ChotaNews Quick Feeds

T-20 వరల్డ్ కప్: అదిరిపోయే ప్రోమో

T-20 వరల్డ్ కప్: అదిరిపోయే ప్రోమో

ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జూన్ 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఆ వీడియో ప్రోమోను విడుదల చేసింది. రోహిత్ సేన టీ-20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా? అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు: ప్రధాని

అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు: ప్రధాని

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం​ చేస్తారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో జాంజ్‌గిర్-చంపాలో మంగళవారం(ఏప్రిల్‌23)జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడారు. అంబేద్కర్‌ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరన్నారు. కాంగ్రెస్‌ నేతలు తాము రాముని కంటే గొప్పవాళ్లం అనుకుంటారని, అందుకే అయోధ్య రాముని ప్రాణప్రతిష్టకు రాలేదని ఎద్దేవా చేశారు.

నాకు రాఖీ కడతారా: సీఎం జగన్

నాకు రాఖీ కడతారా: సీఎం జగన్

AP: వైసీపీ ప్రభుత్వం అందించిన పథకాల్లో సింహ భాగం మహిళకు సంబంధిచినవే ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. ఇంటి పట్టాలు సైతం మహిళల పేర్లతోనే రిజిష్టర్ చేశామని గుర్తు చేశారు. పథకాల ద్వారా ఇచ్చే నగదును కూడా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇన్ని చేసిన తనకు రాఖీ కడతారా అని జగన్ మహిళను కోరారు.