పాల్ కావాలో తేల్చుకోవాలన్నారు.

టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

ఏపీలో టీడీపీ పోటీ చేసే కొన్ని ఎంపీ సీట్ల జాబితాను సాయంత్రం ఆ‌పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం

హమాస్ టాప్ కమాండర్ మృతిని ధ్రువీకరించిన అమెరికా

హమాస్ టాప్ కమాండర్ మృతిని ధ్రువీకరించిన అమెరికా

గత వారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హమాస్ అగ్ర కమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ధ్రువీకరించారు. మార్చి 11న సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో ఇస్సా మరణించాడని వెల్లడించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడానికి ఇస్సానే ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు.

కంటతడి పెట్టిన ప్రధాని.. ఎందుకంటే..?

కంటతడి పెట్టిన ప్రధాని.. ఎందుకంటే..?

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. సేలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‘ఆడిటర్’ వి.రమేష్‌ను తలుచుకుని ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. ఈక్రమంలో నిమిషం పాటు తన స్పీచ్‌ను ఆపిన ప్రధాని.. ‘ఆడిటర్’ రమేష్‌ను దుండగులు హత్య చేసిన విధానంపై మండిపడ్డారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ట్యాపింగ్ డివైస్‌ను ధ్వసం చేసిన ప్రణీత్ రావు

ట్యాపింగ్ డివైస్‌ను ధ్వసం చేసిన ప్రణీత్ రావు

మాజీ DSP ప్రణీత్‌రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబిలోని ట్యాపింగ్ డివైస్,అందులోని హార్డ్‌డిస్క్ మొత్తాన్ని ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. మరొకసారి ఆ డివైస్ పనికిరాకుండా చేసి, అడవుల్లో పడేసినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ డివైస్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు BRSకు చెందిన కీలక నేత ఆదేశాలతో సిరిసిల్ల,వరంగల్‌లో ఆయన 2 సర్వర్లు ఏర్పాటు చేసినట్లు తేలింది.

‘2026లో బుల్లెట్ రైలు పరుగులు’

‘2026లో బుల్లెట్ రైలు పరుగులు’

కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బుల్లెట్ రైలు 2026 నాటికి రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన పలు ప్రాజెక్టులపై మాట్లాడారు.‘‘బుల్లెట్‌ రైలు కోసం 500కి.మీల ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్‌ 8-10 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తిచేయనుంది’’ అని వెల్లడించారు.

బెంగళూరులో వెల్లువెత్తిన నిరసనలు

బెంగళూరులో వెల్లువెత్తిన నిరసనలు

కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్‌లో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు ముకేశ్‌ అనే షాప్‌కీపర్‌ను తీవ్రంగా కొట్టిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. సిద్ధన్న లేఅవుట్‌లో ముకేశ్‌ మొబైల్‌ దుకాణం నిర్వహిస్తున్న ప్రాంతానికి ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు. ముకేశ్‌పై దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.జై శ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తించారు.

కారు అదుపు తప్పి వరంగల్ నిట్ విద్యార్థి మృతి

కారు అదుపు తప్పి వరంగల్ నిట్ విద్యార్థి మృతి

కారు అదుపు తప్పి వరంగల్ నిట్ విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పీఎస్‌ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో యూపీకి చెందిన క్షతిరాజ్ (24) మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. అద్దె కారులో స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్‌కు రైతు ప్రయోజనాలు పట్టవు: హరీశ్

కాంగ్రెస్‌కు రైతు ప్రయోజనాలు పట్టవు: హరీశ్

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు, పంట నష్టాలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాంగ్రెస్‌కు రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టవని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.

చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా

చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా

ఏపీ స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో నేడు విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఆధ్యాత్మిక టూర్‌లో మేటి బాక్స‌ర్ ఫ్ల‌యిడ్ మేవెద‌ర్‌

ఆధ్యాత్మిక టూర్‌లో మేటి బాక్స‌ర్ ఫ్ల‌యిడ్ మేవెద‌ర్‌

మాజీ బాక్సింగ్ చాంపియ‌న్ ఫ్ల‌యిడ్ మేవెద‌ర్‌ ముంబైలోని సిద్ధివినాయ‌క ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న ఆయన ప్ర‌స్తుతం భారత్‌లో ఆధ్యాత్మిక టూర్ చేస్తున్నాడు. మేవెద‌ర్ కెరీర్‌లో అద్భుత‌మైన రికార్డు ఉంది. ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్‌లో ఆయన ఖాతాలో 50విక్ట‌రీలు ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. వేర్వేరు వెయిట్ కేట‌గిరీల్లో జ‌రిగే బౌట్‌ల్లోనూ.. మేవెద‌ర్ ఖాతాలో 15మేజ‌ర్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ట్రోఫీలు ఉన్నాయి.

పేలుడు పదార్థాలు కలకలం

పేలుడు పదార్థాలు కలకలం

బెంగళూరులో నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌లో పోలీసులు పేలుడు పదార్ధాలు గుర్తించారు. అందులో జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లతోపాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. ట్రాక్టర్‌ యజమానిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మేఘన ఫుడ్స్ మీద ఐటీ దాడులు

మేఘన ఫుడ్స్ మీద ఐటీ దాడులు

బెంగళూరుకు చెందిన మేఘన ఫుడ్స్ గ్రూప్‌(Meghana Foods Group) మీద కర్ణాటక(Karnataka), గోవా(Goa) ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కోరమంగళ, ఇందిరానగర్‌లోని కార్యాలయాలు సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మేఘన ఫుడ్స్ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్న కారణంగానే ఐటీ అధికారులు(IT Officers) సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే

సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలన్ని అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించగా.. ఓ పార్టీలో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తులు మరో పార్టీలోకి వెళ్తున్నారు. తాజాగా అధికార వైసీపీ నుంచి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన సీతా సోరెన్

పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన సీతా సోరెన్

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వ‌దిన‌, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీలోని అన్ని ప‌ద‌వుల‌కూ రాజీనామా చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్న దివంగత దుర్గా సోరెన్ స‌తీమ‌ణి. కాగా త‌న భ‌ర్త మ‌ర‌ణానంత‌రం తనను, త‌న కుటుంబాన్ని అగౌర‌వ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీతా సోరెన్ రాజీనామా లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై ఇదే..!

బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై ఇదే..!

సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం రక్షించడంతో బల్గేరియా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ఏడుగురు బల్గేరియా జాతీయులు సురక్షితంగా ఉన్నారు. త్వరలో తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు, హైజాకింగ్ వంటి చర్యల కట్టడికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ సమాధానం ఇచ్చారు.

జగన్ తొలిసభ అక్కడే.. బస్సుయాత్ర షెడ్యూల్ రెడీ

జగన్ తొలిసభ అక్కడే.. బస్సుయాత్ర షెడ్యూల్ రెడీ

AP : ఈ నెల 27వ తేదీ నుంచి YCP చీఫ్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3గంటలకు YCP నేతలు బస్సు యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఉదయం పూట ప్రజలు, కార్యకర్తలతో జగన్ మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రొద్దుటూరులో ఈ నెల 27న తొలి బహిరంగ సభ జరగనుంది.

ఈడీ ప్రకటనపై ఆప్ అభ్యంతరం

ఈడీ ప్రకటనపై ఆప్ అభ్యంతరం

ఢిల్లీ మద్యం విధానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. ఈ దర్యాప్తు సంస్థ బీ జేపీ పొలిటికల్‌ వింగ్‌లా పనిచేస్తోందని మండిపడింది.

ఆ నినాదం రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది: చంద్రబాబు

ఆ నినాదం రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది: చంద్రబాబు

AP : NDA కూటమికి లోక్‌సభలో 400+ స్థానాలు, APలో 160కి పైగా MLA సీట్లు అనే నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని చెప్పారు. ఏపీలో TDP, జనసేన, BJP కూటమి విజయం సాధించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు.

బీజేపీలోకి మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. ఇదే క్లారిటీ!

బీజేపీలోకి మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.. ఇదే క్లారిటీ!

తాను బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. తాను రాముని గుడికి వెళ్లింది వాస్తమేనని.. అయితే, అయోధ్యను సందర్శిస్తే బీజేపీలో చేరినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. కోడిగుడ్ల మీద ఈకలు పీకే ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. తాను పార్టీ మారబోనని.. బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చిన్న నాయకులను ప్రలోభపెట్టి.. అధికార పార్టీలోకి లాక్కుంటున్నారని ఆయన ఆగ్రహించారు.

డ్రగ్స్‌ వినియోగంపై మస్క్‌ ఏమన్నారంటే..?

డ్రగ్స్‌ వినియోగంపై మస్క్‌ ఏమన్నారంటే..?

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మాదకద్రవ్యాలను వినియోగించినట్లు అంగీకరించారు. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకు కెటమిన్‌ అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం మస్క్‌ డ్రగ్స్‌ వినియోగంపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.