ChotaNews Quick Feeds

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌‌పై అమిత్‌ షా ఏమన్నారంటే!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌‌పై అమిత్‌ షా ఏమన్నారంటే!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధి, శాంతిభద్రతలు, యువత భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువని పేర్కొన్నారు. ఈ భావజాలం ఇప్పుడు చిన్న ప్రాంతానికే పరిమితమైందని, త్వరలో ఛత్తీస్‌గఢ్‌తోపాటు దేశం మొత్తం నక్సల్స్ రహితంగా మారుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌గా పాక్ మాజీ లెగ్ స్పిన్నర్

బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌గా పాక్ మాజీ లెగ్ స్పిన్నర్

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్‌ను నియమిస్తూ బీసీబీ అధికారికంగా ప్రకటించింది. వరల్డ్‌కప్‌ నేపథ్యంలో తమ స్పిన్‌ బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరచడానికి బంగ్లాదేశ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ముస్తాక్ గతంలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్, పాకిస్థాన్‌ జట్లకు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌‌గా పనిచేశాడు.

ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తింపు: ఈసీ

ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తింపు: ఈసీ

ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని ఈసీ వెల్లడించింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతోన్న 40 మందికి కోడ్‌ వర్తిస్తుందని తెలిపింది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈసీ గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.