కాంగ్రెస్ నాయకుల ప్రచారం
రంగారెడ్డి: మొయినాబాద్ మండలంలోని ఎన్కెపల్లి, జీవన్గుడాలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వారు గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.