ChotaNews Quick Feeds

కాంగ్రెస్ నాయకుల ప్రచారం

కాంగ్రెస్ నాయకుల ప్రచారం

రంగారెడ్డి: మొయినాబాద్ మండలంలోని ఎన్కెపల్లి, జీవన్‌గుడాలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వారు గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దుండిగల్‌లో మహిళ దారుణ హత్య

దుండిగల్‌లో మహిళ దారుణ హత్య

మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం సక్కుబాయి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కుటుంబ కలహాలతో తన తల్లి సక్కుబాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుమారుడు శేఖర్ దుండిగల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైలు చక్రాల మధ్య 100 కి.మీ ప్రయాణం

రైలు చక్రాల మధ్య 100 కి.మీ ప్రయాణం

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. అమాయక బాలుడు రైలు చక్రాల మధ్య ఇరుక్కుని దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాడు. పట్టాల సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు. వెంటనే అది కదలడంతో దిగలేక బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హర్దోయ్‌లో బాలుడిని రక్షించారు. అనంతరం చైల్డ్ కేర్‌కు అప్పగించారు.