ChotaNews Quick Feeds

చంద్రబాబు బస్సు యాత్ర పరిస్థితి ఇదట!

చంద్రబాబు బస్సు యాత్ర పరిస్థితి ఇదట!

AP: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు సంబంధించిన ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్(X)లో షేర్ చేశారు. చంద్రబాబు బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా వైసీపీకే ఓటు వేస్తారని తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి ట్వీట్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

పవన్ కల్యాణ్‌పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

పవన్ కల్యాణ్‌పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ సెటైర్లు వేసింది. పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా అభివర్ణిస్తూ.. ఆయనపై ఓ ప్రశ్నోత్తరాలతో కూడిన పోస్ట్‌ను విడుదల చేసింది.

స్కాట్లాండ్‌లో నీట మునిగి ఇద్దరు భారత విద్యార్థులు మృతి

స్కాట్లాండ్‌లో నీట మునిగి ఇద్దరు భారత విద్యార్థులు మృతి

స్కాట్లాండ్‌లోని లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతంలో నీట మునిగి ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జింతేంద్రనాథ్, చాణక్యలుగా గుర్తించారు. డూండీ యూనివర్సిటీలో చదువుకున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, వారిలో ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారని అక్కడి పోలీసులు వెల్లడించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, నేడు పోస్ట్‌మార్టం నిర్వహించి, బాడీలను ఇండియాకు తరలిస్తామన్నారు.