అవి బ్యాటర్లకు వరంలా మారాయి: బుమ్రా
నిన్న పంజాబ్తో అనంతరం ముంబై స్టార్ పేసర్ బుమ్రా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి అని, బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్ అని తెలిపాడు. టైమ్ నిబంధనలతో పాటు ఇంపాక్ట్ రూల్ కూడా బ్యాటర్లకు వరంలా మారిందని, వాటితో బౌలర్లను ఆటాడుకుంటున్నారని పేర్కొన్నాడు. కాగా బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. 3 వికెట్లను పడగొట్టాడు.