ChotaNews Quick Feeds

బాబు పేరు చెబితే మోసాలు, వెన్నుపోటు: CM జగన్

బాబు పేరు చెబితే మోసాలు, వెన్నుపోటు: CM జగన్

AP: చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాబు పేరు చెబితే మోసాలు, వెన్నుపోటు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తాయ‌న్నారు. 2014లో బాబు-ప‌వ‌న్‌-మోదీ క‌లిసి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌న్నారు. వారు మ‌రోసారి జ‌ట్టుక‌ట్టి ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికి రంగుల‌తో మేనిఫెస్టోతో వ‌స్తున్నార‌న్నారు. చంద్ర‌బాబుకు ఏపీలో నా అని పిలుచుకునే వ‌ర్గాలు లేవ‌ని చెప్పుకొచ్చారు.

శంషాబాద్ విమానాశ్రయంపై పీటర్సన్ ప్రశంసలు

శంషాబాద్ విమానాశ్రయంపై పీటర్సన్ ప్రశంసలు

ఇటీవల బెంగళూరు విమానాశ్రయంపై ప్రశంసలు కురిపించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ హైదరాబాద్ విమానాశ్రయం చూసి ముగ్ధుడయ్యాడు. శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించాడు. SRH, MI జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘ప్రపంచంలోని పలు గొప్ప విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడి టెక్నాలజీ, పరిశుభ్రత, షాపింగ్, ఫ్రెండ్లీ నేచర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయ`ని పేర్కొన్నాడు.

ఆ నిందితులపై రూ.10 లక్షల రివార్డు

ఆ నిందితులపై రూ.10 లక్షల రివార్డు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం ఎన్ఐఏ గాలింపు కొనసాగుతోంది. పేలుళ్లకు సూత్రధారులైన ముసావీర్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్‌లు పరారీలో ఉన్నారని తెలిపింది. ముజ్మిల్ అనే మరొకరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పరారీలో ఉన్న నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డు అందిస్తామని తెలిపింది.