ChotaNews Quick Feeds

కాంగ్రెస్‌లో చేరిన కారెడ్డి నాగిరెడ్డి

కాంగ్రెస్‌లో చేరిన కారెడ్డి నాగిరెడ్డి

బీఆర్ఎస్‌ నుంచి మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. BRS యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి కారెడ్డి నాగిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.

మాటల్లో వర్ణించలేను..  ఇలియానా ఎమోషనల్

మాటల్లో వర్ణించలేను.. ఇలియానా ఎమోషనల్

పెళ్లి చేసుకోకుండానే తల్లయిన ఇలియానాపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా తన భర్త గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మైఖేల్‌తో తన జీవితం అద్భుతంగా సాగుతోందని తెలిపింది. సంతోషంగా ఉ‍న్నా.. బాధలో ఉన్నా ఎప్పటికీ తనకు సపోర్ట్‌గానే ఉన్నాడని పేర్కొంది. అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో వర్ణించలేనంటూ ఈ బ్యూటీ ఎమోషనల్ అయింది.

పోలింగ్-2: ఎక్కడ ఎంత శాతమంటే?

పోలింగ్-2: ఎక్కడ ఎంత శాతమంటే?

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు జమ్మూ కశ్మీర్ లో 67.22%, అస్సాం 70.66%, బీహార్ 53.03%, ఛత్తీస్‌గఢ్ 72.13%, కర్ణాటక 63.9%, కేరళ 63.97%, మధ్యప్రదేశ్ 54.83%గా నమోదైంది. 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మే 7న మూడో విడతలో భాగంగా 94 స్థానాలకు ఎన్నిక జరగనుంది.