ఎలక్షన్స్ ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న హైదరాబాద్
హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూర్లకు పయనం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను మొత్తం ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు రెండు రోజులు వారాంతపు సెలవులు కూడా కావడంతో ఆంధ్రా ప్రజలు తమకు ఓటు హక్కు ఉన్న సొంతూర్లకు పయనం అవుతున్నారు.