ChotaNews Quick Feeds

సీఏపీఎఫ్‌లో 506 పోస్టులకు UPSC నోటిఫికేషన్‌

సీఏపీఎఫ్‌లో 506 పోస్టులకు UPSC నోటిఫికేషన్‌

కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు UPSC నోటిఫికేషన్‌ విడుదలచేసింది. మొత్తం 506 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష నిర్వహించనుంది. ఈ ఉద్యోగాల కోసం మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగి, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ లింక్‌పై క్లిక్‌ చేసి అప్లై చేసుకోవచ్చు.

‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిర్మాతలపై చీటింగ్‌ కేసు

‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిర్మాతలపై చీటింగ్‌ కేసు

‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ సినిమా నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదైంది. ఈమూవీ నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ.. సినిమా లాభాల్లో 40% వాటా ఇస్తామని చెప్పి తనను మోసం చేశారంటూ సిరాజ్‌ వలియతార అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ఎర్నాకుళం కోర్టు..చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

విభజన హామీలు అమలుకావాలంటే నన్ను గెలిపించండి: నామా

విభజన హామీలు అమలుకావాలంటే నన్ను గెలిపించండి: నామా

TG: విభజన హామీలు అమలుకావాలంటే తనను గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. గతంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల, ప్రాజెక్టుల గురించి గళం విప్పానని చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో కొత్త రాష్ట్రం తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. కులమతాలకు అతీతంగా పని చేశానని, భవిష్యత్తులోనూ జిల్లా అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.