ChotaNews Quick Feeds

వినూత్న ‘సైకిల్‌’ ప్రచారం

వినూత్న ‘సైకిల్‌’ ప్రచారం

AP : చిత్తూరులో TDP ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు MLA అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌కు మద్దతుగా కొందరు వినూత్న ప్రచారం చేపట్టారు. ఆరుగురు యువకుల బృందం ‘యూని’ సైకిళ్లతో వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వీటికే చిన్నపాటి మైకులు అమర్చుకున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలంటూ వారు చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది.

తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తొలిదశ కింద 102 స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్‌ పూర్తికానుంది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో కూడా నేడు పోలింగ్‌ జరుగుతోంది.

గ్రేటర్‌పై కాంగ్రెస్ స్పెషల్‌ ఫోకస్‌

గ్రేటర్‌పై కాంగ్రెస్ స్పెషల్‌ ఫోకస్‌

HYD : గ్రేటర్‌ పరిధిలోని మూడు నియోజకవర్గాలపై సీఎం రేవంత్‌ స్పెషల్‌గా ఫోకస్‌ పెట్టారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా చేవెళ్ల MP రంజిత్‌ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకొని చేతిగుర్తుపై పోటీ చేయిస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకొని ఆయన సతీమణి సునీతరెడ్డికి మల్కాజిగిరి సీటిచ్చారు. ఇక సికింద్రాబాద్‌కు ఖైరతాబాద్‌ MLA దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించి CMప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు.