ChotaNews Quick Feeds

రెండుగా విడిపోయిన ముంబై జట్టు!

రెండుగా విడిపోయిన ముంబై జట్టు!

IPL-2024లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచెస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు రెండుగా విడిపోయిందని వార్తలు వస్తున్నాయి. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మలు రోహిత్ గ్రూప్‌లో ఉండగా.. ఇషాన్ కిషన్, ఇతర ఆటగాళ్లు పాండ్య గ్రూప్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం హార్దిక్ పాండ్యనే సపోర్ట్ చేస్తోందట.

ఇండియా కూటమి ర్యాలీకి ఈసీ గ్రీన్ సిగ్నల్!

ఇండియా కూటమి ర్యాలీకి ఈసీ గ్రీన్ సిగ్నల్!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం, పోలీసుల నుంచి అనుమతి లభించినట్లుగా ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ర్యాలీకి కూటమిలోని పార్టీల ముఖ్యనేతలు హాజరవుతున్నారు.

MI కెప్టెన్‌గా బూమ్రా?

MI కెప్టెన్‌గా బూమ్రా?

MI జట్టు కెప్టెన్‌ హార్దిక్ పాండ్యాపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో అత‌డిని త‌మ జ‌ట్టు పగ్గాల నుంచి త‌ప్పించే ఆలోచ‌న‌లో ముంబయి ఫ్రాంచైజీ ఉన్న‌ట్టు సమాచారం. అత‌డి స్ధానంలో బుమ్రాకు త‌మ జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాల‌ని MI యాజ‌మాన్యం భావిస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి.