ChotaNews Quick Feeds

‘దాన విక్రయ దస్తావేజు’ వైరల్‌

‘దాన విక్రయ దస్తావేజు’ వైరల్‌

ఎన్నికల వేళ ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో సోషల్‌ మీడియాలో ఒక ఫొటో వైరలవుతోంది. ‘‘మే 13న.. ఫ్యాన్‌ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు’’ అని ఈ ఫొటోలో ఉంది.

మంగళగిరికి త్వరలో మహర్దశ: బ్రాహ్మణి

మంగళగిరికి త్వరలో మహర్దశ: బ్రాహ్మణి

AP: మంగళగిరికి త్వరలో మహర్దశ పట్టనుందని టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో ఆమె నిర్వహించిన ప్రచారానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. చేనేత కార్మికులు, క‌ళాకారులకు ఆర్థికంగా చేయూత అంద‌నుందని వెల్లడించారు. ఇక్కడి చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషిచేస్తామని వెల్లడించారు.

వైసీపీపై నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవుగా!

వైసీపీపై నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవుగా!

వైసీపీపై నెట్టింట సెటైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. ఈసారి ఏపీలో వైసీపీ గెలిస్తే.. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే వైసీపీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని కొందరు సెటైరికల్ వీడియోను షేర్ చేశారు. ఇది నెట్టింట వైరలవుతోంది. ఇది నిజమేనంటూ టీడీపీ-జనసేన-బీజేపీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా.. వైసీపీ మద్దతుదారులు మాత్రం మండిపడుతున్నారు.