ChotaNews Quick Feeds

బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ ఘన విజయం

బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ ఘన విజయం

ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ బట్లర్ సెంచరీతో చెలరేగడంతో చివరి బంతికి ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది.

కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆయన సిరిసిల్లలో కాంగ్రెస్‌ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత జి.నిరంజన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌‌పై అమిత్‌ షా ఏమన్నారంటే!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌‌పై అమిత్‌ షా ఏమన్నారంటే!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధి, శాంతిభద్రతలు, యువత భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువని పేర్కొన్నారు. ఈ భావజాలం ఇప్పుడు చిన్న ప్రాంతానికే పరిమితమైందని, త్వరలో ఛత్తీస్‌గఢ్‌తోపాటు దేశం మొత్తం నక్సల్స్ రహితంగా మారుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.