నేను క్షేమంగా ఉన్నాను: కేటీఆర్
ఆదిలాబాద్లోని భైంసా పట్టణంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘‘ఈ దాడి తరువాత తనకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరేమి చేయలేని ఈ బీజేపీ గుండాలలో పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను’’ అని ట్వీట్ చేశారు.