రాహుల్పై మధ్యప్రదేశ్ సీఎం వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘మన మతాన్ని, యువ, మహిళల శక్తిని రాహుల్గాంధీ అవమానించేవారు. యూపీలో ఓడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయి దక్షిణభారత్కు చేరుకున్నారు. భవిష్యత్తులో ఆయన మహాసముద్రాలను దాటి ఏదైనా ప్రాంతం నుంచి పోటీ చేయాల్సి రావచ్చు. మధ్యప్రదేశ్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకున్న ఏకైక లోక్సభ స్థానం ఛింద్వారాలోనూ ఈసారి బీజేపీ జెండా ఎగరబోతోంది’’అని తెలిపారు.