కాంగ్రెస్ను ఆదుకున్న చరిత్ర మెదక్ది: సీఎం రేవంత్
కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న చరిత్ర మెదక్ గడ్డకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. ఇందిరమ్మను మెదక్ ఎంపీగా గెలిపిస్తే, ఆమె దేశానికే ప్రధాని అయ్యారన్నారు. ఇందిరమ్మ హయాంలోనే మెదక్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారని తెలిపారు.