ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..!: అమెరికా
ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే యోచనలో ఉన్న దేశాలు పునరాలోచించుకోవాలని అగ్రరాజ్యం అమెరికా సూచించింది. లేనిపక్షంలో ఆంక్షలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. పాక్ పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ సోమవారం చర్చలు జరిపారు. వారి సమక్షంలో ఎనిమిది ఒప్పంద పత్రాలపై ఇరుదేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.