పశ్చిమ పవర్ ఎవరిది?
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. శుక్రవారం తొలి విడతలో భాగంగా ముస్లింల ప్రాబల్యమున్న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ బీజేపీ హిందుత్వపై ఆధారపడుతుండగా.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇండియా కూటమి బరిలోకి దిగింది.