తెలంగాణను కేసీఆర్ అధోగతి పాలు చేశారు: భట్టి
మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అధోగతి పలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. వారిచ్చిన మూడెకరాల హామీ, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, తెలంగాణలో వచ్చే ప్రతి రూపాయి.. తిరిగి ప్రజలకే పంచేందుకు ఈప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్జీతో గెలిపించాలని కోరారు.