సీపీఎం నాయకులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో సీపీఎం మద్దతు కోసం డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆ పార్టీ ముఖ్య నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి, సీతారాములతో సమావేశమయ్యారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో తేడా రావడంతో సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది.