ChotaNews Quick Feeds

Viral Video: ధోని మెరుపు ఇన్నింగ్స్‌!

Viral Video: ధోని మెరుపు ఇన్నింగ్స్‌!

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోని మరోసారి అదరగొట్టాడు. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని మెరుపులు మెరిపించాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నిన్న తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఈనెల 19 ఉదయం 7 నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని ఈసీ పేర్కొంది.

తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితే.. ఏపీలో వైసీపీకి వస్తుంది: గంటా

తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితే.. ఏపీలో వైసీపీకి వస్తుంది: గంటా

AP: తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితే.. రానున్న రోజుల్లో ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని వైసీపీ కూడా ఎదుర్కొంటుందని చెప్పారు. వైసీపీ నేతలను తాను బెదిరిస్తున్నానని అవంతి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. జగన్ వ్యవహారశైలి నచ్చక అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరారని తెలిపారు.