కోటక్ బ్యాంక్పై RBI ఆంక్షలు
ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్కు ఆర్బీఐ షాకిచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అలాగే కొత్తగా క్రెడిట్ కార్డుల జారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. 2022, 2023 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఐటీ పరిశీలనలో గుర్తించిన లోపాలను సమగ్రంగా, సమయానుకూలంగా పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైనందునకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ పేర్కొంది.