ChotaNews Quick Feeds

నేను క్షేమంగా ఉన్నాను: కేటీఆర్

నేను క్షేమంగా ఉన్నాను: కేటీఆర్

ఆదిలాబాద్‌లోని భైంసా పట్టణంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘‘ఈ దాడి తరువాత తనకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరేమి చేయలేని ఈ బీజేపీ గుండాలలో పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను’’ అని ట్వీట్ చేశారు.

కేరళ ఆలయాల్లో ఆ పూలు నిషేధం

కేరళ ఆలయాల్లో ఆ పూలు నిషేధం

కేరళలోని రెండు ప్రధాన దేవస్వామ్ బోర్డులైన ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డ్(టీడీబీ), మలబార్ దేవస్వోమ్ బోర్డ్‌ల పరిధిలోని అన్ని దేవాలయాలు ‘‘ఒలియాండర్ పూలను’’ నిషేధించాయి. అరళీ పూలు, ఎర్రగన్నేరు పూలుగా పిలిచే వాటిని ఆలయాల్లో పవిత్ర ఆచారాల్లో వినియోగించడాన్ని నిలిపేశాయి. మానవులు, జంతువులకు హాని కలిగించే ప్రమాదం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచే ఇది అమల్లోకి వచ్చింది.

పిఠాపురంలో రేపు పవన్ కల్యాణ్ రోడ్ షో

పిఠాపురంలో రేపు పవన్ కల్యాణ్ రోడ్ షో

AP: ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు పిఠాపురంలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో రోడ్ షో ప్రారంభించనున్నారు. పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువు, పాదగయ కూడలి, ప్రభుత్వ ఆసుపత్రి, ఉప్పాడ సెంటర్, కోట గుమ్మం సెంటర్, చర్చి సెంటర్, పశువుల సంత మీదుగా రోడ్‌ షో కొనసాగించనున్నారు.