ChotaNews Quick Feeds

వైసీపీ రోడ్ షో.. టీడీపీ సెటైర్

వైసీపీ రోడ్ షో.. టీడీపీ సెటైర్

AP: నెల్లూరు జిల్లా సీతారామపురంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా.. జనం లేచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో టీడీపీ తన అధికారిక ట్విట్టర్(X) ఖాతాలో షేర్ చేసింది. ‘‘భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్ళకండి అంటున్నా, ప్రజలు వైసీపీ నేతల మొఖాన ఛీ కొట్టి వెళ్ళిపోతున్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొంది.

మాజీ సీఎంపై కోడ్ ఉల్లంఘన కేసు

మాజీ సీఎంపై కోడ్ ఉల్లంఘన కేసు

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వంపై కేసు నమోదు చేసినట్లు కేనికరై పోలీసులు తెలిపారు. రామనాథపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఈనెల 25న రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తన మద్దతు దారులతో కలిసి ఊరేగింపుగా వెళ్లారని.. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

గోల్డ్ మంట మామూలుగా లేదు

గోల్డ్ మంట మామూలుగా లేదు

దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం(22 క్యారెట్ల ) ధర రూ. 350లు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 క్యారెట్ల ) ధర రూ. 380లు చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,700 వద్దకు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,310 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,500గా ఉంది.