21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష
TG: రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (ఇంగ్లీషు మీడియం-ఎంపీసీ, బీపీసీ, ఏఈసీ) ప్రవేశాలకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ తెలిపారు. సంబంధిత పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు.