విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ఆమంచికి ఆహ్వానం
బాపట్ల: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను చీరాల మండలం పాలిబోయినవారిపాలెం గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసంలో ఆయనను కలిసి నూతన బ్రహ్మయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. కార్యక్రమంలో బలరాంరెడ్డి, శ్రీనివాస్, సుబ్బారెడ్డి, కోటిరెడ్డి, గూడారెడ్డి, భోగిరెడ్డి వీరారెడ్డి, నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.