ChotaNews Quick Feeds

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

కామారెడ్డి: వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ శాసనసభ సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్!

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్!

మహిళలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి అయిన ఆయన మహిళలకు టీడీపీ పుట్టినిల్లని వ్యాఖ్యానించారు. తాను తొలి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. ప్రతి కుటుంబానికి తాను పెద్దకొడుకులా సేవ చేస్తానని చెప్పారు. అమ్మకు వందనం ప‌థ‌కం కింద ప్రతి బిడ్డకు రూ.15వేలు ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే లక్ష్యమన్నారు.

ఎన్నికల ర్యాలీలో చిందేసిన పవన్ కల్యాణ్

ఎన్నికల ర్యాలీలో చిందేసిన పవన్ కల్యాణ్

ఎన్నికల నామినేషన్ ర్యాలీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ డాన్స్ వేశారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ నామినేషన్ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా కాలు కదిపి జనసైనికుల్లో జోష్ నింపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా పవన్ నిన్న పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.