తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఒకప్పుడు కరెంట్ కోతలతో సతమతమైన రాష్ట్రం ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి చేరిందని చెప్పారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎన్నో సవాళ్లను అధిగమించి బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుంటోందని అన్నారు.
Posted On: February 3, 2023, 12:48 pm