ట్రాఫిక్లో ఇరుక్కున్న అంబులెన్స్
అనకాపల్లి: సీఎం జగన్ ‘మేము సిద్ధం’ సభ సందర్భంగా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో 108 అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. అక్కడున్నవారంతా ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి యత్నించినా ఫలితం లేకపోవడంతో చాలాసేపు అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లోనే ఉండవలసి వచ్చింది.