ChotaNews Quick Feeds

రేపట్నుంచి ప్రచారంలోకి మాజీ సీఎం

రేపట్నుంచి ప్రచారంలోకి మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీలోని రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేయనున్నారు. ఇందులో సంబంధించి రేపటి(మార్చి 30) నుంచి ఆయన తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. రేపు కలికిరిలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. కిరణ్‌కు పోటీగా రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు.

కూలర్ను శుభ్రం చేయనందుకు కొడుకుపై తండ్రి దాడి

కూలర్ను శుభ్రం చేయనందుకు కొడుకుపై తండ్రి దాడి

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. శివపురిలోని జవహర్ కాలనీలో బలరామ్ అనే వ్యక్తి కూలర్ శుభ్రం చేయమని తన కొడుకు కపిల్ కుష్వాహకు చెప్పాడు. దీంతో కపిల్ కాసేపటి తరువాత చేస్తానని చెప్పగా.. కోపోద్రికుడైన బలరామ్ అతనిపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన షీలా, ఇంకో కుమారుడు జీతేంద్రపై కూడా దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బలరామ్‌పై కేసు నమోదు చేశారు.

ప్రవాసాంధ్రులకు వైసీపీ అభ్యర్థి బెదిరింపులు

ప్రవాసాంధ్రులకు వైసీపీ అభ్యర్థి బెదిరింపులు

AP: వేమూరు వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు ప్రవాసాంధ్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి మద్దతు పలికే ప్రవాసాంధ్రులు జాగ్రత్తగా ఉండాలని వరికూటి హచ్చరించారు. ఎన్నికలకు ఇక్కడకు వచ్చి ఏదైనా చేస్తే తిరిగి వెళ్లలేరని అన్నారు. వరికూటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మద్దతుదారులు అశోక్‌బాబు మాటలను ఖండిస్తున్నారు.