విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
కామారెడ్డి: వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ శాసనసభ సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.