ఘాజీపూర్లో 144 సెక్షన్ విధింపు
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో భారీగా పోలీసులు మోహరించారు. గ్యాంగ్స్టర్-రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ మృతి చెందిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. అన్సారీ నివాసం వద్దకు పోలీసులు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్సారీ మరణవార్త విని ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు.