ChotaNews Quick Feeds

అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

మే 10 శుక్రవారం అక్షయ తృతీయ. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది. అయితే ఈ రోజు బంగారం వెండి కన్నా కొనుగోలు చేయాల్సిన ముఖ్యమైన వస్తువులు చాలా ఉన్నాయి.

వాయిస్‌ ఇన్‌పుట్‌ రిమోట్‌తో అమెజాన్‌ ఫైర్‌స్టిక్‌

వాయిస్‌ ఇన్‌పుట్‌ రిమోట్‌తో అమెజాన్‌ ఫైర్‌స్టిక్‌

అమెజాన్ మరో జనరేషన్‌ ఫైర్‌స్టిక్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. తొలిసారిగా 4K సపోర్ట్‌తో తీసుకొచ్చింది. పాత జనరేషన్లతో పోలిస్తే కొన్ని ఫీచర్లను అదనంగా జోడించారు. అమెజాన్‌ తీసుకొచ్చిన కొత్త ఫైర్‌‌స్టిక్‌ 4K మెటల్‌ బ్లాక్‌ రంగులో లభిస్తుంది. దీని ధరను రూ.5,999గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చు. మే 13 నుంచి విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ లభ్యమవుతుంది.

సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు

సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు

వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు పెన్షన్లు ఆపించారంటూ IVR కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేయించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.