ChotaNews Quick Feeds

మే 4న జిల్లాకు మోదీ

మే 4న జిల్లాకు మోదీ

నారాయణపేట: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మే 4న నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూల్ రాగా, 2వ సారి నారాయణపేటకు రానున్నారు.

మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి : హైకోర్టు

మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి : హైకోర్టు

HYD : మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే MDకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బోయిగూడ మెట్రో పిల్లర్‌ B1006 వద్ద రైల్వే ట్రాక్‌ వంపు వద్ద మితిమీరిన శబ్దం వస్తోందని, నియంత్రణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్‌ హనుమాన్లు హైకోర్టుకు లేఖ రాశారు.