ChotaNews Quick Feeds

కాకర్లను కలిసిన గణేశ్వరపురం వాసులు

కాకర్లను కలిసిన గణేశ్వరపురం వాసులు

నెల్లూరు: వింజమూరులోని కాకర్ల ట్రస్ట్ కార్యాలయంలో గణేశ్వరపురం వాసులు ఉదయగిరి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను కలిసి శాలువాతో సత్కరించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడి పని చేయాలని, మీ కష్టానికి గుర్తింపు ఉంటుందని ఆయన వారికి భరోసానిచ్చారు. పేరం సుధాకర్ రెడ్డి, కంచుపాటి ప్రశాంత్, గాదిపోగు కాటయ్య, యడవల్లి మాల్యాద్రి తదితరులు ఉన్నారు.

‘సలార్‌ 2’లో  విజయ్‌ దేవరకొండ?

‘సలార్‌ 2’లో విజయ్‌ దేవరకొండ?

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘సలార్‌’. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.700 కోట్లు వసూలు సాధించింది. దీనికి సీక్వెల్‌గా ‘సలార్ 2’ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్‌ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని కోసమే విజయ్‌ను ప్రశాంత్ కలిశాడని టాక్. దీనిపై మూవీటీం స్పందించాల్సి ఉంది.

పోలింగ్ సమయం పెంచిన ఈసీ

పోలింగ్ సమయం పెంచిన ఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయంతీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సమయాన్ని రెండు గంటలు పొడిగించింది. బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. వేడిగాలుల దృష్ట్యా సమయాన్ని పొడిగించాలని బీహార్ సీఈవో.. ఈసీని కోరారు. దీంతో సమయాన్ని 6 గంటలవరకు పొడిగించింది.