ChotaNews Quick Feeds

విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ఆమంచికి ఆహ్వానం

విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ఆమంచికి ఆహ్వానం

బాపట్ల: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను చీరాల మండలం పాలిబోయినవారిపాలెం గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసంలో ఆయనను కలిసి నూతన బ్రహ్మయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. కార్యక్రమంలో బలరాంరెడ్డి, శ్రీనివాస్, సుబ్బారెడ్డి, కోటిరెడ్డి, గూడారెడ్డి, భోగిరెడ్డి వీరారెడ్డి, నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే: షర్మిల

వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే: షర్మిల

రాష్ట్రమంతా వైసీపీ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎక్కడ చూసినా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందన్నారు. రైతులను వైఎస్సార్ రాజును చేస్తే.. వైసీపీ వారిని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే అన్నారు.

రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల: వైవీ

రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల: వైవీ

AP: రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సీఎం జగన్ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేస్తామని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో వైసీపీ బలం పెరిగిందని ఆయన తెలిపారు.