దానికి ముందునుంచే కాంగ్రెస్ వ్యతిరేకం: బంగారప్ప
ఎన్నికలకు ముందు నుంచే పుస్తకాలలో ఉన్న సిలబస్కు కాంగ్రెస్ వ్యతిరేకమని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యామంత్రి మధు బంగారప్ప అన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక, తమ మేనిఫెస్టోలో చెప్పినట్లు పాఠ్యపుస్తకాల సవరణను నిబద్ధతగా చేస్తామని చెప్పారు. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ సవరణను ప్రతిపాదించినప్పటి నుంచి ప్రతిపక్ష బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.