ChotaNews Quick Feeds

కొత్త కెప్టెన్‌పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త కెప్టెన్‌పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్-2024లో చెన్నై కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ని యాజమాన్యం నియమించిన విషయం తెలిసిందే. దీనిపై MS ధోనీ తొలిసారి స్పందించారు. గైక్వాడ్ కూడా ఫీల్డర్లు తప్పు చేస్తే పెద్దగా రియాక్ట్ కాడని తెలిపారు. చెన్నై-గుజరాత్ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్యాచ్‌ని రచిన్ రవీంద్ర వదిలేశాడు. దీనిపై ధోనీ స్పందిస్తూ తాను కెప్టెన్‌ని కానని సరదాగా ఆన్సర్ ఇచ్చాడు.

ఆసియాలోని అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో 3 భారతీయ హోటళ్లు

ఆసియాలోని అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో 3 భారతీయ హోటళ్లు

ఆసియాలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్‌ల జాబితాలో భారతదేశంలోని 3 ప్రముఖ రెస్టారెంట్‌లు తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ముంబైలోని విలాసవంతమైన రెస్టారెంట్ మాస్క్ ఈ జాబితాలో 23వ స్థానంలో నిలిచింది. ఢిల్లీకి చెందిన ఇండియన్ యాక్సెంట్ 26వ స్థానంలో కొనసాగింది. చెన్నైకి చెందిన అవర్తనా 44వ స్థానంలో అద్భుతంగా ప్రవేశించి అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూ ఎంట్రీ అవార్డును కూడా గెలుచుకుంది.

నేను అలా చెప్పలేదు: అనసూయ

నేను అలా చెప్పలేదు: అనసూయ

జనసేనకు తాను ప్రచారం చేస్తానని చెప్పినట్లు వస్తున్న వార్తలపై నటి అనసూయ స్పందించారు. ‘‘నేను ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారు. జనసేన పార్టీకి నా అంతట నేను ప్రచారం చేస్తానని చెప్పలేదు. పవన్ కల్యాణ్ మంచి నాయకుడని నా ఉద్దేశం. ఆయన అడిగితే మద్దతు ఇస్తానని చెప్పా. అంతేకానీ ప్రచారం చేస్తానని చెప్పలేదని’’ అనసూయ క్లారిటీ ఇచ్చింది.