ChotaNews Quick Feeds

ఇక మిగిలింది మూడు అసెంబ్లీ నియోజకవర్గాలే..

ఇక మిగిలింది మూడు అసెంబ్లీ నియోజకవర్గాలే..

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో భాగంగా ఇప్పటి వరకు 172 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన ఆ మూడు(అవనిగడ్డ,పాలకొండ,విశాఖ సౌత్) జనసేనకు కేటాయించిన స్థానాలే. 25 ఎంపీ సీట్లలో సైతం టీడీపీ, బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా జనసేనకు కేటాయించిన మచిలీపట్నం స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా ఉదయ్ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

OTTలోకి రానున్న ‘లంబసింగి’

OTTలోకి రానున్న ‘లంబసింగి’

భరత్‌రాజ్‌, బిగ్‌బాస్ ఫేం దివి జంటగా నటించిన న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌ ల‌వ్‌స్టోరి చిత్రం ‘లంబసింగి’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లై 20 రోజులు కూడా పూర్తి కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. ఏప్రిల్ 2 నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.