వినూత్న ‘సైకిల్’ ప్రచారం
AP : చిత్తూరులో TDP ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు MLA అభ్యర్థి గురజాల జగన్మోహన్కు మద్దతుగా కొందరు వినూత్న ప్రచారం చేపట్టారు. ఆరుగురు యువకుల బృందం ‘యూని’ సైకిళ్లతో వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వీటికే చిన్నపాటి మైకులు అమర్చుకున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలంటూ వారు చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది.