కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ED సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్గా పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో సమన్లు పంపినా హాజరలేదని.. విచారణకు సహకరించడం లేదని ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఆప్ నేతలు, ఇతరులతో కలిసి నేరానికి పాల్పడ్డారని.. ఇందులో కేజ్రీవాల్ ప్రధానపాత్ర పోషించారని పేర్కొంది.