ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
TG: మల్టీజోన్-1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ రంగనాథ్ సస్పెండ్చేశారు. సస్పెండైనవారిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్కానిస్టేబుల్,కానిస్టేబుల్ ఉన్నారు. పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో సంప్రదింపులు జరిపినట్టుగా విచారణలో తేలడంతో అప్పటి బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ను సస్పెండ్చేశారు.