కాకర్లను కలిసిన గణేశ్వరపురం వాసులు
నెల్లూరు: వింజమూరులోని కాకర్ల ట్రస్ట్ కార్యాలయంలో గణేశ్వరపురం వాసులు ఉదయగిరి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ను కలిసి శాలువాతో సత్కరించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడి పని చేయాలని, మీ కష్టానికి గుర్తింపు ఉంటుందని ఆయన వారికి భరోసానిచ్చారు. పేరం సుధాకర్ రెడ్డి, కంచుపాటి ప్రశాంత్, గాదిపోగు కాటయ్య, యడవల్లి మాల్యాద్రి తదితరులు ఉన్నారు.